News November 24, 2024

CM కుర్చీ కోసం ‘ముగ్గురు మొనగాళ్లు’

image

మహారాష్ట్రలో BJP నేతృత్వంలోని మహాయుతికి 230 సీట్లతో స్పష్టమైన మెజారిటీ వచ్చింది. కూటమిలోని BJP 149 స్థానాల్లో పోటీ చేయగా 132 గెలిచింది. శివసేన 81లో 57, NCP 59లో 41 గెలిచింది. కాగా తమ నేత ఫడణవీస్‌ CM కావడం పక్కా అని BJP అంటుంటే, శిండే నేతృత్వంలోని శివసేన సైతం CM విషయంలో తగ్గేదేలే అంటోంది. అటు NCP అజిత్ పవార్‌ కూడా CM కుర్చీ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించట్లేదు.

News November 24, 2024

డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు

image

TG: అధికారం చేపట్టి ఏడాది పూర్తికావస్తున్న సందర్భంగా DEC 1-9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని CM రేవంత్ నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని, అన్ని శాఖలు భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలోనూ వేడుకలు జరపాలన్నారు. తొలి ఏడాది ప్రభుత్వ విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించాలని అధికారులకు సూచించారు.

News November 24, 2024

IPL వేలం: ఇతనిపైనే అందరి చూపు

image

ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్‌పై అందరి దృష్టి ఉంది. ఈ వేలంలో ఆయనే అత్యధిక ధర పలుకుతారని అంచనా వేస్తున్నారు. రాహుల్, శ్రేయస్, అర్ష్‌దీప్, ఇషాన్, షమీ వంటి ప్లేయర్లు కూడా అధిక ధర పలికే అవకాశముంది. గత సీజన్‌లో స్టార్క్ అత్యధికంగా రూ.24.75 కోట్ల ధర పలకగా ఈసారి సరికొత్త రికార్డులు నమోదవుతాయని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

News November 24, 2024

ఈ నెల 27న వారి ఖాతాల్లో డబ్బులు జమ

image

TG: 2023-24 ఆర్థిక సంవత్సరం, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 24 మధ్య రిటైర్డ్ అయిన కార్మికులకు దీపావళి బోనస్ రిలీజ్ చేస్తున్నట్లు సింగరేణి ఎండీ బలరామ్ తెలిపారు. ఈ నెల 27న వారి ఖాతాల్లోకి రూ.18.27కోట్లు జమ చేస్తామని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.93,570 చొప్పున 2,754 మంది కార్మికులకు బోనస్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News November 24, 2024

‘నోటా’కు నో!

image

ఎన్నికల బరిలో నిల్చున్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ‘నోటా’కు ఓటేయొచ్చు. 2013లో ఈసీ ఈ అవకాశాన్ని తీసుకొచ్చింది. మొదట్లో చాలామంది నోటాకే ఓటేయగా రానురాను ఆదరణ తగ్గిపోతోంది. నిన్న వెలువడిన మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ ఇదే తేలింది. MHలో నోటాకు 0.75%, ఝార్ఖండ్‌లో 1.32% ఓట్లు మాత్రమే పడ్డాయి. నోటాకు వేయడం వల్ల ఓటు వృథా అవుతోందని చాలామంది భావిస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

News November 24, 2024

వాయుగుండం.. మూడు రోజులు భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 27, 28, 29న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

News November 24, 2024

త్వరలో భారత్‌కు బ్రిటన్ ‘కింగ్’

image

బ్రిటన్ కింగ్ ఛార్లెస్-3 తన సతీమణి క్వీన్ కెమెల్లాతో కలిసి త్వరలో భారత్‌కు రానున్నారు. తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో 2022లో ఆయన ఇండియా టూర్ రద్దయింది. ఇప్పుడు INDతో పాటు పాక్, బంగ్లాలోనూ ఆయన పర్యటిస్తారు. ఈ ఏడాది క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ కోలుకున్న ఆయన OCTలో ఆస్ట్రేలియా నుంచి బ్రిటన్‌కు తిరుగు ప్రయాణంలో బెంగళూరులోని ఓ వెల్‌సెస్ సెంటర్‌కి వెళ్లారు. ఇప్పుడు మరోసారి అక్కడికి వెళ్లే ఛాన్సుంది.

News November 24, 2024

కాంగ్రెస్ ‘మహా’ పతనం

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పతనాన్ని చూసింది. కేవలం 16 సీట్లకే పరిమితమైంది. 1990లో 141 స్థానాల్లో విజయం సాధించగా, 1995లో 80, 1999లో 75, 2004లో 69, 2009లో 82, 2014లో 42, 2019లో 44 సీట్లను గెలుచుకుంది. తాజాగా 20 సీట్లలోపే రావడం కాంగ్రెస్‌కు రాష్ట్ర ప్రజల్లో ఆదరణ తగ్గడాన్ని సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News November 24, 2024

క్యాన్సర్‌పై సిద్ధూ వ్యాఖ్యలను నమ్మకండి: టాటా మెమోరియల్ హాస్పిటల్

image

డైట్ కంట్రోల్ వల్ల తన భార్యకు స్టేజ్-4 <<14676790>>క్యాన్సర్<<>> నయమైందన్న మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ కామెంట్స్‌పై టాటా మెమోరియల్ ఆసుపత్రి స్పందించింది. ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా నమ్మొద్దని క్యాన్సర్ పేషెంట్లకు సూచించింది. ‘పసుపు, వేపాకు తినడం వల్ల క్యాన్సర్‌ను జయించొచ్చన్నది సరికాదు. దీన్ని నమ్మి వైద్యం తీసుకోవడం మానొద్దు. ఎలాంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించాలి’ అని కోరింది.

News November 24, 2024

స్టార్క్ బెదిరింపులపై రాణా ఏమన్నారంటే?

image

తొలి టెస్టులో ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టార్క్‌తో <<14684131>>సరదా సంభాషణ<<>> జరిగిందని బౌలర్ హర్షిత్ రాణా చెప్పారు. మైదానంలో ఇలాంటివి జరుగుతుంటాయని, ఇది పెద్ద విషయం కాదన్నారు. హెడ్‌ను ఔట్ చేయడంపై జట్టు ఆటగాళ్లతో చర్చించుకున్నట్లు తెలిపారు. ఒక ఎండ్ నుంచి బ్యాటర్లపై బుమ్రా ఒత్తిడి పెంచి మరో ఎండ్‌లోని బౌలర్ పనిని సులభం చేస్తారని పేర్కొన్నారు. కాగా తొలి ఇన్నింగ్సులో హర్షిత్ 3 వికెట్లు తీశారు.