India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిన్న మొత్తంలో నగదు పొదుపు చేసుకొనే ఖాతాదారులకు RBL షాక్ ఇచ్చింది. సేవింగ్స్ అకౌంట్లలో రూ. లక్ష వరకు బ్యాలెన్స్ కలిగిన కస్టమర్లకు ప్రస్తుతం ఇస్తున్న 3.75% వడ్డీలో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలతో ఖాతాదారులకు ఇకపై 3.50% మాత్రమే వడ్డీ దక్కనుంది. ఈ మేరకు బ్యాంకు వెబ్సైట్లో ప్రకటించింది. రూ.లక్షపైన పొదుపు స్లాబ్స్లో ఎలాంటి మార్పు లేదు.
TG: తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రాబోయే 1-2 గంటల్లో నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, హనుమకొండ, జనగాం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
రెజర్ల మధ్య విభేదాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నాలు కొనసాగిస్తోందని కాంగ్రెస్ నేత, రెజ్లర్ బజరంగ్ పునియా మండిపడ్డారు. ప్రధాని మోదీపై తనకు నమ్మకం పోయిందన్నారు. ‘రెజ్లర్లు ఎక్కడికి వెళ్లినా మన దేశం కోసం, జెండా కోసం పోరాడుతాం. నేరస్థుడైన బ్రిజ్ భూషణ్కు బీజేపీ అండగా నిలిచింది. నాపై దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించింది. డోపింగ్ ఆరోపణలతో నన్ను నిషేధించింది’ అని ఆరోపించారు.
AP: రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 34 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. వరదలకు ఇప్పటివరకు 43 మంది మరణించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రూ.6,800 కోట్ల నష్టం జరిగినట్లు కేంద్రానికి నివేదించినట్లు పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ లేకపోయినా పంట నష్టం ఇస్తామన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో బీసీసీఐ DRSను తీసుకురావడంపై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. దీని వల్ల దేశవాళీ క్రికెట్లో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని ఆయన ట్విటర్లో అభిప్రాయపడ్డారు. యువ క్రికెటర్లు సైతం తమ తప్పుల్ని తెలుసుకుని తమను తాము మెరుగుపరుచుకుంటారని అశ్విన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రికీ భుయ్ తాజాగా ఔటైన విధానాన్ని ఆయన ఉదాహరణగా వివరించారు.
సెప్టెంబర్ 9న ఐఫోన్ 16 సిరీస్ ఇండియాలో లాంచ్ కానుంది. దీంతో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల ధరలు భారీగా పడిపోతున్నాయి. గతేడాది ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లాంచ్ చేసినప్పుడు ధర రూ.1,59,900గా ఉండేది. ఇప్పుడు ఆఫ్లైన్లో దాని రేటు రూ.1,32,990కు పడిపోయింది. క్రెడిట్ కార్డులతో చెల్లిస్తే మరింత డిస్కౌంట్ ఇస్తున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర రూ.1.59 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
పారిస్ ఒలింపిక్స్లో రెజ్లర్ వినేశ్ వైఫల్యంపై బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ <<14037088>>వ్యాఖ్యలతో<<>> అతని మెంటాలిటీ బయటపడిందని బజరంగ్ పునియా కౌంటర్ ఇచ్చారు. ఆమె ఓటమితో అతను సంతోషంగా ఉండొచ్చని విమర్శించారు. అది వినేశ్ మెడల్ మాత్రమే కాదని, 140 కోట్ల మంది ప్రజలదని పేర్కొన్నారు. ఇలా ఓటమిని సెలబ్రేట్ చేసుకునేవారిని దేశ భక్తులంటారా? అని ప్రశ్నించారు.
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ భారతీయులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఆయన పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. స్వతహాగా భారతీయుడు కాకపోయినా ఇక్కడి రీల్స్, సినీతారల స్టెప్స్ వేస్తూ వార్నర్ దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్లో ఆయన ప్రస్తుతం ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
TG: ప్రభుత్వ జూ.కాలేజీల్లో విద్యార్థులకు EAPCET, NEET, JEE వంటి ఎంట్రన్స్ పరీక్షల కోసం శిక్షణనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేయనుంది. రాష్ట్రంలోని 424 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండగా, వాటిలో ఏటా 80వేల మంది ఫస్టియర్లో చేరుతున్నారు. వీరు EAPCETలో ఉత్తీర్ణత సాధించి బీటెక్, బీ ఫార్మసీ వంటి కోర్సుల్లో చేరితే ప్రభుత్వం పూర్తి రీయింబర్స్మెంట్ చేస్తోంది.
అధిక కాలం వాయు కాలుష్యానికి ప్రభావితం కావడం వల్ల పురుషుల్లో, ట్రాఫిక్ శబ్దాల వల్ల మహిళల్లో సంతానలేమి సమస్యలు పొంచి ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది. PM2.5కు గురికావడం అనేది వయస్సుతో సంబంధం లేకుండా పురుషుల్లో వంధ్యత్వ సంభావ్యతతో ముడిపడి ఉందని డెన్మార్క్ పరిశోధకులు వెల్లడించారు. ట్రాఫిక్ శబ్దాలు 35 ఏళ్లు పైబడిన మహిళల్లో, 37 ఏళ్లు పైబడిన పురుషుల్లో సమస్యలకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.