India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 247 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్ అభిషేక్(135) సెంచరీతో చెలరేగారు. అభి తన ఇన్నింగ్సులో 13 సిక్సర్లు, 7 ఫోర్లు బాదారు. అతని హిట్టింగ్కు ఇంగ్లండ్ బౌలర్ల వద్ద సమాధానం లేకపోయింది. ఇంగ్లండ్ టార్గెట్ 248.

భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. టీ20ల్లో ఒక ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచారు. 54 బంతుల్లోనే 13 సిక్సర్లు, 7 ఫోర్లతో 135 పరుగులు చేశారు. మరోవైపు ఒకే ఇన్నింగ్సులో అత్యధిక సిక్సర్లు బాదిన ఇండియన్ ప్లేయర్గానూ నిలిచారు.

TG: బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రాన్ని చిన్న చూపు చూసినందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాజీనామా చేయాలని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లి ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు ఈ విషయంలో తమతో కలిసి కేంద్రంపై పోరాటం చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా మోదీపై యుద్ధం ప్రకటించాలన్నారు.

* డేవిడ్ మిల్లర్(2017-SA)- 35 బంతులు
* రోహిత్ శర్మ(2017-INDIA)- 35 బంతులు
* అభిషేక్ శర్మ(2025-INDIA)- 37 బంతులు
* జాన్సన్ చార్లెస్(2023-WEST INDIES)- 39 బంతులు
* సంజూ శాంసన్(2024-INDIA)- 40 బంతులు
* టాప్-5లో ముగ్గురు భారత ప్లేయర్లే కావడం విశేషం.

TG: హైబ్రిడ్ సైకిల్ను రూపొందించిన 14 ఏళ్ల చిన్నారి గగన్ చంద్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ చిన్నారి ఆవిష్కరణ తన దృష్టిని ఆకర్షించిందని ట్వీట్ చేశారు. అతనికి అభినందనలు తెలిపారు. మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు చేసేందుకు గగన్కు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. కాగా గగన్ సోలార్, బ్యాటరీ, పెట్రోల్తో నడిచే సైకిల్ను రూపొందించాడు.

ఇంగ్లండ్తో జరుగుతున్న 5వ T20లో భారత్ చరిత్ర సృష్టించింది. T20Iలో పవర్ప్లేలో అత్యధిక స్కోరు చేసింది. అభిషేక్ శర్మ(94*), తిలక్ వర్మ(24) విధ్వంసంతో 6 ఓవర్లలో భారత్ 95/1 రన్స్ చేసింది. ఇప్పటివరకు 2021లో స్కాట్లాండ్పై చేసిన 82/2 పవర్ప్లేలో భారత్కు అత్యధిక స్కోరు కాగా, ఆ రికార్డును తాజాగా బ్రేక్ చేసింది. ప్రస్తుతం స్కోరు 9 ఓవర్లలో 136-2గా ఉంది.

భారత్ పర్యటనలో ఉన్న బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ వాంఖడే స్టేడియంలో సందడి చేశారు. భారత్, ఇంగ్లండ్ జట్ల కెప్టెన్లు సూర్య, బట్లర్తో ఆయన సరదాగా సంభాషించారు. అంతకుముందు పార్సీ జింఖానా గ్రౌండ్లో చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడకుండా తన ముంబై పర్యటన ముగియదని Xలో రాసుకొచ్చారు.

సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో ఈ ఏడాది కప్పు గెలుస్తామంటూ హీరో అఖిల్ ధీమా వ్యక్తం చేశారు. 13 ఏళ్ల క్రితం విష్ణు ప్రారంభించిన CCL 11వ సీజన్ లోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. జెర్సీ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు నాలుగు సార్లు కప్పు గెలిచినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 2 వరకు CCL జరగనుంది. ఈ నెల 14, 15న తెలుగు వారియర్స్ మ్యాచ్ ఆడనుంది.

పెళ్లి వేడుకల్లో వధూవరులు డాన్సులు చేయడం సహజమే. కానీ వరుడు డాన్స్ చేసినందుకు వధువు తండ్రి పెళ్లినే రద్దు చేసిన ఆసక్తికర ఘటన ఢిల్లీలో జరిగింది. ఊరేగింపుగా మండపానికి వచ్చిన వరుడు, తన స్నేహితులతో కలిసి ‘చోలీకే పీఛే క్యాహై’ సాంగ్కు డాన్స్ వేశాడు. అది కాబోయే మామకు నచ్చలేదు. అలాంటి వాడికి బిడ్డను ఇచ్చేది లేదంటూ పెళ్లిని రద్దు చేశాడు. వరుడు వివరిస్తున్నా వినకుండా ఆడపెళ్ళివారు మండపం నుంచి వెళ్లిపోయారు.

ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆ పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన త్వరలోనే కాంగ్రెస్లో చేరుతారని బీజేపీ నేత నితీశ్ రాణే ఆరోపించారు. రాజ్యసభకు వెళ్లేందుకు శివసేన యూబీటీకి తగిన బలం లేకపోవడంతో కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు చెప్పారు. దీనిపై రౌత్ ప్రకటన విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.