News February 10, 2025

హైకోర్టులో మాజీ మంత్రి రజినీ ముందస్తు బెయిల్ పిటిషన్

image

AP: చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌లో తనపై కేసు <<15394556>>నమోదైన<<>> నేపథ్యంలో మాజీ మంత్రి విడదల రజినీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం రేపు విచారించే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో రజినీపై పోస్టు పెట్టినందుకు తనను సీఐ సూర్యనారాయణ ద్వారా హింసించారని పిల్లి కోటి అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

News February 10, 2025

అదానీ హెల్త్ సిటీని ప్రారంభిస్తున్నాం: గౌతమ్ అదానీ

image

వైద్య రంగంలో భారీ పెట్టుబడికి అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. రూ.6వేల కోట్ల పెట్టుబడితో అదానీ హెల్త్ సిటీని లాంచ్ చేయనున్నట్లు ఆ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ వెల్లడించారు. మయో క్లినిక్ భాగస్వామ్యంతో అహ్మదాబాద్, ముంబైలో 1000 పడకల చొప్పున ఆస్పత్రులు నిర్మిస్తామని ప్రకటించారు. ఆస్పత్రులతో పాటు మెడికల్ కాలేజీలు కూడా నిర్మిస్తామన్నారు. దీంతో దేశ వైద్య రంగం మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

News February 10, 2025

ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక: సీఎం

image

TG: ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక లభించేలా చూడాలన్నారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ఇసుక మాఫియాపై అధికారులు ఉక్కుపాదం మోపాలని, అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట బాధ్యతను కలెక్టర్లు, ఎస్పీలకు ఇవ్వాలని సూచించారు.

News February 10, 2025

ఏపీలో లిక్కర్ ధరలు పెంపు!

image

AP: రాష్ట్రంలోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్. మద్యంపై 15 శాతం మేర ధరలు పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఇటీవల మద్యం అమ్మకాలపై మార్జిన్‌ను 14.5 నుంచి 20 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. దీంతో ధరల పెంపు అనివార్యమైనట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇకపై 3 కేటగిరీలుగా(ఇండియన్ మేడ్, ఫారిన్ మేడ్, బీర్) మద్యం సరఫరా ఉంటుందని తెలిపాయి. రూ.99 మద్యం, బీర్లపై పెంపు ఉండదని చెప్పాయి.

News February 10, 2025

30 ఏళ్లు దాటిన మహిళలు ఈ పరీక్షలు చేసుకోవాలి!

image

1. మామోగ్రఫీ- దీని ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు గుర్తించవచ్చు. 2.పాప్ స్మియర్ టెస్ట్ – గర్భాశయ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించవచ్చు. 3.కంప్లీట్ బ్లడ్ కౌంట్(CBC)- రక్తహీనతతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను దీని ద్వారా గుర్తించవచ్చు. 4. థైరాయిడ్ 5. విటమిన్ -D, కాల్షియం టెస్ట్. ఈ పరీక్షలు చేయించుకొని దానికి తగ్గట్లు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
SHARE IT

News February 10, 2025

సీఎం రేవంత్‌కు లేఖ రాసిన మందకృష్ణ

image

TG: ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు MRPS స్థాపకుడు మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ‘జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికలో లోపాలు ఉన్నాయి. లోపాల వల్ల కొన్ని కులాల హక్కులు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. నివేదికపై చర్చించి సూచనలు ఇవ్వడానికి సీఎంను కలవాలని అనుకుంటున్నాం. సాధ్యమైనంత త్వరలో మీ విలువైన సమయాన్ని కేటాయించాలని కోరుతున్నాం’ అని లేఖలో విజ్ఞప్తి చేశారు.

News February 10, 2025

రంగరాజన్‌ను పరామర్శించిన కొండా సురేఖ

image

TG: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. ఆయనపై జరిగిన దాడి గురించి ఆమె ఆరా తీశారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని ఆయనకు భరోసా ఇచ్చారు. నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కాగా పూజారిపై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

News February 10, 2025

శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఉచితంగా లడ్డూ: ఆనం

image

AP: ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలం బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి తెలిపారు. భక్తులకు ఇబ్బందిలేకుండా తాగునీరు, ఆహారం అందిస్తామని చెప్పారు. శ్రీశైలం పార్కింగ్ నుంచి సత్రాల వరకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ప్రతి భక్తుడికీ ఫ్రీగా లడ్డూ ప్రసాదం ఇస్తామని పేర్కొన్నారు. ఘాట్ రోడ్లపై ట్రాఫిక్‌ను డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు.

News February 10, 2025

చైనా సంక్షోభం: పెళ్లిళ్లు తగ్గి విడాకులు పెరుగుతున్నాయ్

image

చైనాలో పెళ్లిళ్లు తగ్గి విడాకులు పెరగడం ఆందోళనకరంగా మారింది. 2024లో 61L వివాహాలు నమోదయ్యాయి. 1986 తర్వాత ఇదే అత్యల్పం. 2023తో పోలిస్తే 20.5% తగ్గడం గమనార్హం. ఇక గత ఏడాది 26L జంటలు డివోర్స్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 28K అధికం. అలాగే ఆ దేశంలో శ్రామిక జనాభా(16-59yrs) 68L తగ్గిందని ఓ నివేదికలో వెల్లడైంది. మొత్తం జనాభాలో 60ఏళ్లకు పైగా వయసున్న వారు 22 శాతానికి పెరిగారని తేలింది.

News February 10, 2025

టీచర్ ఉద్యోగ నియామకాల ఆలస్యం.. హైకోర్టు ఆగ్రహం

image

TG: DSC-2008 నియామకాల ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 1,382 మందిని ఇవాళ్టిలోగా కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని <<15354548>>ఆదేశించినా<<>> అమలు చేయకపోవడంతో విద్యాశాఖపై మండిపడింది. కోర్టు ధిక్కరణగా భావించాల్సి ఉంటుందని ప్రభుత్వ న్యాయవాదిని హెచ్చరించింది. మూడు రోజుల్లోగా ప్రక్రియ పూర్తిచేస్తామని విద్యాశాఖ కమిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 17కు వాయిదా వేసింది.