India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తేది: సెప్టెంబర్ 09, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:51 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:03 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:13 గంటలకు
అసర్: సాయంత్రం 4:38 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:23 గంటలకు
ఇష: రాత్రి 7.36 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: సెప్టెంబర్ 09, సోమవారం
షష్ఠి: రా.9.53 గంటలకు
విశాఖ: సా.6.04 గంటలకు
వర్జ్యం: రా.10.24-రా.12.08 గంటల వరకు
దుర్ముహూర్తం: తెల్లవారుఝామున.12.26- 1.18 గంటల వరకు
మ.2.56-3.45 గంటల వరకు
తమిళ సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక దాడులకు ఒడిగట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ తెలిపారు. ఈ మేరకు నేడు జరిగిన సంఘం 68వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానించామని తెలిపారు. ‘సంఘం ఇప్పటికే కమిషన్ ఏర్పాటు చేసింది. ఫిర్యాదు వస్తే తప్పు చేసినవారిపై తీవ్ర చర్యలుంటాయి’ అని వివరించారు. మహిళలకు ధైర్యాన్నిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నామని సంఘం ట్రెజరర్ నాజర్ పేర్కొన్నారు.
➣AP: బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం: CBN
➣AP: అతి భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు
➣TG: జర్నలిస్టులకు భూమి పత్రాలు అందించిన CM రేవంత్
➣బురద రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్: లోకేశ్
➣పబ్లిసిటీకే ప్రాధాన్యం ఇచ్చిన CBN: కురసాల
➣TG:కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నాం: హైడ్రా కమిషనర్
➣ ప్రజా ప్రభుత్వం.. కూల్చేదేమో పేదల ఇళ్లు: KTR
➣31 సాకులతో రైతు రుణమాఫీకి కోతలు: హరీశ్
AP: దేశ వ్యాప్తంగా వినాయక నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నెల్లూరులో గణేశుడి లడ్డూ రికార్డు ధర పలికింది. మాగుంట లే అవుట్లో ఏర్పాటు చేసిన మండపంలో లడ్డూ వేలం పాట నిర్వహించగా, పోటాపోటీలో చివరకు రూ.8.01 లక్షలు పలికింది. తేజస్విని గ్రాండ్ అధినేత శ్రీనివాసులు రెడ్డి లడ్డూని వేలంలో దక్కించుకున్నారు.
AP: అల్లూరి జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయన్న హెచ్చరికలతో కలెక్టర్ దినేశ్ కుమార్ ప్రజలను అప్రమత్తం చేశారు. వాగులు, గెడ్డలు దాటేందుకు ప్రయత్నించవద్దని స్పష్టం చేశారు. వాహనదారులు ఘాట్ రోడ్లలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో నర్సీపట్నం-సీలేరు, వడ్డాది-పాడేరు, అరకు-అనంతగిరి, రంపచోడవరం-మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్లపై వాహనాల రాకపోకలను నిషేధించారు.
ఇటీవల విజయవాడలో గూగుల్ మ్యాప్ను నమ్ముకొని తల్లీకొడుకు బుడమేరు వాగులో చిక్కుకున్న ఘటన తరహాలోనే మరొకటి జరిగింది. శ్రీశైలం దర్శనం ముగించుకున్న 9 మంది గూగుల్ మ్యాప్ పెట్టుకొని కారులో రిటర్న్ అయ్యారు. అయితే అది వారిని నేరుగా TGలోని నాగర్ కర్నూల్ జిల్లా సిర్సవాడ దుందుభి వాగులోకి తీసుకెళ్లింది. అక్కడ చిక్కుకున్న వారిని గ్రామస్థుల సహాయంతో పోలీసులు ట్రాక్టర్తో క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.
చైనాలో సప్లై చెయిన్ సొల్యూషన్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సేవల కోసం అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ(సబ్సిడరీ)ను ప్రారంభించింది. అదానీ ఎనర్జీ రిసోర్సెస్(షాంఘై) కో(AERCL)ను ఈ నెల 2న స్టార్ట్ చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. అదనపు వివరాలను మాత్రం పేర్కొనలేదు. కాగా కొన్ని రోజుల క్రితమే కెన్యాలో అదానీ గ్రూపు ఓ సబ్సిడరీని ప్రారంభించింది. ఆ దేశంలో 7 ఎయిర్పోర్టుల్ని సంస్థ మేనేజ్ చేస్తోంది.
గణేశ్ మండపం వద్ద DJ విషయంలో యువకుల మధ్య ఏర్పడిన వాగ్వాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా నందిని PS పరిధిలో వినాయకచవితి ముందు రోజు మండపం వద్ద DJకు డాన్స్ చేస్తుండగా కొందరు యువకుల మధ్య వాగ్వాదం జరగ్గా, స్థానికుల జోక్యంతో ముగిసింది. తర్వాతి రోజు మండపం వద్ద ఇరువర్గాలు కర్రలు, మారణాయుధాలతో దాడి చేసుకోగా, ఓ వర్గానికి చెందిన ముగ్గురు యువకులు చనిపోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
Sorry, no posts matched your criteria.