India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జమ్మూకశ్మీర్ సీఎంగా ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో JKPCC చీఫ్ తారిక్ హమీద్ కర్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ప్రస్తుతానికి J&K ప్రభుత్వ మంత్రివర్గంలో చేరట్లేదని చెప్పారు. రాష్ట్ర హోదా పునరుద్ధరించాలనే డిమాండ్కు తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దీని కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రసంగంలో ప్రధాని ఇదే హామీని ఇచ్చారని గుర్తు చేశారు.
తొలి టెస్టులో సత్తాచాటేందుకు నెట్స్లో ప్రాక్టీస్ చేసిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ వర్షం పడుతుండటంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు కరుణిస్తే న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తానన్నట్లు ఆయన ఎదురుచూస్తున్న ఫొటో వైరలవుతోంది. వర్షంలోనూ తన కిట్తో గ్రౌండ్లో తిరుగుతూ కనిపించారు. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ మొదలుకావాల్సి ఉండగా వర్షం కారణంగా ఇంకా టాస్ కూడా పడలేదు.
కన్నడ హీరో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా రేణుకాస్వామి భార్య సహన మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగానే ఉందని స్థానిక కథనాలు పేర్కొన్నాయి. హీరోయిన్ పవిత్రకు అసభ్యకర సందేశాలు పంపారని రేణుకాస్వామిని దర్శన్ అనుచరులు చిత్రహింసలకు గురిచేసి చంపారనే ఆరోపణలు దక్షిణాదిలో సంచలనం సృష్టించాయి. కాగా రేణుకా స్వామి మరణించిన సమయంలో సహన 5 నెలల గర్భిణి.
దాదాపు రెండేళ్లుగా ఇద్దరు స్టార్లు బిగ్ స్క్రీన్పై కనిపించలేదు. ఎట్టకేలకు వీరి సినిమాలు రిలీజ్ కానుండటంతో అభిమానుల్లో ఆత్రుత నెలకొంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబోలో ‘గేమ్ ఛేంజర్’ (JAN 10), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో ‘పుష్ప-2’ (DEC 6) సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాల నుంచి సాంగ్స్, టీజర్స్ విడుదలయ్యాయి. మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.
వరుణ్ ధవన్, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిరీస్ ‘సిటాడెల్’. ఇందులో ఓ యాక్షన్ సన్నివేశాన్ని 11 నిమిషాల పాటు సింగిల్ టేక్లో చేసినట్లు వరుణ్ వెల్లడించారు. ఇది సిరీస్ క్లైమాక్స్లో రానున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇది నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో అందుబాటులో ఉండనుంది.
TG: క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఐఏఎస్లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం మధ్యాహ్నం 2.30గంటలకు వాదనలు విననుంది. ఏపీకి వెళ్లాలంటూ ఐఏఎస్లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్ను క్యాట్ ఆదేశించిన విషయం తెలిసిందే.
బియ్యాన్ని నానబెట్టి వండితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
*గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.
*జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి, మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
*బియ్యంలోని పోషకాలు శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి.
**ఎక్కువ సేపు నానబెట్టకుండా అరగంట సేపు నానబెడితే చాలని చెబుతున్నారు.
కెనడా ఓ సంచలన విషయం బయటపెట్టిందండోయ్! 39 ఏళ్ల క్రితం అంటే 1985లో AI విమానం 182ను అటాక్ చేసింది 31 ఏళ్ల లారెన్స్ బిష్ణోయ్ అని తేల్చేసింది. ‘పుట్టడానికి ఎనిమిదేళ్ల ముందే మేజర్ టెర్రర్ అటాక్ చేశాడంటే ఎనిమిదేళ్ల వయసులో ఏం చేయగలడో ఊహించుకోవచ్చు’ అని ట్రూడో ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు స్టేట్మెంట్ ఇచ్చారు. 9/11 సహా ప్రపంచంలో జరిగిన ప్రతి దాడికీ అతడి కనెక్షన్ ఉందేమోనని USకు చెప్తానని ట్రూడో అన్నారు.
దర్శకుడు వి.వి.వినాయక్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘విశ్వంభర’కు సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ విషయంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్. కాగా చిరంజీవి, వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఠాగూర్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
TG: ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. జడ్జి అందుబాటులో లేకపోవడంతో నవంబర్ 14కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన ఛార్జిషీట్లో రేవంత్ను ఈడీ ఏ1 నిందితుడిగా పేర్కొంది. ఆయన రూ.50 లక్షల అక్రమాలకు పాల్పడినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.