News September 5, 2024

బుల్‌డోజర్‌ రాజకీయాలు మానేయండి: మాయావతి

image

బుల్‌డోజర్‌ రాజకీయాలు మానుకొని, జ‌నావాసాల్లోకి చొర‌బ‌డి ప్ర‌జ‌ల‌పై దాడి చేస్తున్న వన్య‌ప్రాణుల క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని UP CM యోగీకి BSP చీఫ్ మాయావ‌తి సూచించారు. బుల్‌డోజ‌ర్ చర్యలను కోర్టు తప్పుబట్టడంతో BJP-SP మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తున్న వేళ మాయావ‌తి ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. బుల్‌డోజర్ చర్యలను బీజేపీ సమర్థించుకోగా, అదే గుర్తుపై పోటీ చేసి గెలవాలని అఖిలేశ్ సవాల్ చేశారు.

News September 5, 2024

CM రేవంత్‌కు ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆహ్వానం

image

TG: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఖైరతాబాద్ శ్రీగణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు CM రేవంత్ రెడ్డిని కోరారు. ఈమేరకు కమిటీ సభ్యులు ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిసి ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా అర్చకులు రేవంత్‌కు ఆశీర్వచనం అందించారు.

News September 5, 2024

రూ.15 లక్షలు విరాళం ప్రకటించిన వరుణ్ తేజ్

image

వరదలతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సహాయంగా రూ.15 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు నటుడు వరుణ్ తేజ్ ట్విటర్‌లో ప్రకటించారు. ‘తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక రూ.5లక్షలు, ఏపీ పంచాయతీరాజ్ శాఖకు రూ.5 లక్షలు మొత్తం రూ. 15 లక్షలు విరాళంగా అందిస్తున్నాను’ అని వెల్లడించారు.

News September 5, 2024

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట

image

TG:విద్యార్థుల స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట దక్కింది. MBBS అడ్మిషన్లకు సంబంధించి జారీ చేసిన GO 33ను న్యాయస్థానం సమర్థించింది. పిటిషనర్ల స్థానికతను నిర్ధారించుకున్నాకే, వారి దరఖాస్తులను తీసుకోవాలని సూచించింది. విద్యార్థులు తెలంగాణ శాశ్వత నివాసులేనా? కాదా? అన్నది పరిశీలించాలంది. ప్రస్తుతం వీటిపై గైడ్‌లైన్స్ లేకపోవడంతో కొత్తగా రూపొందించాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీని ఆదేశించింది.

News September 5, 2024

సెప్టెంబర్ 29న BCCI ఏజీఎం.. NCA ప్రారంభోత్సవం

image

బెంగళూరులో సెప్టెంబర్ 29న బీసీసీఐ 93వ ఏజీఎం జరగనుంది. ఇప్పటికే 18 అంశాలతో కూడిన అజెండాను రాష్ట్ర సంఘాలకు పంపించారు. ఐసీసీకి వెళ్తున్న జైషా స్థానంలో మరొకర్ని ఈ సమావేశంలో ఎన్నుకొనే అవకాశం లేదని తెలిసింది. డిసెంబర్ 1న ఆయన ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకుంటారు. అయితే ఏజీఎం రోజే జరిగే కొత్త NCA ప్రారంభోత్సవంలో బోర్డు సభ్యులు పాల్గొంటారు. కొత్త కార్యదర్శి ఎంపికకు SGM నిర్వహిస్తారని సమాచారం.

News September 5, 2024

130 సినిమాల్లో కలిసి హీరోహీరోయిన్‌గా నటించారు!

image

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓ హీరో, హీరోయిన్ కలిసి మూడు, నాలుగు సినిమాలు తీయడమే ఎక్కువ. కానీ ఓ జంట ఏకంగా 130 చిత్రాల్లో కలిసి నటించారనే విషయం మీకు తెలుసా? 1962 – 1981 మధ్యకాలంలో మలయాళ నటీనటులు ప్రేమ్ నజీర్, షీలా 130 చిత్రాల్లో కలిసి నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. సూపర్ హిట్ జోడీగానూ పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ నటించిన సినిమాల్లో 50కిపైగా చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.

News September 5, 2024

ఇంట్లో కూర్చొనే సిమ్ యాక్టివేట్ చేయొచ్చు

image

రిలయన్స్ జియో వినియోగదారులు సిమ్ యాక్టివేషన్ కోసం ఎగ్జిక్యూటివ్ దగ్గరకు వెళ్లకుండా ఇంట్లోనే చేసుకునే సదుపాయం తీసుకొచ్చింది. ఐయాక్టివేట్‌తో ఎప్పుడైనా, ఎక్కడైనా సిమ్ యాక్టివేట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీని కోసం MY JIO యాప్‌లో ఐయాక్టివేట్‌పై క్లిక్ చేయాలి. డీటెయిల్స్ ఎంటర్ చేసి ‘గో ఫర్ జియో ఐయాక్టివేట్‌’పై క్లిక్ చేయాలి. అనంతరం కేవైసీ పూర్తి చేయడంతో సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

News September 5, 2024

ప్రొడక్టివిటీ పెంచాలని ‘పెయిడ్ టిండర్ లీవ్’ ఇచ్చిన కంపెనీ

image

ఉద్యోగుల సంక్షేమం కోరుకున్న ఓ థాయ్ కంపెనీ వారికి పెయిడ్ టిండర్ లీవ్ ఇచ్చినట్టు స్ట్రైయిట్స్ టైమ్స్ తెలిపింది. వైట్‌లైన్ గ్రూప్ ఈ డిసెంబర్ వరకు టిండర్ గోల్డ్, ప్లాటినమ్‌ సబ్‌స్క్రిప్షన్‌కు డబ్బులు ఇస్తోందట. డేటింగ్‌ తేదీకి వారం ముందు నోటీస్ ఇవ్వాలని సూచించింది. ప్రేమ వల్ల సంతోషం దాంతో ప్రొడక్టివిటీ పెరుగుతుందని కంపెనీ భావన. డేటింగ్‌‌కు వెళ్లే టైమ్ లేదన్న ఓ ఉద్యోగి మాటలే ఈ నిర్ణయానికి కారణం.

News September 5, 2024

అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పులు?

image

త్రివిధ దళాల్లో నియామకాలకు తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పుల దిశగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వయో పరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచడంపై చర్చలు జరుగుతున్నాయని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అలాగే ఎంపికైన వారిలో నాలుగేళ్ల తర్వాత ప్రస్తుతం 25 శాతం మందిని మాత్రమే రెగ్యులర్ సర్వీసులోకి తీసుకుంటుండగా, ఈ సంఖ్యను 50 శాతానికి పెంచే అవకాశం ఉందన్నారు.

News September 5, 2024

BREAKING: ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు

image

AP: మహిళపై లైంగిక దాడి ఆరోపణల <<14027071>>నేపథ్యంలో <<>> తమ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ చర్యలకు దిగింది. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.