India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తన పరువుకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశారంటూ కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు పంపారు. అవాస్తవాలు ప్రచారం చేయడంతోపాటు అసభ్యంగా మాట్లాడారని తెలిపారు. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారంటూ హేమపై కేసు నమోదవడంతో MAA ఆమెను సస్పెండ్ చేసింది. తర్వాత టెస్టుల్లో నెగటివ్ రిపోర్టు రావడంతో సస్పెన్షన్ను ఎత్తేసింది. ఇదే విషయంపై కళ్యాణి, హేమకు గతంలో చాలాసార్లు <<13300086>>వాగ్వాదాలు<<>> జరిగిన విషయం తెలిసిందే.

AP వ్యాప్తంగా క్రమంగా ఎండతీవ్రత పెరగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం(07-04-25) రాయలసీమలో 40-42°C, ఉత్తరాంధ్రలో 39-41°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సుందన్నారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు.

పంటలకు సరైన మద్దతు ధర ఇవ్వాలని 131 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన రైతు కేంద్రమంత్రుల హామీతో నేడు దీక్ష విరమించారు. పంజాబ్కు చెందిన జగజీత్ సింగ్ దల్లేవాల్ రైతుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ గతేడాది నవంబర్ 26న దీక్ష చేపట్టారు. అతని ఆరోగ్యం విషమించడంతో వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, రైల్వేశాఖ సహాయ మంత్రి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతు దీక్ష విరమించారు.

తెలంగాణలో నేషనల్ హైవేల నిర్మాణానికి భూసేకరణ వేగవంతం చేయాలని CM రేవంత్కు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లేఖ రాశారు. ‘ప్రస్తుతం TGలో ₹12,619Crతో 691KM పొడవైన రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందుకు 1,550హెక్టార్ల భూమి అవసరం కాగా 904హెక్టార్లనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించింది. మిగతా భూమిని త్వరగా సేకరిస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయి. రవాణా వ్యవస్థ మెరుగుపడి అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నారు.

ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI)లోని పలు విభాగాల్లో 119 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి ఈ నెల 20 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంబీఏ చేసిన వారు అర్హులు. SC/STలు రూ.250, మిగతా వారు రూ.1,050 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: <

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నాలుగు రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరారు. పోర్చుగల్, స్లోవేకియా దేశాల అధ్యక్షుల ఆహ్వనం మేరకు రాష్ట్రపతి ఆ దేశాలకు వెళ్లనున్నారు. 7,8న పోర్చుగల్లో 9,10 తేదీలలో స్లోవేకియాలో ఆమె పర్యటించనున్నారు. ఈ దేశాలలో భారత రాష్ట్రపతి పర్యటించడం దాదాపు 25 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

IPL2025: ఉప్పల్ వేదికగా SRHతో జరుగుతున్న మ్యాచ్లో GT కెప్టెన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు.
GT: సాయి సుదర్శన్, గిల్, బట్లర్, తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, సుందర్, సాయి కిషోర్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్
SRH: హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్, క్లాసెన్, అనికేత్, కమిందు, కమిన్స్, అన్సారీ, ఉనద్కత్, షమీ

TG: భద్రాచలం పర్యటనలో భాగంగా సారపాకలో ఓ రేషన్ లబ్ధిదారుడి ఇంట సన్నబియ్యంతో భోజనం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ‘పేదవాడి ఇంట కంచంలో సన్నబియ్యం, కళ్లల్లో ఆనందం స్వయంగా చూశా. సారపాకలో లబ్ధిదారుల ఇంట సహపంక్తి భోజనం చేసి పథకం అమలును స్వయంగా పరిశీలించా’ అంటూ సీఎం రాసుకొచ్చారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం, తెలంగాణ రైజింగ్ అంటూ హ్యాష్ట్యాగ్లను జతపరిచారు.

ముంబై జట్టుకు గుడ్న్యూస్. నిన్న జట్టుతో చేరిన స్టార్ పేసర్ బుమ్రా రేపు RCBతో జరిగే MI ప్లేయింగ్ 11కు అందుబాటులో ఉండనున్నారు. నెట్స్లో ఈ స్పీడ్ గన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నట్లు హెడ్ కోచ్ జయవర్దనే వెల్లడించారు. రేపు RCBతో జరిగే మ్యాచ్కు మ్యాచ్లో ఆడే వీలుందని ఆయన చెప్పారు. కాగా తొలుత రేపు జరిగే మ్యాచ్కు బుమ్రా అందుబాటులో ఉండరనే ప్రచారం జరిగింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్పై స్త్రీ-2 మూవీ నిర్మాత దినేశ్ విజాన్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. శ్రద్ధా నవ్వితే అచ్చం దెయ్యంలా ఉంటుందని, అందుకే స్త్రీ మూవీలో ఎంపిక చేసినట్లు దినేశ్ చెప్పారని ఆ సినిమా డైరెక్టర్ అమర్ కౌశిక్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో శ్రద్ధా ఫ్యాన్స్ దినేశ్పై మండిపడుతున్నారు. ఆమె పేరుతో డబ్బులు సంపాదించుకుని ఇలా అవమానించడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.