News September 7, 2024

సచివాలయాలు, వాలంటీర్లు ఉండి ఉంటే..: జగన్

image

CM చంద్రబాబు ప్రచార ఆర్భాటాల వల్ల సహాయక చర్యల్లో సమన్వయ లోపం నెలకొందని YS జగన్ ట్వీట్ చేశారు. ‘మీకూ, మంత్రి నాదెండ్లకు మధ్య జరిగిన సంభాషణపై వైరల్ అయిన వీడియోనే దీనికి సాక్ష్యం. వర్షాలు ఆగి 5 రోజులు అయిన తర్వాత కూడా మీరు ఎలాంటి పాలన చేస్తున్నారు? సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థపై కక్ష పెంచుకుని వాటిని నిర్వీర్యం చేయడం వల్ల ఈ పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నది వాస్తవం కాదా?’ అని ప్రశ్నించారు.

News September 7, 2024

జలాశయాలన్నీ నిండుగా ఉన్నాయని తెలిసినా పట్టించుకోలేదు: జగన్

image

AP: చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే విజయవాడను వరద ముంచెత్తిందని YS జగన్ విమర్శించారు. ‘ఆగస్టు 30 నుంచి భారీ వర్షాలు, వరదలు వస్తాయని 28నే మీకు అలర్ట్ వచ్చింది. కృష్ణాపై ఉన్న జలాశయాలన్నీ నిండుగా ఉన్నాయని తెలిసినా పట్టించుకోలేదు. ఉన్నతాధికారులతో రివ్యూ చేసి బాధ్యతలు అప్పగించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా? బుడమేరు విషయంలో మీరు చేసిన నిర్వాకం వల్ల ఇంత విపత్తుకు దారితీసింది’ అని ట్వీట్ చేశారు.

News September 7, 2024

త్వరలో గంటకి 250 కిమీ వేగంతో నడిచే రైళ్లు!

image

రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గంట‌కు 250 KM వేగంతో న‌డిచే 2 రైళ్ల రూప‌క‌ల్ప‌న‌, త‌యారీకి బిడ్లు ఆహ్వానించింది. ఈ ఏడాది జూన్‌లో 2 స్టాండర్డ్ గేజ్ రైళ్ల త‌యారీకి రైల్వే శాఖ‌ చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి లేఖ రాసింది. 8 కోచ్‌లు ఉండేలా ఉక్కుతో త‌యారై 220 KM రన్నింగ్ సామర్థ్యంతో గరిష్ఠంగా 250 KMPH వేగం కలిగి ఉండాలని లేఖలో పేర్కొంది. ప్రస్తుతం వందే భారత్ 160 KMPH వేగంతో నడవగలవు.

News September 7, 2024

బంగ్లా జాతీయ గీతం మార్చాలన్న డిమాండ్‌.. సర్కారు నిరాకరణ!

image

జాతీయ గీతాన్ని, జెండాను మార్చాలంటూ బంగ్లాలో డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఆ గీతం స్వతంత్ర బంగ్లాను ప్రతిఫలించడం లేదని, బ్రిటిష్ కాలంనాటి దేశాన్ని గుర్తుచేస్తోందని పలువురు అభ్యంతరాలను లేవనెత్తారు. భారత్ కారణంగానే అది తమ జాతీయగీతమైందని ఆరోపించారు. ఆ డిమాండ్లకు స్పందించిన బంగ్లా మధ్యంతర సర్కారు గీతాన్ని, జెండాను మార్చే ఉద్దేశాలేవీ లేవని తేల్చిచెప్పింది.

News September 7, 2024

మ్యాజిక్ కంటిన్యూ చేస్తారా?

image

’గేమ్ ఛేంజర్‘ నుంచి రిలీజ్ కాబోయే సెకండ్ సాంగ్‌లో ఫార్మల్ డ్రెస్‌లో తలకు ఎర్ర కండువా చుట్టిన రామ్ చరణ్ లుక్ తెగ ఆకట్టుకుంటోంది. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇదే కండువాతో సూపర్ హిట్ సాంగ్స్ చేశారు. ముఠామేస్త్రీలో హోయి రబ్బా, గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో చరణ్ కూడా అదే మ్యాజిక్ కంటిన్యూ చేస్తారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

News September 7, 2024

జగన్ అన్నా.. మనం సాయం చేసి చూపిద్దాం: బ్రహ్మాజీ

image

AP: రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అంటూ వైసీసీ చీఫ్ జగన్ చేసిన ట్వీట్‌కు నటుడు బ్రహ్మాజీ స్పందించారు. ఈ ప్రభుత్వం సాయం చేయలేదని, మనమైనా చేద్దామని తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ‘ఫస్ట్ రూ.1000 కోట్లు రిలీజ్ చేద్దాం. వైసీపీ కేడర్‌ను రంగంలోకి దింపుదాం. మనకు జనాలు ముఖ్యం. ప్రభుత్వం కాదు. మనం చేసి చూపిద్దాం. జై జగన్ అన్న’ అంటూ రాసుకొచ్చారు.

News September 7, 2024

ఈవీ మార్కెట్‌లోకి అనిల్ అంబానీ?

image

అప్పుల ఊబిలో చిక్కుకున్న అనిల్ అంబానీ నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. రాయిటర్స్ కథనం ప్రకారం.. విద్యుత్ వాహనాల పరిశ్రమలోకి ఆయన అడుగుపెట్టనున్నారు. విద్యుత్ కార్లు, బ్యాటరీల ఉత్పత్తి కోసం చైనా కంపెనీ BYD మాజీ ఎగ్జిక్యూటివ్ సంజయ్ గోపాలకృష్ణన్‌ను సలహాదారుగా నియమించుకున్నారు. ఏడాదికి 2.5లక్షల వాహనాలు ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను నిర్మించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

News September 7, 2024

భారీ నుంచి అతి భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెప్పింది. ఈరోజు 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. రేపు 5 జిల్లాలకు, ఎల్లుండి 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. 3 రోజుల పాటు వాయుగుండం కొనసాగే ఛాన్స్ ఉందని పేర్కొంది.

News September 7, 2024

భారీ వర్షాలు.. ఖమ్మంకు డిప్యూటీ సీఎం

image

TG: భారీ వర్షాలతో మున్నేరువాగు పొంగే అవకాశం ఉండటంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం బయల్దేరారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కాగా మధ్యాహ్నం నుంచి ఖమ్మం, మహబూబాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది.

News September 7, 2024

హైకోర్టుల్లో 58.59 లక్షల కేసులు పెండింగ్!

image

దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో 58.59 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నేషనల్ జుడీషియరీ డేటా గ్రిడ్ సమాచారం ప్రకారం.. వీటిలో 30 ఏళ్లకు పైగా నలుగుతున్న కేసులు 62వేలు. 20 నుంచి 30 ఏళ్లుగా హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 2.45 లక్షలు. 3 కేసులు 1952 నుంచి, 4 కేసులు 1954 నుంచి, 9 కేసులు 1955 నుంచి పరిష్కారం కాలేదు. మొత్తంగా 42.64 లక్షల సివిల్ కేసులు, 15.94 లక్షల క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.