India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 27, 28, 29న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

బ్రిటన్ కింగ్ ఛార్లెస్-3 తన సతీమణి క్వీన్ కెమెల్లాతో కలిసి త్వరలో భారత్కు రానున్నారు. తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో 2022లో ఆయన ఇండియా టూర్ రద్దయింది. ఇప్పుడు INDతో పాటు పాక్, బంగ్లాలోనూ ఆయన పర్యటిస్తారు. ఈ ఏడాది క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ కోలుకున్న ఆయన OCTలో ఆస్ట్రేలియా నుంచి బ్రిటన్కు తిరుగు ప్రయాణంలో బెంగళూరులోని ఓ వెల్సెస్ సెంటర్కి వెళ్లారు. ఇప్పుడు మరోసారి అక్కడికి వెళ్లే ఛాన్సుంది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పతనాన్ని చూసింది. కేవలం 16 సీట్లకే పరిమితమైంది. 1990లో 141 స్థానాల్లో విజయం సాధించగా, 1995లో 80, 1999లో 75, 2004లో 69, 2009లో 82, 2014లో 42, 2019లో 44 సీట్లను గెలుచుకుంది. తాజాగా 20 సీట్లలోపే రావడం కాంగ్రెస్కు రాష్ట్ర ప్రజల్లో ఆదరణ తగ్గడాన్ని సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

డైట్ కంట్రోల్ వల్ల తన భార్యకు స్టేజ్-4 <<14676790>>క్యాన్సర్<<>> నయమైందన్న మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ కామెంట్స్పై టాటా మెమోరియల్ ఆసుపత్రి స్పందించింది. ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా నమ్మొద్దని క్యాన్సర్ పేషెంట్లకు సూచించింది. ‘పసుపు, వేపాకు తినడం వల్ల క్యాన్సర్ను జయించొచ్చన్నది సరికాదు. దీన్ని నమ్మి వైద్యం తీసుకోవడం మానొద్దు. ఎలాంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించాలి’ అని కోరింది.

తొలి టెస్టులో ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టార్క్తో <<14684131>>సరదా సంభాషణ<<>> జరిగిందని బౌలర్ హర్షిత్ రాణా చెప్పారు. మైదానంలో ఇలాంటివి జరుగుతుంటాయని, ఇది పెద్ద విషయం కాదన్నారు. హెడ్ను ఔట్ చేయడంపై జట్టు ఆటగాళ్లతో చర్చించుకున్నట్లు తెలిపారు. ఒక ఎండ్ నుంచి బ్యాటర్లపై బుమ్రా ఒత్తిడి పెంచి మరో ఎండ్లోని బౌలర్ పనిని సులభం చేస్తారని పేర్కొన్నారు. కాగా తొలి ఇన్నింగ్సులో హర్షిత్ 3 వికెట్లు తీశారు.

TG: డిసెంబర్ 1 నుంచి 9 రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలలో గ్రూప్-4 నియామక పత్రాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. వచ్చే నెల పెద్దపల్లిలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల వెలువడిన తుది ఫలితాల్లో TGPSC 8,084 మంది అభ్యర్థులను పలు పోస్టులకు ఎంపిక చేసింది.

AP: ఈ నెల 29న ప్రధాని మోదీ విశాఖపట్నంకు రానున్నారు. సాయంత్రం ఏయూ మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ క్రమంలో వర్చువల్గానే హైడ్రో ప్రాజెక్టుకు, ఫార్మా ఎస్ఈజెడ్లో స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై సీఎస్ నీరభ్ కుమార్ ఇవాళ, రేపు విశాఖలో సమీక్షించనున్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్ థాక్రేకు చెందిన నవ నిర్మాణ సేన పార్టీ ఘోర పరాజయం పాలైంది. మొత్తం 125 స్థానాల్లో పోటీ చేయగా ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది. 2006లో రాజ్ థాక్రే ఈ పార్టీని స్థాపించారు. 2009 అసెంబ్లీలో 13 స్థానాల్లో, 2019 ఎన్నికల్లో ఒక చోట గెలుపొందారు.

TG: తమ ప్రభుత్వం ఆర్టీసీలో తీసుకొచ్చిన ‘మహాలక్ష్మీ’ పథకం ద్వారా మహిళలు రూ.3,747 కోట్లు ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. డిసెంబర్ నుంచి ఈ నెల 20 వరకు 111 కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్లు తెలిపారు. పథకం అమలు తర్వాత ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 94 శాతానికి చేరిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక TGSRTC ప్రభుత్వ సహకారంతో 1,389 కొత్త బస్సులను కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఇవాళ, రేపు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది.
* మొత్తం స్లాట్స్: 204 * వేలంలో పాల్గొనేవారి సంఖ్య: 577
* భారత ప్లేయర్లు: 367 మంది * విదేశీ ప్లేయర్లు: 210 మంది
* అత్యంత పెద్ద వయస్కుడు: అండర్సన్(ENG)
* పిన్న వయస్కుడు: వైభవ్ సూర్యవంశి(బిహార్)
* లైవ్: స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్, IPL వెబ్సైట్
Sorry, no posts matched your criteria.