India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

JIO, AIRTEL, VIకు BSNL గట్టి పోటీనిస్తోందని పరిశ్రమ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 3G, సర్వీస్ సమస్యలున్నప్పుడే ఇలావుంటే 4G/5G, నెట్వర్క్ విస్తరణ, శాటిలైట్ సర్వీసులు ఆరంభిస్తే చుక్కలు తప్పవని వారి అంచనా. PVT ఆపరేటర్లు రీఛార్జి ప్లాన్లను 25% మేర పెంచడం తెలిసిందే. దీంతో 4 నెలల్లోనే BSNLలో 65 లక్షల కొత్త కస్టమర్లు చేరారు. పునరుజ్జీవంపై ఫోకస్ పెట్టిన ఈ సంస్థ ఇప్పట్లో ధరలు పెంచదని సమాచారం. మీ COMMENT?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత మహిళల జట్టు 34.2 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్ మెగన్ 5 వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించారు. టీమ్ ఇండియా బ్యాటర్లలో రోడ్రిగ్స్(23)దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఆస్ట్రేలియా టార్గెట్ 101.

సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్-రష్మిక జంటగా నటించిన పుష్ప-2 సినిమా థియేటర్లలో అదరగొడుతోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం దాదాపు రూ.250 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడంతో సంక్రాంతి తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వీలైనన్ని ఎక్కువ రోజులు థియేట్రికల్ రన్ కొనసాగిస్తామని మూవీ వర్గాలు చెబుతున్నాయి.

TG: పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయని BRS, ఏడాదిలో ఇన్ని పథకాలు అమలు చేస్తున్న తమను విమర్శించడం ఏంటని CM రేవంత్ అన్నారు. ‘తొలి ఏడాదిలో 5నెలలు ఎలక్షన్ కోడ్ వల్ల సచివాలయానికి వెళ్లలేకపోయాం. మిగిలిన 6నెలల్లో పరిపాలనను గాడిలో పెట్టాం. KTR, హరీశ్ది చిన్నపిల్లల మనస్తత్వం. మనదగ్గర లేని బొమ్మ పక్కోడి దగ్గర ఉంటే విరగ్గొట్టాలనే ఆలోచన ఉంటుంది. వారికి తెలియదేమో కానీ KCRకి కూడా అవగాహన లేదా?’ అని ప్రశ్నించారు.

TG: ఈనెల 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలని CM రేవంత్ కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయనను ఆహ్వానిస్తారన్నారు. ప్రతిపక్ష నేత సీటు ఖాళీగా ఉండటం బాగోలేదన్నారు. సభకు వచ్చి సూచనలు, సలహాలివ్వాలని చెప్పారు. కేసీఆర్ కంటే తామంతా జూనియర్ ఎమ్మెల్యేలమని, ఆయన పెద్దరికం నిలబెట్టుకోవడం లేదన్నారు. పిల్లలు తప్పు చేస్తుంటే KCR ఆపడం లేదని, రాక్షసులను తయారుచేసి ఉసిగొల్పడం మంచిదా అని ప్రశ్నించారు.

TG: పదేళ్ల BRS హయాంలో పేదలకు ఇళ్లు కేటాయించలేదని CM రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘KCR తనకు అవసరమైన ప్రగతిభవన్ను ఆఘమేఘాల మీద పూర్తి చేశారు. వాస్తు కోసం సచివాలయాన్ని కూలగొట్టి కొత్తదాన్ని వేగంగా నిర్మించుకున్నారు. ప్రతి జిల్లాలో BRS కార్యాలయాలను కట్టుకున్నారు. గజ్వేల్, జన్వాడ ఫామ్హౌస్ల నిర్మాణంపైనే KCR దృష్టి పెట్టారు కానీ పేదల ఇళ్ల పథకానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు’ అని CM విమర్శించారు.

‘4ఏళ్ల సర్వీసులో 4 ప్రమోషన్లు, 10 ట్రాన్స్ఫర్లు, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నమాట’ విక్రమార్కుడు మూవీలో ఈ డైలాగ్ చాలా ఫేమస్. నిజజీవితంలోనూ అలాంటి ఆఫీసర్ ఉన్నారు. IAS అశోక్ ఖేమ్కా 33ఏళ్ల కెరీర్లో 57వ సారి బదిలీ అయ్యారు. 2025 APR 30న రిటైర్డ్ కానున్న ఆయన తాజాగా హరియాణా రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1991 బ్యాచ్కు చెందిన ఈయన నిజాయితీగా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

TG: అర్హులైన వారికే ప్రభుత్వ ఇళ్లు దక్కాలనేదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తొలి ఏడాదిలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. తొలి దశలో SC, ST, ట్రాన్స్జెండర్లు, అత్యంత పేదలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ఆదివాసీ ప్రాంతాల్లో జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక కోటా అమలు చేస్తామన్నారు.

AP: కృష్ణా జిల్లాలోని పలు రైతు సేవా కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించి రికార్డుల్లో తక్కువ చూపించడంపై మండిపడ్డారు. దీంతో ఇద్దరు కస్టోడియల్ ఆఫీసర్లు, టీఏను అధికారులు సస్పెండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

భారీ స్థాయిలో విడుదలైన ‘పుష్ప-2’ అప్పుడే లీక్ అయింది. రిలీజై 24 గంటలు కాకముందే ఆన్లైన్లోని పైరసీ సైట్లలో సినిమా దర్శనమిస్తోంది. ఇంత త్వరగా సినిమా లీక్ అవడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. సుమారు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు.
Sorry, no posts matched your criteria.