India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

✒ తేది: జనవరి 6, సోమవారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు ✒సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.22 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.20 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 5.56 గంటలకు ✒ ఇష: రాత్రి 7.13 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

* తెలుగు రాష్ట్రాలు ప్రపంచంతో పోటీ పడాలి: CM రేవంత్
* హైందవ శంఖారావంలో VHP డిక్లరేషన్
* పవన్ కళ్యాణ్ ఈజ్ మై అచీవ్మెంట్: చిరంజీవి
* తెలంగాణలో సంక్రాంతికి వారం రోజులు సెలవులు
* సంక్రాంతికి SCR 52 ప్రత్యేక రైళ్లు
* విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు: మంత్రి లోకేశ్
* కేసీఆర్ రైతు బంధువు.. రేవంత్ రాబంధు: కేటీఆర్
* చిక్కడపల్లి PSలో హాజరైన అల్లు అర్జున్
* 1-3 తేడాతో BGT సిరీస్ కోల్పోయిన భారత్

ఏపీ క్యాబినెట్ ఈనెల 17న మరోసారి సమావేశం కానుంది. ఈనెల 16 సా.4లోగా శాఖలన్నీ తమ ప్రతిపాదనలను అందించాలని సీఎస్ విజయానంద్ సూచించారు. ఈ భేటీలో పలు సంక్షేమ పథకాలు, పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈనెల 2న జరిగిన సమావేశంలో మంత్రివర్గం అమరావతిలో రూ.2,733 కోట్ల పనులతో సహా 14 కీలక అంశాలకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

SBIలో 13,735 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి జనవరి 7తో గడువు ముగియనుంది. తెలంగాణలో 342, ఏపీలో 50 ఖాళీలున్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. డిగ్రీ పూర్తి చేసిన వారితో పాటు ఫైనలియర్ విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. బేసిక్ పే నెలకు రూ.26,730. దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ/ఎస్టీ/PWD అభ్యర్థులకు ఫీజు లేదు. <

TG: భూమి లేని నిరుపేదలకు కూడా ఏటా రూ.12 వేలు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. కానీ ఏ ప్రాతిపదికన ఇస్తారో ఇంకా వెల్లడించలేదు. ఈలోగా కౌలు రైతుల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పథకం కోసం కౌలు పత్రం తీసుకోవాలా? అసలు భూ యజమానులు తమకు సహకరిస్తారా? భరోసా నిధులన్నీ ఒకేసారి ఇస్తారా? అని వారు చర్చించుకుంటున్నారు. భూ యజమానులతో సంబంధం లేకుండా తమకు పథకం వర్తింపజేయాలని అంటున్నారు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. ఈ టోర్నీలో కనీసం 5 టెస్టులు ఆడి అతి తక్కువ పరుగులు చేసిన భారత కెప్టెన్గా ఆయన నిలిచారు. ఈ సిరీస్లో హిట్మ్యాన్ 6.20 యావరేజ్తో 31 రన్స్ మాత్రమే చేశారు. గతంలో ఎంఎస్ ధోనీ (96 రన్స్/2011), సునీల్ గవాస్కర్ (118/1981), లాలా అమర్నాథ్ (140/1947) అతి తక్కువ రన్స్ సాధించారు.

*ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తినాలి.
*ఒకేసారి ఎక్కువగా కాకుండా ఎక్కువసార్లు తిన్నా సరే కొంచెం కొంచెం తినాలి.
*పెరుగు/మజ్జిగ జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను తయారు చేస్తాయి.
*చికెన్, మటన్ బదులు చేపలు ఎక్కువగా తినాలి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కంటిచూపు మెరుగవుతుంది.
*చక్కెర, ఉప్పు తగ్గించాలి. ఫలితంగా షుగర్, బీపీలకు దూరంగా ఉంటారు.
*రోజూ కనీసం 30 ని. పాటు వ్యాయామం చేయాలి.

AP: కేంద్రం నుంచి రాష్ట్రానికి 22 లక్షల టన్నుల యూరియా, ఎరువులు వచ్చినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రబీ సీజన్లో వీటిని అందుబాటులో ఉంచుతామని చెప్పారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి చొరవతో ఈ ఎరువులు రాష్ట్రానికి వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న కేంద్రానికి, మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ నెల 12లోగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే దేశాలు జట్టును ప్రకటించాల్సి ఉంది. కానీ బీసీసీఐ ఇంకా జట్టును ప్రకటించలేదు. ఈ టోర్నీకి రోహిత్ శర్మ సారథ్యం వహించడం ఖాయమని టాక్. ప్రాబబుల్ జట్టు: రోహిత్ (C), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, నితీశ్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, షమీ, సిరాజ్, అర్ష్దీప్, కుల్దీప్/రవి బిష్ణోయ్.
Sorry, no posts matched your criteria.