News December 4, 2024

PSLV-C59 ప్రయోగం వాయిదా

image

శ్రీహరికోట నుంచి ప్రయోగించాల్సిన PSLV-C59 ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. రేపు సాయంత్రం 4.12 గంటలకు రాకెట్ ప్రయోగిస్తామని వెల్లడించింది. సూర్యుడి కరోనాను పరీక్షించేందుకు ఈ పరిశోధన చేపట్టారు.

News December 4, 2024

అమరావతిలో త్వరలోనే ఇంటి నిర్మాణం: CBN

image

AP: అమరావతిలో నివాస <<14784465>>గృహానికి<<>> భూమి కొనుగోలు చేసినట్లు, త్వరలో ఇంటి నిర్మాణం ప్రారంభిస్తామని CM చంద్రబాబు తెలిపారు. అటు, కాకినాడ పోర్టు విషయంలో జగన్ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. పారిశ్రామికవేత్తలను బెదిరించిన నీచ చరిత్ర జగన్‌ది అని, అన్నింటిపైనా విచారిస్తామని మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. కాకినాడ పోర్టులో సీజ్ చేసిన షిప్‌లో ఇవాళ కూడా అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.

News December 4, 2024

3 లక్షల ఏళ్ల క్రితం నాటి మానవ పుర్రె

image

3లక్షల ఏళ్లకంటే పురాతనమైన మానవ అవశేషాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనా హవాయి విశ్వవిద్యాలయం కాలేజీ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లోని మనోవా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ జె. బే వీటిని కనిపెట్టారు. ఆయన 30 ఏళ్లుగా ఆసియా అంతటా మానవ పూర్వీకులపై అధ్యయనం చేశారు. ఫలితంగా హోమో జులుయెన్సిస్ అనే పురాతన మానవ జాతిని గుర్తించారు. పెద్ద పుర్రె ఆధారంగా వీరి తలలు పెద్దగా ఉంటాయని తెలిపారు.

News December 4, 2024

రాహుల్ బయటేం చేస్తున్నారు?: LS ప్యానెల్ స్పీకర్

image

యూపీలోని సంభల్‌కు వెళ్తున్న రాహుల్ గాంధీని పోలీసులు <<14786784>>అడ్డుకోవడాన్ని<<>> కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే అంశాన్ని ఆ పార్టీ ఎంపీ మహ్మద్ జావెద్ లోక్‌సభలో లేవనెత్తారు. ప్రతిపక్ష నేతను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ప్యానెల్ స్పీకర్ జగదాంబికా పాల్ ‘ఇక్కడ పార్లమెంట్ సెషన్ నడుస్తుంటే రాహుల్ బయటేం చేస్తున్నారు? ఆయన సమావేశాలకు హాజరవ్వాలి కదా?’ అని కౌంటర్ ఇచ్చారు.

News December 4, 2024

KCRపై కోపంతో CM అలా చేస్తున్నారు: KTR

image

TG: KCRపై కోపంతో CM రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చుతున్నారని KTR అన్నారు. ‘మూర్తీభవించిన స్త్రీగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని KCR ఏర్పాటు చేయించారు. దానిని మార్చవద్దని CMకి చెబుతున్నా. ఇందిరా గాంధీ పెట్టిన భరత మాత విగ్రహాన్ని వాజపేయీ మార్చలేదు. రేవంత్ ఆటలు ఎల్లకాలం సాగవు. రాజీవ్ విగ్రహం ఉన్న చోటే భవిష్యత్తులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం’ అని ప్రెస్ మీట్‌లో వ్యాఖ్యానించారు.

News December 4, 2024

పేద పిల్లల చదువు, ఆరోగ్యంపై దృష్టి పెట్టనున్న సచిన్ కూతురు

image

తన కుమార్తె సారా టెండూల్కర్ సచిన్ ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా నియమితులైనట్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెలిపారు. ‘ఆమె లండన్ యూనివర్సిటీ నుంచి క్లినికల్ & పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందింది. క్రీడలు, ఆరోగ్య సంరక్షణ & విద్య ద్వారా భారతదేశాన్ని మరింత శక్తిమంతం చేయడానికి ఆమె ప్రయత్నిస్తోంది’ అని ఆయన తెలిపారు. నిరుపేద పిల్లలతో ఆమె ఉన్న ఫొటోలను ఆయన పంచుకున్నారు.

News December 4, 2024

ఒకే ప్రాంతంలో మూడేళ్లుగా భూకంపం!

image

తెలంగాణలోని ములుగులో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రంలో గత మూడేళ్లుగా సంభవించిన భూకంపాల్లో ప్రతి ఏటా ఒకే ప్రాంతంలో ములుగు చుట్టు పక్కన భూమి కంపించడాన్ని గుర్తించినట్లు నిపుణులు పేర్కొన్నారు. అక్కడ ఈసారి కాస్త బలంగా వచ్చినట్లు వెల్లడించారు. గడ్చిరోలి సమీపంలో 2021లో 4.0, 2022లో 3.8, 2023లో భద్రాద్రిలో 3.6 తీవ్రతతో భూకంపాలు వచ్చాయన్నారు.

News December 4, 2024

అమరులైన పోలీస్ కుటుంబాలకు రూ.లక్ష: హోంమంత్రి

image

AP: విధినిర్వహణలో ప్రమాదవశాత్తు/ఆకస్మికంగా/అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు అందించే తక్షణ సాయాన్ని కూటమి ప్రభుత్వం మూడు రెట్లు పెంచింది. వారి అంతిమ సంస్కారాల కోసం అందించే రూ.25వేల సాయాన్ని రూ.లక్షకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని హోంమంత్రి అనిత X వేదికగా వెల్లడించారు.

News December 4, 2024

ఉద్యోగాల్లో రోబోటిక్స్ వినియోగం ఎక్కువగా ఉన్న దేశం ఇదే!

image

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో రోబోల వినియోగం భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణ కొరియాలో ఇవి అత్యధిక సంఖ్యలో వినియోగంలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజా నివేదిక ప్రకారం ఇక్కడ ప్రతి 10వేల మంది ఉద్యోగులకు 1,102 రోబోలు ఉన్నాయి. 2008 నుంచి పోల్చితే వీటి వినియోగం 5శాతం పెరిగింది. ఈ దేశం రోబోటిక్స్ వైపు మళ్లడంతో పనుల్లో మానవ శ్రమ తగ్గి ఉత్పాదకత పెరిగింది.

News December 4, 2024

‘సీజ్ ద షిప్’ పేరిట మూవీ టైటిల్

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చిన మాట ఇప్పుడు ఓ సినిమాకు టైటిల్‌గా మారింది. ఇటీవల కాకినాడ పోర్టులో తనిఖీల సందర్భంగా ఆయన ‘సీజ్ ద షిప్’ అనే ఆదేశాలు ఇవ్వడంతో అప్పటినుంచి ఈ వాక్యం వైరలవుతోంది. తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఓ సినీ నిర్మాత రూ.1100 చెల్లించి ‘సీజ్ ద షిప్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్నారు.