India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఫార్ములా-ఈ రేస్ కేస్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ స్టేట్మెంట్ను ఏసీబీ రికార్డు చేసింది. దీని ఆధారంగా ఏసీబీ విచారణను ప్రారంభించనుంది. కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు నోటిసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ-రేస్లో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని దాన కిషోర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

మధ్యప్రదేశ్ భోపాల్లో ఇటీవల రోడ్డు పక్కన కారులో 52 కేజీల <<14936521>>బంగారం<<>>, రూ.11 కోట్ల నగదు లభ్యమైన విషయం తెలిసిందే. ఇది బిల్డర్గా మారిన ఆర్టీవో మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ అనుచరుడు చేతన గౌర్కు చెందిన కారుగా గుర్తించారు. తాజాగా, లోకాయుక్త పోలీసుల తనిఖీల్లో మాజీ కానిస్టేబుల్ సౌరభ్ ఇంట్లో రూ.2.87 కోట్ల నగదు, 234 కేజీల వెండిని సీజ్ చేశారు. వీరిద్దరిపై ఈడీ కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది.

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 14 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,209 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది. మరోవైపు, వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి నిన్న 1.40 లక్షల రూ.300 టికెట్లను ఆన్లైన్లో రిలీజ్ చేయగా అరగంటలోనే అయిపోయాయి.

TG: CM రేవంత్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని BJP MP ఈటల రాజేందర్ మండిపడ్డారు. క్రికెట్ ప్లేయర్స్, పొలిటికల్ లీడర్స్, సినిమా స్టార్స్కి పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ ఉంటుందని.. వారి పర్యటనల్లో ముందస్తు ఏర్పాట్లు అవసరమన్నారు. ఏదీ ఏమైనా, ఎవరి నిర్లక్ష్యమైనా ఒక నిండు ప్రాణం పోవడం బాధాకరమని చెప్పారు. ఈ ఘటన గుణపాఠం కావాలని, వీఐపీలు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు.

అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ వరుస ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. జెట్స్ ద్వారా బాంబులతో దాడి చేయగా పక్టికా ప్రావిన్స్లోని బార్మల్ జిల్లాలో చిన్నపిల్లలు, మహిళలతో సహా 15 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా, దాడులపై పాకిస్థాన్ అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అఫ్గాన్ బార్డర్లో దాక్కున్న తాలిబన్లను లక్ష్యంగా దాడులు చేసినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.

TG: ఈ సీజన్లో ఇప్పటివరకు 18.78 లక్షల టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీటికి రూ.939 కోట్లు బోనస్ ఇవ్వాలని నిర్ణయించగా ఇప్పటికే రూ.531 కోట్లు రిలీజ్ చేసినట్లు పేర్కొంది. గత ఏడాది ఇదే సమయానికి 41.20 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈ సారి 6 లక్షల టన్నులు అధికంగా సేకరించినట్లు అధికారులు తెలిపారు. ధాన్యం సేకరణలో కామారెడ్డి, NZB, మెదక్ ముందు వరుసలో ఉన్నాయి.

TG: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పెంచారు. నేటితో గడువు ముగియనుండగా, ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొన్నారు. మరోసారి గడువు పెంపు ఉండదని సమాచారం. రాష్ట్రంలో ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్, మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

TG: రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు ఎలాంటి సాగు భూమి లేదని ధరణి కమిటీ నివేదిక పేర్కొంది. వీరిలో 70శాతం దళితులేనని తెలిపింది. భూమి లేని పేదలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి ఉపాధి హామీ కార్డులు, కులగణన సర్వే వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని చూస్తోంది. మొదటి విడతగా వచ్చే నెలలో రూ.6 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.

భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడిగా పేరుగాంచిన అటల్ బిహారీ వాజ్పేయి జన్మించి నేటికి వంద సంవత్సరాలు పూర్తయింది. MPలోని గ్వాలియర్లో 1924 డిసెంబర్ 25న కృష్ణబిహారీ వాజ్పేయి, కృష్ణదేవి దంపతులకు ఆయన జన్మించారు. 1957లో తొలిసారి ఎంపీ అయిన వాజ్పేయి 5 దశాబ్దాల పాటు చట్టసభల్లో ఉన్నారు. 1996లో తొలిసారి ప్రధాని అయ్యారు. అణు పరీక్ష, రోడ్లు, కార్గిల్ యుద్ధంలో విజయం, సంస్కరణలు ఇలా దేశానికి ఎంతో సేవ చేశారు.

వాజ్పేయి పార్టీలకు అతీతంగా అభిమానం సొంతం చేసుకోవడంతో పాటు వ్యవహారశైలీ అలాగే ఉండేదని విశ్లేషకులు చెబుతారు. PV నరసింహారావు PMగా ఉన్నప్పుడు విపక్ష నేతగా ఉన్న వాజ్పేయిని ఐక్యరాజ్యసమితి సమావేశాలకు భారత ప్రతినిధిగా పంపారు. ఆయనపై PVకి ఉన్న నమ్మకం అలాంటిది. పాక్ సేనలతో పోరాడి బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన అప్పటి PM ఇందిరాను దుర్గాదేవితో పోల్చడం వాజ్పేయి భోళాతనానికి నిదర్శనమని రాజకీయవేత్తలు అంటారు.
Sorry, no posts matched your criteria.