News April 4, 2025

‘వక్ఫ్’ తరహాలోనే పార్లమెంటులో సుదీర్ఘ చర్చలివే!

image

వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్‌సభలో 14 గంటలు, రాజ్యసభలో 17 గంటల పాటు చర్చ జరిగింది. ఇదొక అరుదైన విషయమని RS ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ తెలిపారు. అయితే గతంలోనూ పార్లమెంటులో మారథాన్ చర్చలు జరిగాయి. LSలో స్టేట్ ఆఫ్ అవర్ డెమొక్రసీపై 20.8గంటలు, రైల్వే బడ్జెట్‌పై 1993లో 18.35గంటలు, 1988లో 19.04గంటలు, మైనార్టీల భద్రత బిల్లుపై 17.25గంటలు, 1981లో RSలో ఎసెన్షియల్ సర్వీసెస్ బిల్లుపై 16.88గంటల చర్చ జరిగింది.

News April 4, 2025

కొత్త ఎడ్యుకేషనల్ పాలసీ రూపొందించండి: సీఎం రేవంత్

image

TG: విషయ పరిజ్ఞానంతో పాటు జీవన ప్రమాణాలు పెరిగే విధంగా విద్యా వ్యవస్థ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దానికి అనుగుణంగా కొత్త ఎడ్యుకేషనల్ పాలసీని రూపొందించాలని విద్యాశాఖను ఆదేశించారు. విద్యాశాఖ ఛైర్మన్ ఇతర అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పలు రాష్ట్రాల్లో అమలవుతున్నవిద్యా విధానాలను ఛైర్మన్ ఆకునూరి మురళి, మాజీ IAS జయప్రకాశ్ నారాయణ, సీఎంకు వివరించారు.

News April 4, 2025

మల్హోత్రా సంతకంతో రూ.10, రూ.500 కొత్త నోట్లు: RBI

image

RBI నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.10, రూ.500 నోట్లను జారీ కానున్నాయి. మహాత్మా గాంధీ సిరీస్‌‌లో ప్రస్తుతం ఉన్న నోట్ల మాదిరిగానే ఇవి కూడా ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. గతంలో జారీ చేసిన నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. మల్హోత్రా సంతకంతో కొత్త రూ.100, రూ.200 నోట్లను రిలీజ్ చేస్తున్నట్లు గత నెల ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.

News April 4, 2025

IPL: ముగిసిన LSG ఇన్నింగ్స్

image

లక్నోలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో LSG 8 వికెట్ల నష్టానికి 203 రన్స్ చేసింది. మార్ష్(31 బంతుల్లో 60), మార్క్రమ్ (38 బంతుల్లో 53), బదోనీ (19 బంతుల్లో 30) రాణించారు. ముంబై బౌలర్లలో పాండ్య 5 వికెట్లతో చెలరేగారు. బౌల్ట్, అశ్వనీ కుమార్, పుతూర్ తలో వికెట్ తీశారు. ముంబై విజయ లక్ష్యం 204 పరుగులు.

News April 4, 2025

ఎల్లుండి ‘పెద్ది’ ఫస్ట్ షాట్, రిలీజ్ డేట్ గ్లింప్స్

image

బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. శ్రీరామ నవమి సందర్భంగా ఎల్లుండి ఉదయం 11.45 గంటలకు పెద్ది ఫస్ట్ షాట్‌తోపాటు రిలీజ్ డేట్ గ్లింప్స్‌ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. మ్యూజిక్ మిక్సింగ్ పూర్తయ్యిందంటూ ఏఆర్ రెహమాన్‌తో దిగిన ఫొటోను బుచ్చిబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

News April 4, 2025

నేపాల్‌లో భూకంపం

image

నేపాల్‌లో భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమికి 20 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఢిల్లీ-NCRతో సహా ఉత్తర భారతంలో పలు చోట్ల భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది. ఇటీవల మయన్మార్‌లో భూకంపం ధాటికి 3వేల మందికి పైగా ప్రజలు మరణించిన విషయం తెలిసిందే.

News April 4, 2025

ఆ రెండు ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: ఉత్తమ్

image

TG: సాగు నీటి ప్రాజెక్టులపై AP ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేంద్ర సంస్థలు, బోర్డుల అనుమతి లేకుండా నిబంధనలను ఉల్లంఘించి రాయలసీమ ఎత్తిపోతల, బనకచర్ల ప్రాజెక్టులపై ముందుకెళ్తోందని చెప్పారు. వాటిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. ఈ విషయంపై స్టాండింగ్ కౌన్సిల్, AGతో ఆయన సంప్రదింపులు జరిపారు. ఆ ప్రాజెక్టులతో తెలంగాణకు నష్టం వాటిల్లుతుందన్నారు.

News April 4, 2025

చైనా ప్రతీకార సుంకాలు.. స్పందించిన ట్రంప్

image

ట్రంప్ తమపై విధించిన సుంకాలకు ప్రతీకారంగా చైనా కూడా 34శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. దానిపై ట్రంప్ స్పందించారు. ‘వారు మాపై సుంకాలు విధించలేరు. అది వారికి మంచిదికాదు. కానీ టెన్షన్ పడ్డారు. తప్పటడుగు వేశారు’ అని తన ట్రూత్ సోషల్‌లో వ్యాఖ్యానించారు. సుంకాలతో పాటు అరుదైన వనరుల ఎగుమతులపై, రక్షణ రంగ సంబంధితమైన 30 అమెరికా కంపెనీలపై చైనా ఆంక్షలు విధించింది.

News April 4, 2025

BIG NEWS: రేపటి మ్యాచ్‌కు CSK కెప్టెన్‌గా ధోనీ?

image

గత నెల 30న రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో గాయపడిన CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇంకా కోలుకోలేదని సమాచారం. రేపు ఢిల్లీతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ధోనీ మరోసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై యాజమాన్యం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

News April 4, 2025

బర్డ్‌ ఫ్లూపై ఆందోళన వద్దు: CM చంద్రబాబు

image

AP: బర్డ్‌ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యాధి నిరోధకశక్తి లేకపోవడం, లెప్టోస్పీరోసిస్ తదితర కారణాల వల్ల ఈ వ్యాధి సోకి ఇటీవల ఓ బాలిక మృతి చెందిందని చెప్పారు. దీనిపై ICMR బృందం అధ్యయనం చేసిందన్నారు. కాగా ఆ బృందంతో సీఎం ఇవాళ సమీక్షించారు.