India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు ఆయన సీబీఐ కోర్టును అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. దానిపై వాదనలు పూర్తి కాగా, పిటిషన్పై నిర్ణయాన్ని కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. ఇటీవల రాజకీయాల నుంచి వైదొలిగిన VSR రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

AP: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, పథకాల అమలుకు డబ్బులు లేవన్న CM <<15282237>>CBN వ్యాఖ్యలపై<<>> భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హామీలు ఇచ్చే ముందు ఆర్థిక పరిస్థితి తెలియదా? అని YCP శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. 40ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుని ఇలాంటి మాటలేంటని నిలదీస్తున్నాయి. అయితే ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే పథకాలు అమలు చేస్తామని చెప్పారని, ఇందులో విమర్శలకు తావులేదని TDP శ్రేణులు కౌంటరిస్తున్నాయి.

సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ ‘పుష్ప-2’ OTTలోకి వచ్చేస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు సిద్ధమైన నెట్ఫ్లిక్స్ ‘COMING SOON’ అని ప్రకటించింది. రీలోడెడ్ వెర్షన్(3గం.44ని) అందుబాటులోకి రానుంది. గతేడాది DEC 5న రిలీజైన మూవీ దాదాపు రూ.1900cr రాబట్టింది. 56డేస్ తర్వాత OTTలోకి వస్తుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించగా, JAN 30న స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. డెంగ్యూ, మలేరియా వంటి సనాతన ధర్మాన్ని తరిమికొట్టాలని 2023లో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ హిందూ సంఘాలు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే దీనిపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

వెంకటేశ్ హీరోగా తెరకెక్కించిన ‘సంక్రాంతి వస్తున్నాం’ సక్సెస్తో దర్శకుడు అనిల్ రావిపూడి మంచి జోష్లో ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ఒకవేళ తనకు అవకాశం వస్తే ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ సల్మాన్ ఖాన్తో చేస్తానని చెప్పారు. ఈ కథ ఆయనకు బాగా సూట్ అవుతుందని పేర్కొన్నారు. కాగా ఈ మూవీ ఇప్పటికే రూ.260 కోట్లకు పైగా కలెక్షన్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది.

వక్ఫ్ సవరణ బిల్లుపై JPCలో విపక్షాల ప్రతిపాదనలను తిరస్కరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. NDA సభ్యుల 14 ప్రతిపాదనలను ఆమోదించి, 44 క్లాజుల్లో తాము ప్రతిపాదించిన వందలాది సవరణలను అజెండా ప్రకారం పక్కనపెట్టేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కమిటీ ఛైర్మన్ పాల్ ప్రజాస్వామ్యానికి బ్లాక్లిస్టర్ అని మండిపడుతున్నాయి. అంతా ఏకపక్షమైనప్పుడు JPC ఎందుకని ప్రశ్నిస్తున్నాయి.

AP: లోకేశ్ చేపట్టిన యువగళం ఎంతోమందికి ప్రేరణగా నిలిచిందని తేజశ్రీ అనే ఆర్టిస్ట్ నవ ధాన్యాలతో ఆయన చిత్రాన్ని వేశారు. ఆ యాత్ర చేపట్టి రెండేళ్లు పూర్తైన సందర్భంగా 6*4 అడుగుల చిత్రాన్ని 3 రోజుల్లో పూర్తి చేయడం గర్వంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు. మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. అద్భుతమైన కళాఖండం రూపొందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీని తయారీకి ఆమె చేసిన కృషి, చూపిన నిబద్ధతను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.

AP: జనసేనలో చేరేవారికి ఆ పార్టీ నేత నాగబాబు కీలక విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్నామనే అడ్వాంటేజ్ కోసం తమ పార్టీలో చేరొద్దని సూచించారు. పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామకు చెందిన పలువురు వైసీపీ నేతలు ఆయన సమక్షంలో జనసేనలో చేరారు. ప్రజల కోసమే నిస్వార్థంగా పనిచేయాలన్నారు. అధినేత లక్ష్యాన్ని జనంలోకి తీసుకెళ్లాలని ఆయన తెలిపారు.

TG: VCల నియామకంపై UGC జారీ చేసిన గైడ్లైన్స్ను వ్యతిరేకిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రకటించారు. ఈ గైడ్లైన్స్ వల్ల వీసీల నియామకం కేంద్రం చేతుల్లోకి వెళ్తుందన్నారు. వీసీలుగా బ్యూరోక్రాట్స్ను నియమించాలనుకోవడం సరికాదని, ఇవి ప్రైవేటైజేషన్ను ప్రోత్సహించేలా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర యూనివర్సిటీలను దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.

TG: రైతుభరోసా డబ్బుల జమపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. తొలి విడతలో మండలానికొక గ్రామంలో సొమ్ము విడుదల చేశామని వెల్లడించారు. ఇవాళ 4,41,911 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని, 577 మండలాల్లోని 9,48,333 ఎకరాలకు రూ.563 కోట్లు రిలీజ్ చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.