News February 12, 2025

మార్చిలో మెగా DSC నోటిఫికేషన్

image

AP: 16,247 పోస్టుల భర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొంది. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని, త్వరలో టీచర్ల బదిలీల చట్టం తేనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. వీసీల నియామకం పూర్తయ్యాక అన్ని వర్సిటీలకు ఏకీకృత చట్టం అమలు చేస్తామని చెప్పారు.

News February 12, 2025

హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు: హరీశ్

image

TG: రాష్ట్రవ్యాప్తంగా 16వేల మందికి పైగా ఉన్న హోంగార్డులకు నెల పూర్తయి 12 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని హరీశ్ రావు విమర్శించారు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్నారని, సమయానికి శాలరీలు రాకపోవడంతో అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతోందని దుయ్యబట్టారు. వెంటనే వారికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

News February 12, 2025

జట్టులోకి ఐదుగురు స్పిన్నర్లు.. ప్లానేంటో?

image

ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన భారత జట్టులోకి ఐదుగురు స్పిన్నర్లను తీసుకోవడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దుబాయ్ వంటి పిచ్‌లపై స్పీడ్ స్టార్లను వదిలేసి వరుణ్, కుల్దీప్, రవీంద్ర, అక్షర్, సుందర్‌ వంటి ప్లేయర్లను ఎంపిక చేయడం వెనుక ఉద్దేశం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గాయంతో బుమ్రా దూరమవ్వగా శార్దూల్, సిరాజ్ వంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. మరి మీ కామెంట్?

News February 12, 2025

సంక్షేమ పథకాల వల్ల కార్మికుల కొరత: L&T ఛైర్మన్

image

సంక్షేమ పథకాల వల్ల కార్మికుల కొరత ఏర్పడిందని L&T కంపెనీ ఛైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. DBT వల్ల పనులు చేసేందుకు, ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపట్లేదన్నారు. దీంతో వారిని నియమించుకోవడానికి కంపెనీలు చాలా కష్టపడాల్సి వస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో కార్మికుల సమీకరణ, నియామకాల కోసం తమ కంపెనీ HR టీమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

News February 12, 2025

నేటి నుంచి ఆధ్యాత్మిక పర్యటన.. బేగంపేట్ చేరుకున్న పవన్

image

AP Dy.CM పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల ఆధ్యాత్మిక పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఆయన కొద్దిసేపటి కిందట HYDలోని బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయన 4రోజులపాటు కేరళ, తమిళనాడులో పర్యటించనున్నారు. అనంత పద్మనాభ స్వామి, మధురై మీనాక్షి, పరస రామస్వామి, అగస్త్య జీవసమాధి, తదితర ఆలయాలను సందర్శించనున్నారు. ఇటీవల జ్వరం బారిన పడిన పవన్ కోలుకొని ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్తున్నారు.

News February 12, 2025

టాయిలెట్‌లోకి ఫోన్ తీసుకెళ్తే..

image

టాయిలెట్లలో ఫోన్ వాడటం శారీరకంగా, మానసికంగా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల విసర్జన అవయవాలపై ఒత్తిడి పడుతుందని, రక్త ప్రసరణ నెమ్మదిస్తుందని తెలిపారు. రక్తనాళాలు ఉబ్బి పైల్స్, ఫిషర్స్‌కు దారి తీస్తుంది. టాయిలెట్‌లోని ప్రమాదకర బ్యాక్టీరియాలు, క్రిములు స్క్రీన్‌పై చేరి అతిసారం, కడుపు నొప్పి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లాంటి సమస్యలు వస్తాయి.
Share it

News February 12, 2025

శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

image

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,192 మంది భక్తులు దర్శించుకోగా 20,825 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు సమకూరింది.

News February 12, 2025

రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు

image

AP: రైతులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. భూములు రీసర్వే జరిగిన 8,680 గ్రామాల్లో గతంలో ఇచ్చిన పాసు పుస్తకాలను వెనక్కి తీసుకొని ‘ఆంధ్రప్రదేశ్ రాజముద్ర’ ఉన్న వాటిని ఇవ్వనున్నారు. పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ ఉండటంతో రైతులు తిరస్కరిస్తున్నారని మంత్రి అనగాని CM చంద్రబాబుకు తెలిపారు. అలాగే సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు, పేర్లు కూడా మార్చి నాటికి తొలగిస్తామన్నారు.

News February 12, 2025

బాగా ఆడినా జట్టు నుంచి తప్పించారు: రహానే

image

భారత క్రికెటర్ అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో సెంచరీ చేసినా తర్వాతి మ్యాచుల్లో జట్టులోకి తీసుకోలేదని అన్నారు. శతకం నమోదు చేసినా జట్టు నుంచి తప్పించినట్లు చెప్పారు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత్ వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని రహానేను జట్టులోకి తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. అనుభవం ఉన్న ఆటగాడు ఉంటే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌‌కు మేలు జరగుతుందని అంటున్నారు.

News February 12, 2025

ఇజ్రాయెల్ vs హమాస్.. మళ్లీ యుద్ధం తప్పదా?

image

ఇజ్రాయెల్-హమాస్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ శనివారం మధ్యాహ్నం లోపు తమ దేశ బందీలను విడిచిపెట్టకపోతే గాజాపై సైనిక చర్యకు దిగుతామని, సీజ్‌ఫైర్ డీల్ ముగుస్తుందని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. హమాస్ అంతు చూసే వరకు నిద్రపోమని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఇదే మాట చెప్పారు. అయితే ట్రంప్ ఒప్పందాలను గౌరవించాలని, ఆయన హెచ్చరికలను తాము పట్టించుకోమని హమాస్ తేల్చి చెప్పింది.