India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

షోలాపూర్కు చెందిన ఓ దొంగ తన గర్ల్ ఫ్రెండ్కు రూ.3 కోట్లు వెచ్చించి ఇల్లు నిర్మించాడు. పంచాక్షరి స్వామి(37) మైనర్గా ఉన్నప్పటి నుంచే దొంగతనాలు చేస్తున్నాడు. ఇళ్లలో బంగారం దొంగిలించి వాటిని కరిగించి బిస్కెట్లుగా మారుస్తాడు. ఈక్రమంలో నటితో పరిచయం చేసుకుని దగ్గరయ్యాడు. దొంగిలించిన డబ్బుతో కోల్కతాలో రూ.3 కోట్లు వెచ్చించి ఇల్లు నిర్మించాడు. ఓ కేసులో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయగా ఈ విషయం వెల్లడైంది.

ఇంగ్లండ్తో ఈ నెల 6న ప్రారంభం కానున్న వన్డే సిరీస్కు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని BCCI సెలక్ట్ చేసింది. 15మందితో జట్టును ఇప్పటికే ప్రకటించగా 16వ ప్లేయర్ యాడ్ అయ్యారు. ఇటీవల ముగిసిన T20 సిరీస్లో వరుణ్ 7.66RRతో 14 వికెట్లు తీశారు. ఫామ్లో ఉన్న వరుణ్ ఈ సిరీస్లో రాణిస్తే CTకి సైతం ఎంపిక చేయాలని BCCI భావిస్తోంది. చక్రవర్తిని CTకి ఎంపిక చేయాలని సీనియర్ ప్లేయర్లు సూచించిన విషయం తెలిసిందే.

స్వతంత్రం వచ్చి 78 ఏళ్లవుతున్నా ఇంకా కొన్ని గ్రామాలు తాగునీరు దొరక్క అల్లాడుతున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని చుంచునా గ్రామ ప్రజలు ఎట్టకేలకు శుద్ధమైన తాగునీటిని పొందారు. దాదాపు 100 కుటుంబాలున్న ఈ మారుమూల ప్రాంతం చుట్టూ అడవులు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఇన్నేళ్లు ఈ సమస్యను తీర్చలేకపోయారు. జల్ జీవన్ మిషన్ కింద అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో స్వచ్ఛమైన నీరు వారి చెంతకు చేరాయి.

TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రెడ్డి సంఘాల నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల వరంగల్ బీసీ బహిరంగ సభలో రెడ్డిలను తీవ్ర పదజాలంతో దూషించారని, వెంటనే మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ సీటుతో మల్లన్నకు భిక్ష పెట్టారు. మా ఓట్లు పనికిరావని అప్పుడెందుకు చెప్పలేదు? బీసీల కోసం పోరాడటంలో తప్పులేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు?’ అని మండిపడ్డారు.

సోషల్ మీడియాలో పరిచయమవుతున్న అపరిచితులు స్నేహం పేరుతో నమ్మించి మోసం చేస్తున్నారని TSRTC సజ్జనార్ పేర్కొన్నారు. తెలియని వాళ్లతో చనువుగా ఉండి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పంచుకోవద్దని సూచించారు. ‘అజ్ఞాత వ్యక్తులతో స్నేహం పరిధి దాటి ముందుకు వెళితే మీకే నష్టం. మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో ఎవరిని పడితే వాళ్లని ఫాలో అవ్వడం, వారితో చాట్ చేయకండి’ అని యువతకు సందేశం ఇచ్చారు.

AP: సీఎం కష్టంతో పోలిస్తే పదవులు దక్కలేదన్న అసంతృప్తి చాలా చిన్నది అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉంటే న్యాయం జరుగుతుందని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజా ఎంపిక సరైన నిర్ణయమని తెలిపారు. ఆయన అనుభవం మండలికే వన్నె తెస్తుందని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. ఆలపాటి గెలుపునకు ఇన్ఛార్జులు బాధ్యతగా పని చేయాలని ఆయన కోరారు.

సింప్లిఫై చేసిన Income Tax బిల్లును సభలో ప్రవేశపెట్టబోతున్న కేంద్ర ప్రభుత్వం త్వరలోనే GST విధానాన్నీ సవరిస్తుందని సమాచారం. ఆర్థిక, వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. శ్లాబులను తగ్గించొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం GSTలో 5, 12, 18, 28 శ్లాబులు ఉన్నాయి. విలువైన లోహాలు, సిన్ గూడ్స్పై ప్రత్యేక రేట్లతో పాటు సుంకాలు అమలవుతున్నాయి. 5%లో 21%, 12%లో 19%, 18%లో 44%, మిగిలినవి 28% పరిధిలో ఉన్నాయి.

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో PM నరేంద్రమోదీ విపక్ష నేతలపై సెటైర్లు విసిరారు. కొందరు నేతలు సామాన్యులమంటూ అద్దాల మేడలు, భవంతులు కట్టించుకున్నారని అరవింద్ కేజ్రీవాల్ను విమర్శించారు. మరొకరేమో మురికి వాడలకు వెళ్లి వీడియోలు తీయించుకుంటారని రాహుల్పై వాక్బాణం ఎక్కుపెట్టారు. తాము మాత్రం పేదలకు 12 కోట్ల టాయిలెట్లు కట్టించామని, మహిళల గౌరవాన్ని నిలబెట్టామన్నారు. స్వచ్ఛమైన నీరు అందించామన్నారు.

పార్లమెంటులో వరుసగా 14వ ఏడాదీ ప్రసంగించే అవకాశం కల్పించిన దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలియజేశారు. తనను నాయకుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం వికసిత భారత్కు బాటలు వేసిందన్నారు. తమ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. గరీబీ హఠావో ప్రయోగం విఫలమైందని కాంగ్రెస్ను విమర్శించారు. తాము పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించామని వెల్లడించారు.

మలయాళంలో తెరకెక్కిన ‘ఐడెంటిటీ’ సినిమా తెలుగు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చిన్న పాయింట్ను బేస్ చేసుకుని తీసిన ఈ మూవీలో థ్రిల్లర్కు ఉండాల్సిన అన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయంటున్నారు. ఒకే సినిమాలో మూడు స్టోరీలను చూపించారని ప్రశంసిస్తున్నారు. ZEE5లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో టొవినో థామస్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించారు. మరి మీరు ఈ చిత్రం చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.