News November 26, 2024

చంద్రబాబు, ఏక్‌నాథ్‌ శిండే విజయాల వెనుక కామ‌న్ పాయింట్ ఇదే

image

AP అసెంబ్లీ ఎన్నికల్లో TDP 135 స్థానాల్లో ఘ‌న విజ‌యం సాధించ‌డానికి కృషి చేసిన పొలిటిక‌ల్ క‌న్స‌ల్టెన్సీ షో టైం మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన(శిండే) కోసం ప‌ని చేసింది. 81 సీట్ల‌లో పోటీ చేసిన ఆ పార్టీ 70% Strike Rateతో 57 స్థానాల్లో నెగ్గడం వెనుక షో టైం రాబిన్ శ‌ర్మ కీల‌క‌ం. శిండేను Man of Massesగా, ఆర్థిక సాయం ప‌థకాల‌తో ఆయ‌న్ను మ‌హిళా ప‌క్ష‌పాతిగా ప్రొజెక్ట్ చేసి ఓట్లు రాబట్టడంలో రాబిన్ సక్సెస్ అయ్యారు.

News November 26, 2024

చైనాలో ‘మహారాజ’కు టాప్ రేటింగ్

image

విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ మూవీ చైనాలో ఈ నెల 29న 40వేల థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే అక్కడ ప్రివ్యూలు చూసిన విశ్లేషకులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రముఖ మూవీ రివ్యూ సైట్ Douban 8.7/10 రేటింగ్ ఇచ్చింది. ఇటీవలకాలంలో ఓ భారత చిత్రానికి ఇచ్చిన అత్యధిక రేటింగ్ ఇదే. కాగా ఆమిర్ ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్, దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్ చైనాలో సంచలన విజయాలు సాధించాయి.

News November 26, 2024

సెకీ ఒప్పందాలపై ACBకి ఫిర్యాదు

image

AP: సెకీతో విద్యుత్ ఒప్పందాలపై ACBకి సెంటర్ ఫర్ లిబర్టీ ఫిర్యాదు చేసింది. గత ప్రభుత్వంలో జగన్, అదానీ మధ్య జరిగిన డీల్‌పై విచారించాలంటూ పలు ఆధారాలను అందించింది. జగన్, విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌తో పాటు అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని విచారించాలని కోరింది. ఈ ఒప్పందంతో రాష్ట్రానికి భారీ నష్టమని, ప్రభుత్వం స్పందించి విచారణ వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది.

News November 26, 2024

YCP సర్కార్ సమోసాలకే రూ.9 కోట్లు ఖర్చు చేసింది: పవన్

image

AP: వైసీపీ ప్రభుత్వం బాధ్యత, జవాబుదారీతనం, పారదర్శకత లేకుండా పాలించిందని Dy.CM పవన్ కళ్యాణ్ విమర్శించారు. సమోసాల కోసమే రూ.9 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ‘చంద్రబాబు, లోకేశ్, నన్ను ఇబ్బంది పెట్టినవారిని శిక్షించాలని మీడియా కూడా కోరుకుంటోంది. వారిని పట్టుకోవటంలో తటపటాయింపు ఎందుకని అడుగుతోంది. కానీ నేనేం హోంమంత్రిని కాదు. ఆ విషయం పోలీసులే చూసుకుంటారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News November 26, 2024

చిన్మయ కృష్ణదాస్ అరెస్ట్‌పై భారత్ ఆందోళన

image

చిన్మయ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్‌ అరెస్టు చేయడం, బెయిల్ నిరాకరించడంపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ‘బంగ్లాలో హిందువులు సహా మైనారిటీలపై ఉగ్రమూకల దాడులు జరుగుతున్నాయి. వారిని దోచుకుంటున్నారు. గుళ్లను, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. నిందితుల్ని వదిలేసి శాంతియుతంగా డిమాండ్లు వినిపిస్తున్న కృష్ణదాస్‌ను అరెస్ట్ చేయడం దురదృష్టకరం. మైనారిటీలకు బంగ్లా భద్రత కల్పించాలి’ అని పేర్కొంది.

News November 26, 2024

రూ.27 కోట్లలో రిషభ్ చేతికి వచ్చేది ఎంతంటే..

image

IPL చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషభ్ పంత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. లక్నో అతడిని రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. దీనిలో రూ.8.1 కోట్లు పన్నుగా వెళ్లిపోగా పంత్ చేతికి రూ.18.9 కోట్లు అందుతాయి. ఒకవేళ టోర్నీకి ముందే గాయపడినా, వ్యక్తిగత కారణాలతో తప్పుకొన్నా ఆ డబ్బు రాదు. టోర్నీ మధ్యలో గాయపడి తప్పుకుంటే మాత్రం చెల్లిస్తారు. భారత మ్యాచ్‌లకు ఆడుతూ గాయపడినా డబ్బు దక్కుతుంది.

News November 26, 2024

మన ధైర్యాన్ని పరీక్షించిన రోజు 26/11: సచిన్

image

ముంబైలో ఉగ్రదాడి జరిగి నేటికి 16 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆ రోజును ట్విటర్‌లో గుర్తుచేసుకున్నారు. ‘2008 నవంబరు 26.. మనల్ని పరీక్షించిన ఆ రోజు మన ధైర్యాన్ని దెబ్బతీయలేకపోయింది. ఓ జాతిగా మనకున్న బలాన్ని ఆరోజు మన హీరోలు చూపించిన తెగువ, ముంబైలోని ప్రతి పౌరుడి పట్టుదల ఎప్పుడూ గుర్తుచేస్తుంటాయి. గుర్తుపెట్టుకుంటాం. గౌరవించుకుంటాం. ఐకమత్యంగా ఉంటాం’ అని ట్వీట్ చేశారు.

News November 26, 2024

ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల

image

ఏపీలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఆ రోజు నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు డిసెంబర్ 13తో ముగియనుంది. డిసెంబర్ 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. మోపిదేవి, బీద మస్తాన్, ఆర్.కృష్ణయ్య రాజీనామాలతో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే.

News November 26, 2024

జగన్, అదానీ ముడుపుల వ్యవహారంపై సీఎంతో చర్చిస్తాం: పవన్

image

AP: వైసీపీ ప్రభుత్వ తప్పులు రాష్ట్రానికి శాపాలుగా మారాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వాటిని ఇప్పుడు తాము సరిదిద్దాల్సి వస్తోందన్నారు. జగన్, అదానీ ముడుపుల వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వానికి అస్సలు బాధ్యత లేదని, సమోసాల కోసమే రూ.9కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు.

News November 26, 2024

BREAKING: రేపు తుఫాన్

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చినట్లు APSDMA వెల్లడించింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ రేపు తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది 2 రోజుల్లో తమిళనాడు తీరానికి చేరనుందని పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో 29వ తేదీ వరకు అక్కడక్కడా భారీ వర్షాలు, పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయంది. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.