News June 20, 2024

కొత్త గనులను దక్కించుకోకపోతే సింగరేణి కనుమరుగు: భట్టి

image

TG: బొగ్గు గనులు ప్రభుత్వ సంస్థలకు దక్కకుండా BJP తీసుకొచ్చిన చట్టానికి BRS MPలు మద్దతు తెలిపారని మంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. దొంగే దొంగ అన్నట్లుగా ఆ పార్టీ నాయకుల తీరు ఉందని మండిపడ్డారు. ‘ఉద్యోగాల గని లాంటి సింగరేణి తెలంగాణకే తలమానికం. ప్రస్తుతం 40 గనుల్లో ఉత్పత్తి జరుగుతుండగా 2030 నాటికి 22 మూతపడనున్నాయి. కొత్త గనులను దక్కించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుంది’ అని పేర్కొన్నారు.

News June 20, 2024

T20WC: అఫ్గాన్‌తో మ్యాచ్‌.. సిరాజ్‌పై వేటు?

image

టీ20 వరల్డ్ కప్‌ సూపర్ 8లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో చైనామన్ కుల్దీప్ యాదవ్‌కు చోటివ్వాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. మ్యాచ్ జరిగే కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు ఉండటంతో ఈ మార్పు చేయనున్నట్లు టాక్. కాగా ఈ మెగా టోర్నీలో కుల్దీప్ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

News June 20, 2024

తమిళనాడు ప్రభుత్వానికి హీరో విశాల్ విజ్ఞప్తి

image

కల్తీ మద్యం తాగి తమిళనాడు రాష్ట్రంలో 30+ మంది ప్రాణాలు కోల్పోవడంపై హీరో విశాల్ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. ‘కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో కల్తీ మద్యం సేవించి చనిపోయిన వారి సంఖ్య పెరుగుతుండటం విషాదాన్ని నింపింది. తమిళనాడులో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. అందువల్ల సీఎం స్టాలిన్ గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు మద్యం షాపుల సంఖ్యను క్రమంగా తగ్గించడంపై దృష్టిపెట్టాలి’ అని ట్వీట్ చేశారు.

News June 20, 2024

సింగరేణిని నాశనం చేసింది కేసీఆరే: భట్టి

image

TG: సింగరేణిని మాజీ CM కేసీఆర్ సర్వనాశనం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్ నేతల తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. ‘సింగరేణి ఉద్యోగాల గని. రాష్ట్రానికే తలమానికం. కానీ బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్రం మొదలుపెడుతోంది. ఇందుకు సంబంధించిన బిల్లుకు బీఆర్ఎస్ కూడా మద్దతు పలికింది. బీఆర్ఎస్, బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయి’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News June 20, 2024

నెల రోజుల్లో ఆర్టీసీ ఉచిత ప్రయాణం: మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి

image

AP: మరో నెల రోజుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు చెప్పారు. ‘వైసీపీ హయాంలో ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదు. ఉన్న బస్సులనే యథావిధిగా కొనసాగించారు. ఆర్టీసీ మనుగడ కాపాడేందుకు కృషి చేస్తా. ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికులను కాపాడుకునే బాధ్యత మాపై ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.

News June 20, 2024

అసెంబ్లీ సమావేశాలకు విజిటర్స్‌కు నో ఎంట్రీ

image

AP: రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు విజిటింగ్ పాసులు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేల కుటుంబసభ్యులకు కూడా పాసులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీలో స్థలాభావం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా రేపు ఉదయం 9.46 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించనున్నారు.

News June 20, 2024

పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

image

AP: ఈవీఎం ధ్వంసం సహా పలు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. పిన్నెల్లికి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువును పొడిగించారు. తీర్పు వెలువడే వరకు ఇవి అమల్లో ఉంటాయని తెలిపారు.

News June 20, 2024

OTTలోకి వచ్చేసిన తెలుగు కొత్త సినిమా

image

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘గం.. గం.. గణేశా’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మే 31న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ క్రైమ్, కామెడీ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ చిత్రానికి ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించగా, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు.

News June 20, 2024

ఒడుదొడుకులు ఎదురైనా లాభాలతో ముగిశాయి

image

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 141 పాయింట్ల లాభంతో 77,478కు చేరింది. నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 23,567 వద్ద ముగిసింది. ఓ దశలో నిఫ్టీ గరిష్ఠంగా 23,624కు చేరింది. ప్రైవేట్ బ్యాంకులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాలు నమోదు చేయడంతో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా మార్కెట్లు పుంజుకున్నాయి. త్వరలోనే నిఫ్టీ 23,800 మార్క్ చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

News June 20, 2024

వడదెబ్బ మరణాలు.. ఆరోగ్యశాఖ అప్రమత్తం

image

దేశంలో వడదెబ్బ కేసులు, మరణాలు ఎక్కువవుతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి JP నడ్డా తెలిపారు. వడదెబ్బకు గురైన వారికి అందించే చికిత్స, ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రావొద్దని, ద్రవాహారం అధికంగా తీసుకోవాలని ప్రజలకు సూచించారు.