India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. 2022 ఆర్థిక సంక్షోభం తరువాత తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసే సమయానికి 70% ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘె, విపక్ష నేత సంజిత్ ప్రేమదాస, అనూర దిస్సనాయకే మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. పోలింగ్ పూర్తైన వెంటనే కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సిందే.
తెలంగాణలోని 8 మెడికల్ కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే 3 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. వీటితో పాటు ఏటూరు నాగారం ఫైర్ స్టేషన్కు 34 సిబ్బంది మంజూరు, కోస్గిలో ఇంజినీరింగ్ కాలేజీ, హకీంపేటలో జూనియర్ కాలేజీ మంజూరుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్లలో SLBC టన్నెల్ పనులు పూర్తి చేసేలా రూ.4637 కోట్లు మంజూరు చేసింది.
లెబనాన్లో పేజర్ల పేలుళ్ల ఘటనలో కేరళలో పుట్టిన, నార్వే సిటిజన్ రిన్సన్ జోస్(36) పేరు వినిపించింది. బల్గేరియాకు చెందిన నార్టా గ్లోబల్ కంపెనీకి జోస్ యజమాని. పేజర్లను తైవానీస్ సంస్థ గోల్డ్ అపోలో ట్రేడ్మార్క్తో BAC కన్సల్టింగ్ అనే హంగేరియన్ కంపెనీ తయారు చేసింది. అయితే వాటిని జోస్ సంస్థ ద్వారా కొనుగోలు చేశారనే వార్తలొచ్చాయి. బల్గేరియా జాతీయ భద్రత ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చింది.
TG: రాష్ట్రంలో కొందరు పోలీసుల పనితీరు ‘యథా రాజా తథా పోలీసులు’ అన్నట్లుగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. గత పదేళ్లలో కేసీఆర్, సీనియర్ అధికారులతో కలిసి పోలీసింగ్ విభాగాన్ని దేశంలోనే నం.1గా తీర్చిదిద్దారని ట్వీట్ చేశారు. కొందరి తీరు వల్ల రాష్ట్ర పోలీస్ బ్రాండ్కు అవినీతి మరక పడితే సీనియర్ అధికారుల కష్టం వృథా అవుతుందన్నారు. దీనిపై అధికారులు పునరాలోచించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరారు.
‘తిరుమల లడ్డూ’ వివాదంపై నటుడు మోహన్బాబు ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆ విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. మా వర్సిటీ నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని నాతో పాటు వేలాదిమంది ఉపాధ్యాయులు, స్టూడెంట్స్ నిత్యం భక్తితో నమస్కరిస్తుంటాం. అక్కడ ఇలా జరగడం ఘోరాతి ఘోరం, నికృష్టం, హేయం, అరాచకం. నేరస్థుల్ని శిక్షించాలని నా మిత్రుడు, AP CM చంద్రబాబును హృదయపూర్వకంగా కోరుతున్నా’ అని పేర్కొన్నారు.
ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ యూనిట్ కొత్త పోస్టర్ను పంచుకుంది. పోస్టర్లో ఎన్టీఆర్తో పాటు జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఉన్నారు. రేపు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని నోవాటెల్ HICCలో జరగనుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్కు ముందు రోజు అర్ధరాత్రి నుంచే షోలు పడే ఛాన్స్ ఉంది.
AP: గత వైసీపీ పాలకులు అన్ని వ్యవస్థల్లానే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారని హోం మంత్రి అనిత మండిపడ్డారు. తప్పు చేసినందుకు పశ్చాత్తాప పడకుండా బుకాయిస్తున్నారని దుయ్యబట్టారు. దైవంతో పెట్టుకున్నారు కాబట్టే 11 సీట్లు వచ్చాయని, ఇలాగే కొనసాగితే పులివెందులలోనూ ఓడిపోయే పరిస్థితి తప్పదన్నారు. 100 రోజుల పాలనలో విఫలమయ్యారని గదిలో ఉండి మాట్లాడటం కాకుండా బయటకు వచ్చి మాట్లాడాలని జగన్కు ఆమె సవాల్ విసిరారు.
TG: తిరుమల లడ్డూ కల్తీ వార్తల నేపథ్యంలో టీటీడీకి పాల ఉత్పత్తులు అందించేందుకు సిద్ధమని తెలంగాణ విజయ డెయిరీ పేర్కొంది. దేవస్థానానికి సమర్పించే నైవేద్యాలకు నాణ్యమైన ఉత్పత్తులు సరఫరా చేస్తామని తెలిపింది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావుకు లేఖ ద్వారా తెలియజేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్ వెల్లడించారు.
బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆ దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు(15,205) చేసిన ప్లేయర్గా నిలిచారు. భారత్తో టెస్టులో రెండో ఇన్నింగ్సులో 13 పరుగులతో తమీమ్ ఇక్బాల్(15,192)ను అధిగమించారు. ఆ తర్వాతి స్థానాల్లో షకీబ్(14,696), మహ్మదుల్లా(10,694), లిటన్ దాస్(7,127) ఉన్నారు.
AP: గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో మన రాష్ట్రంతో పాటు దేశానికీ చెడ్డ పేరు వచ్చిందని మంత్రి లోకేశ్ విమర్శించారు. ప్రభుత్వాలు మారినా పాలన మారకూడదని చెప్పారు. YCP పాలనలో పారిశ్రామిక రంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలకు మధ్య సంప్రదింపులకు ఒక ఫోరంను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కొత్త ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
Sorry, no posts matched your criteria.