News December 8, 2024

‘పుష్ప-2’ మూడు రోజుల కలెక్షన్లు ఎంతంటే?

image

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా రూ.621 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ కొత్త చరిత్రను లిఖిస్తుందని పేర్కొంది. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశముంది.

News December 8, 2024

మహాయుద్ధం గురించి ముందే ఆమె హెచ్చరిక?

image

సిరియాలో ప్రభుత్వం కూలిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాబా వంగా అనే జ్యోతిషురాలు చెప్పిన జోస్యం గురించి చర్చ నడుస్తోంది. ‘సిరియా ప్రభుత్వం పడిపోయినప్పుడు తూర్పు, పశ్చిమ దేశాల మధ్య ఓ యుద్ధం మొదలవుతుంది. అది 3వ ప్రపంచయుద్ధానికి దారి తీస్తుంది. చివరికి పశ్చిమ దేశాలు నాశనమవుతాయి’ అని పేర్కొన్నారు. 1996లో బాబా వంగా చనిపోయారు. అయితే, ఆమె చెప్పిన కొన్ని జోస్యాలు గతంలో నిజమయ్యాయి.

News December 8, 2024

రాహుల్ నాయ‌క‌త్వంపై మిత్ర‌ప‌క్షాల్లో ఆందోళ‌న‌: బీజేపీ

image

INDIA కూట‌మికి రాహుల్ సారథ్యంపై మిత్ర‌ప‌క్షాల్లో ఆందోళ‌న నెల‌కొంద‌ని BJP ఎద్దేవా చేసింది. కాంగ్రెస్‌పై SP అసంతృప్తిగా ఉంద‌ని, ఇదే భావనలో ఉన్న‌ మ‌మ‌తా బెన‌ర్జీ కూట‌మిని న‌డిపించ‌డానికి సిద్ధంగా ఉన్నట్టు ప్ర‌క‌టించార‌ని BJP ప్ర‌తినిధి న‌ళిన్ కోహ్లీ అన్నారు. దీనికి శ‌ర‌ద్ ప‌వార్ కూడా మ‌ద్ద‌తు ప‌ల‌కడం రాహుల్ నాయ‌క‌త్వంపై వారిలో నెల‌కొన్న ఆందోళన‌ల‌కు నిదర్శనమన్నారు. ఇందులో బీజేపీ ప్రమేయం లేదన్నారు.

News December 8, 2024

కమిటీ నివేదిక ఆధారంగా ధరణి ప్రక్షాళన: మంత్రి పొంగులేటి

image

TG: రైతులకు మేలు జరిగే సూచనలు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా ధరణి ప్రక్షాళన చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. 2024 ఆర్‌వోఆర్ కొత్త చట్టాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేస్తామని చెప్పారు. ధరణి కొత్త యాప్, కొత్త చట్టం సామాన్యులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News December 8, 2024

వాట్సాప్‌లో కొత్త ఫీచర్!

image

బిజీ వేళల్లో వాట్సాప్‌లో అన్ని సందేశాలను చూసుకోవడం వీలు పడదు. దీంతో కొన్నింటిని చూడకుండానే వదిలేస్తాం. ఇలాంటి వాటిని గుర్తు చేసేందుకు మెసేజ్ రిమైండర్ ఫీచర్ రానుంది. ఇది యాప్‌లో చదవకుండా వదిలేసిన సందేశాలను ట్రాక్ చేయడంలో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. అందుబాటులోకి రాగానే సెట్టింగ్స్‌లోని నోటిఫికేషన్‌లో ఉన్న రిమైండర్స్‌ను ఎంచుకొని యాక్టివేట్ చేసుకోవచ్చు.

News December 8, 2024

ఆడపిల్లల రక్షణకు కలిసిరండి: నిమ్మల

image

AP: మహిళలు, ఆడపిల్లల రక్షణే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మహిళలపై ఇటీవల జరుగుతున్న దాడులు బాధాకరమని, వీటిని అరికట్టాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆడబిడ్డలను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కొందరు డ్రగ్స్, గంజాయికి బానిసలయ్యారని, ఈగల్ టీమ్ ద్వారా వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

News December 8, 2024

అక్కినేని కుటుంబంపై సురేఖ వ్యాఖ్యలు తప్పే: టీపీసీసీ చీఫ్

image

TG: కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత అంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయని మండిపడ్డారు. అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు తప్పని ఆయన అన్నారు. వెంటనే ఆమె సారీ చెప్పినట్లు గుర్తుచేశారు. ఆవిడపై సోషల్‌మీడియాలో జరిగిన ప్రచారమే దీనికి కారణమైందని, ఈ విషయంలో తాను చొరవ తీసుకోవడంతో వివాదం కాస్త సద్దుమణిగిందని పేర్కొన్నారు.

News December 8, 2024

2047 నాటికి 30 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్‌: ప్ర‌ధాన్

image

దేశ ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ పేర్కొన్నారు. జంషెడ్‌పూర్‌ XLRI మేనేజ్‌మెంట్ స్కూల్ ప్లాటినం జూబ్లీ ఉత్స‌వాల్లో ఆయ‌న మాట్లాడారు. $3 ట్రిలియన్ల పరిమాణంతో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందన్నారు. మరో 3 ఏళ్లలో $5 ట్రిలియన్‌లతో 3వ స్థానానికి చేరుతుందని, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా నిలుస్తుందన్నారు.

News December 8, 2024

భారీగా తగ్గిన టికెట్ ధరలు

image

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ టికెట్ల ధరలు భారీగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని – మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150-100 మేర తగ్గాయి. రేపటి నుంచి ఈ ధరలు అందుబాటులోకి రానున్నాయి. బుకింగ్ సైట్‌లలో తగ్గించిన ధరలు అందుబాటులో ఉన్నాయి. కాగా మూవీకి టికెట్ ధరలు భారీగా పెంచడంపై పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.

News December 8, 2024

ప్రతీ శీతాకాలం భారత్‌కు వచ్చే అరుదైన అతిథులు

image

ఇండియాకు ఉన్న భౌగోళిక వైవిధ్యం దృష్ట్యా శీతాకాలంలో కొన్ని పక్షులు వందల, వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌కు వస్తుంటాయి. వాటి స్వస్థలాల్లో వాతావరణం ఇబ్బందిగా ఉండటం ఈ వలసలకు కారణం. వాటిలో సైబీరియన్ క్రేన్, డన్లిన్, బార్ హెడెడ్ గూస్, నార్తర్న్ పిన్‌టెయిల్, కామన్ రెడ్‌షాంక్, గ్రేటర్ ఫ్లెమింగో, రోజీ పెలికాన్, బ్లాక్ టెయిల్డ్ గాడ్‌విట్, బ్లూ థ్రోట్, బ్లాక్ క్రౌన్డ్ నైట్ హెరోనా తదితర పక్షులు ఉన్నాయి.