News September 9, 2024

బుడమేరుపై ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలి: పవన్

image

AP: వరద విపత్తు నుంచి కోలుకునేందుకు విజయవాడకు కాస్త సమయం పట్టొచ్చని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నది, వాగు పరివాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. హైడ్రా వంటి వ్యవస్థ కంటే ముందుగా బుడమేరుపై ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలని, తెలిసో తెలియకో చాలా మంది కొన్నారని తెలిపారు. భారీ వర్షాలతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని, సీఎం చంద్రబాబు రాత్రింబవళ్లు పని చేస్తున్నారని పేర్కొన్నారు.

News September 9, 2024

ప్రభుత్వంలో మేం భాగస్వామ్యం కాదు: కూనంనేని

image

TG: ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ మాత్రమే చేశామని, ప్రభుత్వంలో CPI భాగస్వామ్యం కాదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. పార్టీ మారిన MLAల పదవిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపు MLAలపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. వరదలను జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్రం TGకి రూ.6వేల కోట్లు ఇవ్వాలని కోరారు. SEP 11-17 వరకు రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జరుపుతామన్నారు.

News September 9, 2024

ఆరోగ్యం సరిగా లేకపోయినా వచ్చా: పవన్

image

AP: గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. గొల్లప్రోలులోని జగనన్న కాలనీ స్థలాన్ని లోతట్టు ప్రాంతంలో కొనడంతో అవి మునుగుతున్నాయని తెలిపారు. ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై సమీక్షించి సూచనలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల బాధలు స్వయంగా పరిశీలించేందుకే ఈ రోజు ఆరోగ్యం సరిగా లేకపోయినా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చానని వివరించారు.

News September 9, 2024

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్!

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్ చివరలో డియర్‌నెస్ అలవెన్స్/ డియర్‌నెస్ రిలీఫ్‌ పెంపుపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2024 జనవరి నుంచి 50% DA ఇస్తుండగా మరో 3% పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 25న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం ప్రకటించవచ్చు. జులై, ఆగస్టు, SEP నెలల బకాయిలు అక్టోబర్ జీతంతో కలిపి చెల్లించనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

News September 9, 2024

చెంపదెబ్బ కొట్టిన VROకు షోకాజ్ నోటీసులు

image

AP: విజయవాడలో వరద బాధితుడిని <<14060791>>చెంపదెబ్బ<<>> కొట్టిన VRO జయలక్ష్మిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అలాగే వరద సహాయక చర్యల నుంచి తొలగించారు. తమకు ఆహారం, నీళ్లు అందించలేదని నిలదీసిన స్థానికులపై VRO దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే.

News September 9, 2024

లేజర్ ఎఫెక్ట్.. యువకుడి కంటిలో రక్తస్రావం

image

గణేశ్ ఉత్సవాల్లో లేజర్ లైట్ కిరణాల ప్రభావంతో ఓ యువకుడి కంటి రెటీనాలో అంతర్గత రక్తస్రావం జరిగిన ఘటన MHలోని కొల్హాపూర్‌లో జరిగింది. మరో ఘటనలో ఓ కానిస్టేబుల్‌ కన్ను ఈ లైట్ల కారణంగా ఎర్రగా మారి వాచింది. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా లేజర్ లైట్ పవర్ 5 మిల్లీవాట్స్ దాటితే కంటి చూపు సైతం పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో వీటిని బ్యాన్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.

News September 9, 2024

వరద బాధితులకు దుస్తులూ పంపిణీ చేస్తాం: సీఎం చంద్రబాబు

image

AP: విజయవాడ వరద బాధితులకు నిత్యావసరాలతోపాటు దుస్తులు కూడా ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆప్కో, ఇతర సంస్థల నుంచి వస్త్రాలను కొనుగోలు చేసి పంపిణీ చేస్తామన్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బుడమేరు నుంచి కొల్లేరుకు నీళ్లు వెళ్లకుండా కబ్జాలు చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని, గత పాలకుల పాపాలు ఇప్పుడు శాపాలుగా మారాయని విమర్శించారు.

News September 9, 2024

సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు నేరస్థులకు హెచ్చరికగా ఉండాలి: గంగూలీ

image

కోల్‌కతాలో వైద్యురాలి హత్యాచార ఘటనలో న్యాయం కోసం జరుగుతున్న ఉద్యమాన్ని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ గంగూలీ ప్రశంసించారు. ఈ కేసులో వీలైనంత త్వరగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలని, నిందితుడికి విధించే శిక్ష ప్రపంచ దేశాలకు ఓ ఉదాహరణ కావాలని అభ్యర్థించారు. ఇలాంటి నేరాలు చేయాలన్న ఆలోచన రాకుండా ఓ హెచ్చరికగా తీర్పు ఉండాలన్నారు. ఈ కేసుపై అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 17న మరోసారి విచారించనుంది.

News September 9, 2024

BIG BREAKING: దేశంలో తొలి ఎమ్‌పాక్స్ కేసు

image

ప్రపంచ దేశాలను వణికిస్తున్న <<13895234>>ఎమ్‌పాక్స్<<>> ఇండియాలో ప్రవేశించింది. విదేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ వ్యక్తి మంకీ పాక్స్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. అతడిని పరీక్షించగా పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది.

News September 9, 2024

పద్మ అవార్డులకు మీరే నామినేట్ చేయండి.. ప్రజలకు ప్రధాని పిలుపు

image

పదేళ్లుగా ఎంతో మంది క్షేత్రస్థాయి హీరోలను పద్మ అవార్డులతో సత్కరించామని ప్రధాని మోదీ చెప్పారు. వారి జీవిత ప్రయాణాలు ఎంతోమందిని చైతన్యవంతం చేశాయన్నారు. ‘వ్యవస్థను మరింత పారదర్శకంగా, ప్రజలను భాగస్వామ్యులు చేసేందుకు వివిధ పద్మ అవార్డులకు స్ఫూర్తిదాయక వ్యక్తులను <>https://awards.gov.in/<<>> వెబ్‌సైట్ ద్వారా నామినేట్ చేయాలని ఆహ్వానిస్తున్నాం. ఈ నెల 15 చివరి తేదీ’ అని ట్వీట్ చేశారు.