News August 21, 2024

దారుణం: బాలికలకు అశ్లీల వీడియోలు చూపించిన టీచర్

image

విద్యార్థులకు సన్మార్గం చూపాల్సిన గురువే కామాంధుడిలా మారారు. బాలికలకు అశ్లీల వీడియోలను చూపించి వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని కజిఖేడ్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగుచూసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు ప్రమోద్ సర్దార్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

News August 21, 2024

ఎస్సీ వర్గీకరణపై మీ అభిప్రాయం?

image

ఏపీ, తెలంగాణకు చెందిన ఎస్సీల్లో మాలలు, మాదిగలు, రెల్లి లాంటి 57 ఉపకులాలు ఉన్నాయి. జనాభాలో తమ కంటే తక్కువ సంఖ్యలో ఉన్న మాలలు ఎక్కువ రిజర్వేషన్లు పొందుతున్నారనేది మాదిగల ఆవేదన. ఎస్సీలను A, B, C, D వర్గాలుగా విభజించాలని డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా దానికి అనుమతి ఇచ్చింది. అయితే వర్గీకరణతో తాము రిజర్వేషన్లు కోల్పోతామని మాలలు మండిపడుతున్నారు. మరి వర్గీకరణ న్యాయమా? కాదా? కామెంట్ చేయండి.

News August 21, 2024

స్కూళ్లు బంద్ అంటూ మెసేజులు

image

భారత్ బంద్ నేపథ్యంలో స్కూళ్లకు సెలవు అంటూ తల్లిదండ్రులకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇప్పుడు మెసేజులు పంపుతున్నాయి. దీంతో స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమైన వారితో పాటు వెళ్లిన పిల్లలు తిరిగి ఇంటికి వచ్చేస్తున్నారు. టీచర్లు మాత్రం పాఠశాలకు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. అటు బీఎస్పీ సహా వివిధ దళిత సంఘాలు తెలుగు రాష్ట్రాల్లోని పలు డిపోల వద్ద ఆందోళన చేయడంతో బస్సులు నిలిచిపోయాయి.

News August 21, 2024

అలాంటి ఇన్నింగ్స్ నా జీవితంలో చూడలేదు: షాహీన్ అఫ్రీది

image

టీ20 ప్రపంచకప్-2022లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమని ఆ దేశ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రీది కొనియాడారు. ‘నా కెరీర్ మొత్తంలో అలాంటి ఇన్నింగ్స్ చూడలేదు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా, తొలుత పాక్ 159 రన్స్ చేయగా విరాట్ 53 బంతుల్లో 82 రన్స్ చేసి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించారు.

News August 21, 2024

ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు

image

TG: ఎడ్‌సెట్ తొలివిడత కౌన్సెలింగ్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆగస్టు 8 నుంచి మొదలైన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 23 వరకు కొనసాగుతుంది. 24వ తేదీ నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. 27న వెబ్ ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉంది. 30న సీట్లు కేటాయిస్తారు. 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీలోగా తమకు సీటు వచ్చిన కాలేజీలో విద్యార్థులు రిపోర్ట్ చేయాలి.

News August 21, 2024

వారి పెన్షన్లు కట్!

image

AP: బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్ పొందుతున్న వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అందుకుంటుండగా అందులో అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించి ఇటీవల నోటీసులు జారీ చేశారు. 60వేల మందికి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తాజాగా మంత్రి DBGV స్వామి సైతం బోగస్ సర్టిఫికెట్లు పెడితే పెన్షన్ల పంపిణీకి అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు.

News August 21, 2024

నేటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్

image

AP: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) మొదటి విడత కౌన్సెలింగ్‌ను నేటి నుంచి ప్రారంభం కానుంది. 27వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని కన్వీనర్ ఉమామహేశ్వరి తెలిపారు. 22 నుంచి 28వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన 27న నిర్వహించనున్నారు. 29 నుంచి SEP 2 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక, 5వ తేదీ నుంచి సీట్ల కేటాయింపు జరుగుతుంది.

News August 21, 2024

తొందరపడ్డా.. మళ్లీ సర్వీసులోకి తీసుకోండి: ప్రవీణ్ ప్రకాశ్

image

AP: స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన IAS అధికారి ప్రవీణ్ ప్రకాశ్ తనను మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. తొందరపాటులో నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. అయితే ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోరాదని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. YCP హయాంలో కీలక పోస్టుల్లో ప్రవీణ్ చక్రం తిప్పారు. NDA ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయనను పక్కన పెట్టింది. ఆపై ఆయన VRS అప్లై చేయగా ప్రభుత్వం ఆమోదించింది.

News August 21, 2024

కల్కి గురించి ఆ పుకార్లలో నిజం లేదు: నాగ్ అశ్విన్

image

‘కల్కి 2898ఏడీ’ ఆసక్తికరంగా ఎండ్ అవడంతో సీక్వెల్‌పై సినీ ప్రియుల్లో కుతూహలం నెలకొంది. ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ రెండో పార్ట్‌లో తిరిగొస్తారని, సుమతికి పుట్టిన కల్కి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని, యాస్కిన్‌తో విజయ్ దేవరకొండ కూడా పోరాడుతారని వార్తలు నెట్టింట హల్‌చల్ చేశాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ అవి పుకార్లేనని కొట్టిపారేశారు. అసలు కథ కోసం 2వ పార్ట్ రిలీజయ్యే వరకు వెయిట్ చేయక తప్పదని తేల్చిచెప్పారు.

News August 21, 2024

భారత్ బంద్.. బస్సులు తిరుగుతున్నాయా?

image

తెలుగు రాష్ట్రాల్లో భారత్ బంద్ ప్రభావం ప్రస్తుతానికి పాక్షికంగానే ఉండటంతో RTC బస్సులు యథావిధిగానే నడుస్తున్నాయి. APలోని విజయవాడ బస్టాండ్ వద్ద ఆందోళనకారులు నిరసన చేపట్టడంతో గుడివాడ, తెనాలి, అవనిగడ్డ సహా పలు ప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆందోళనల ఉద్ధృతి పెరిగితే దాన్ని బట్టి RTC అధికారులు సమీక్ష చేసే అవకాశం ఉంది.