News April 8, 2025

పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్

image

TG: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇవాళ్టి నుంచి జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో తాము కాలేజీలు నడపలేకపోతున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందించింది. ఆస్తులు అమ్మి కాలేజీలు నడుపుతున్నామని, నాలుగేళ్లుగా బకాయిలు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

News April 8, 2025

ఫ్యామిలీతో అల్లు అర్జున్ బర్త్ డే సెలబ్రేషన్స్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. భార్య స్నేహ, కూమారుడు అయాన్, కూతురు అర్హతో కలిసి కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను స్నేహ ఇన్‌స్టాలో పోస్ట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు అభిమానుల నుంచి ఆయనకు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. HAPPY BIRTH DAY ANNA అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

News April 8, 2025

చిన్నారులపై లైంగికదాడులు.. నిందితుల అరెస్ట్

image

తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులపై అత్యాచార ఘటనలు కలకలం రేపాయి. ఆదిలాబాద్‌లోని మావలలో 12 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. APలోని ఎన్టీఆర్ జిల్లాలో ఆరేళ్ల బాలికపై 43 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో చుట్టు పక్కన వాళ్లు అప్రమత్తమై నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

News April 8, 2025

రెండేళ్లలో 12 భాషల్లో ఇంజినీరింగ్ పుస్తకాలు

image

మరో రెండేళ్లలో 12 భాషల్లో ఇంజినీరింగ్ పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతమైందని AICTE ఛైర్మన్ సీతారాం తెలిపారు. ఇంజినీరింగ్ డిప్లోమా, డిగ్రీ కోర్సుల మొదటి, రెండో సంవత్సరాల కోసం 600 పుస్తకాలు సిద్ధమైనట్లు తెలిపారు. 3, 4వ సంవత్సరాలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఈ పుస్తకాలను అనువదించేందుకు ఏఐ సాంకేతికను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.

News April 8, 2025

నేడు భారత్‌కు వస్తున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్

image

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ మఖ్తూమ్ రెండు రోజుల పర్యటన కోసం నేడు భారత్ వస్తున్నారు. రెండు దేశాల మధ్య ట్రేడ్, వ్యూహాత్మక సంబంధాలపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నారు. యువరాజు హోదాలో ఇది ఆయన తొలి భారత పర్యటన. ఇటీవల అబుదాబి క్రౌన్ ప్రిన్స్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇండియాలో పర్యటించిన విషయం తెలిసిందే.

News April 8, 2025

రేషన్ లబ్ధిదారులకు షాక్

image

TG: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం తీసుకుందామనుకున్న రేషన్ లబ్ధిదారులకు డీలర్లు షాకిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో షాపులు ఓపెన్ చేయడం లేదు. మిగతా చోట్ల టైం పాటించడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దీంతో రేషన్ షాపులు ఎప్పుడు తీస్తారోనని లబ్ధిదారులు వాటి చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు దీనిపై ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు. మీ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందా?

News April 8, 2025

రొయ్యల ధరలు తగ్గించొద్దని ప్రభుత్వం సూచన

image

AP: అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించొద్దని ఎగుమతి చేసే వ్యాపారులకు ప్రభుత్వం సూచించింది. 100 కౌంట్ రొయ్య కిలోకు రూ.220 చొప్పున ఇవ్వాలని ఆదేశించింది. USA సుంకాలు, ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం 11 మందితో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. గోదావరి జిల్లాల్లో ఆక్వా చెరువులకు కాలువల ద్వారా నీరు అందిస్తామని ఆక్వా రైతులు, భాగస్వాములు, వ్యాపారులతో భేటీలో CM CBN వెల్లడించారు.

News April 8, 2025

విజయవాడలో పూర్తిస్థాయి పాస్‌పోర్ట్ ఆఫీస్

image

AP: విజయవాడలో ఉన్న ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీస్‌ ఈరోజు నుంచి పూర్తి స్థాయిలో సేవలందించనుంది. ఈ మేరకు కేంద్ర సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్ కొత్త ఆఫీస్‌ను నేడు ప్రారంభించనున్నారు. ఇన్నాళ్లూ పాస్‌పోర్టు ముద్రణ, జారీ కోసం వైజాగ్ పాస్‌పోర్ట్ ఆఫీస్‌కు పంపిస్తుండగా ఇకపై ఇక్కడే ముద్రించనున్నారు. దీంతో పాస్‌పోర్ట్ జారీ సమయం గణనీయంగా తగ్గనుంది. తప్పొప్పుల సవరణను కూడా ఇకపై 3 గంటల్లోనే పూర్తిచేయనున్నారు.

News April 8, 2025

ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కవిత దీక్ష

image

TG: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఇందిరాపార్కు వద్ద దీక్ష చేయనున్నారు. ఇప్పటికే పలుమార్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఇదే విషయమై వినతిపత్రం ఇచ్చినా స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉ.10 గంటల నుంచి సా.5 గంటల వరకు దీక్ష సాగనుంది. ఈ దీక్షలో బీసీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

News April 8, 2025

IPL: చరిత్ర సృష్టించాడు

image

ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ IPLలో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ మెగాటోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా నిలిచారు. 179 మ్యాచుల్లో 184 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో బ్రావో(183), మలింగ(170), బుమ్రా(165), ఉమేశ్ యాదవ్(144) ఉన్నారు. ఓవరాల్‌గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో స్పిన్నర్ చాహల్(206) ముందున్నారు.