India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రజల కొన్నేళ్ల తపస్సు, త్యాగం, చాతుర్యం, బలం, సామర్థ్యాల ఫలితమే రాజ్యాంగమని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా అన్నారు. భౌగోళిక, సామాజిక వైవిధ్యాలను ఒకే దారంలో కూర్చేందుకు పార్లమెంటు సెంట్రల్ హాల్లో మూడేళ్లు శ్రమించామని తెలిపారు. PM మోదీ స్ఫూర్తితో 2015 నుంచి NOV 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. నేడు కోట్లాది మంది కృతజ్ఞతా పూర్వకంగా రాజ్యాంగ పీఠికపై ప్రమాణం చేస్తున్నారని వెల్లడించారు.

రాజ్యాంగం దేశ పవిత్ర గ్రంథమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. రాజ్యాంగ వజ్రోత్సవ విషెస్ తెలిపిన ఆమె చరిత్రాత్మక ఘటనలో దేశ పౌరులందరూ భాగస్వాములు అవుతున్నారన్నారు. ‘75ఏళ్ల క్రితం ఇదే రోజు రాజ్యాంగం ఆమోదం పొందింది. ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల ఆధారంగా రూపకల్పన జరిగింది. రాజ్యాంగానికి రాజేంద్ర ప్రసాద్, అంబేడ్కర్ మార్గనిర్దేశం చేశారు. ప్రగతిశీల సూత్రాల గురించి పొందుపరిచారు’ అని చెప్పారు.

మరో 9 రోజుల్లో రిలీజ్ కాబోతున్న ‘పుష్ప-2’ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ మూవీ రన్ టైమ్ 3 గంటల 15 నిమిషాలు అని సినీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మేకర్స్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మిక, ఫహాద్ ఫాజిల్ తదితరులు నటించిన సంగతి తెలిసిందే.

ఎకనామిక్స్లో నోబెల్ పొందిన మహ్మద్ యూనస్ పాలనలో బంగ్లాదేశ్ మరింత అంధకారంలోకి వెళ్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే అదానీకి బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ లేక టెక్స్టైల్ ఇండస్ట్రీ పడకేసిందని పేర్కొన్నారు. ప్రజలకు ఉపాధి కరవైందన్నారు. మరోవైపు జమాతే ఇస్లామీ ఆయన దిగిపోవాలని అల్లర్లు చేస్తుండటాన్ని ఉదహరిస్తున్నారు. ఇక మైనార్టీల పరిస్థితి మరింత దిగజారిందని, దాడులు పెరిగాయని అంటున్నారు.

ముంబై బ్యాటర్ పృథ్వీ షా IPL-2025 వేలంలో అన్సోల్డ్గా మిగిలారు. ఫామ్ లేమి, అధిక బరువు, ఫిట్నెస్ సమస్యలు, వ్యక్తిగత వివాదాలు ఇందుకు కారణమని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. తరచూ గాయాలబారిన పడుతున్న అతడు సీజన్ మొత్తం ఆడగలడనే నమ్మకం ఫ్రాంచైజీల్లో కలగలేదని అంటున్నాయి. IPLలో DC తరఫున 2018లో అరంగేట్రం చేసిన షా ఆ సీజన్లో 153 స్ట్రైక్ రేటుతో రాణించారు. ఆ తర్వాతి సీజన్లలో అతడి SR 134, 137కి తగ్గింది.

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను AP హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. పోలీసులు ఇప్పటికే రెండుసార్లు నోటీసులిచ్చినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు ఒంగోలు ఎస్పీ ప్రత్యేక బృందాలను పంపారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేశ్ను కించపరిచేలా పోస్టులు పెట్టారని RGVపై మద్దిపాడు PSలో కేసు నమోదైన సంగతి తెలిసిందే.

అబుదాబి T10 లీగ్లో BGT ఆల్రౌండర్ దసున్ షనక బౌలింగ్లో లయ తప్పారు. DBLతో మ్యాచ్లో 9వ ఓవర్ వేసిన అతను తొలి 3 బంతుల్లోనే 30(4, 4+nb, 4+nb, 4, 6, nb, 4+nb) పరుగులు, ఆ తర్వాత 3 బాల్స్కు 3 రన్స్ ఇచ్చారు. మొత్తంగా ఆ ఓవర్లో 33 రన్స్ వచ్చాయి. అనంతరం బ్యాటింగ్లో దసున్ 14 బంతుల్లో 33 పరుగులు(3 సిక్సులు, 2 ఫోర్లు) చేశారు. తొలుత ఢిల్లీ 123/6 స్కోర్ చేయగా, బంగ్లా 9.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

చైనాతో <<14711264>>వాణిజ్యంలో ఆంక్షలు విధించాలని<<>> అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్న నేపథ్యంలో చైనా స్పందించింది. వాణిజ్యంలో యుద్ధం వలన ఏ దేశానికీ లాభం ఉండదని అమెరికాలో చైనా ఎంబసీ అధికార ప్రతినిధి లియూ పెంగ్యూ వ్యాఖ్యానించారు. అది ఎవరూ గెలవని పోరు అని అభివర్ణించారు. చైనా-అమెరికా వాణిజ్య సహకారం పరస్పర లాభదాయకమని తాము భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

TG: భువనేశ్వర్లో జరిపిన దాడుల వివరాలను ఈడీ Xలో పోస్ట్ చేయగా, KTR స్పందించారు. ’60 రోజుల క్రితం తెలంగాణ రెవెన్యూ మంత్రి ఇల్లు, ఆఫీసుల్లో చేసిన దాడులపై అప్డేట్స్ ఏవి? ఫొటోలు/వీడియోలు ఎందుకు పోస్ట్ చేయలేదు? లోపలికి తీసుకెళ్లిన 2 కరెన్సీ కౌంటింగ్ మెషీన్స్ ఏమయ్యాయి? ఎందుకు మౌనంగా ఉన్నారు?’ అని ప్రశ్నించారు. సెప్టెంబర్లో మంత్రి పొంగులేటి ఇల్లు, ఆఫీసులో ED దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

BGT సిరీస్ మధ్యలోనే టీమ్ఇండియా కోచ్ గంభీర్ AUS నుంచి ఇండియాకు తిరుగుపయనం కానున్నారు. కుటుంబ అవసరాల నిమిత్తం ఆయన వస్తున్నట్లు India today తెలిపింది. అయితే, 2వ టెస్ట్ ప్రారంభమయ్యే నాటికి జట్టులో చేరే అవకాశాలున్నాయి. పెర్త్ తొలి టెస్టులో 295 పరుగుల విజయాన్ని అందుకున్న ఇండియా అడిలైడ్లో రెండో టెస్ట్ డిసెంబర్ 6నుంచి ఆడనుంది. రోహిత్, గిల్ జట్టుతో చేరనుండగా ప్లేయింగ్ 11 కూర్పుపై కసరత్తు జరుగుతోంది.
Sorry, no posts matched your criteria.