India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

☞ AP: ఆడబిడ్డల రక్షణ బాధ్యత మాది: సీఎం చంద్రబాబు
☞ AP: జగన్ ఏ పథకాన్నీ ఆపలేదు: కన్నబాబు
☞ AP: త్వరలో టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: లోకేశ్
☞ TG: సంక్రాంతి నుంచి సన్నబియ్యం: తుమ్మల
☞ TG: తెలంగాణ తిరగబడుతుంది: KTR
☞ TG: KTR, హరీశ్ ఒకే పార్టీలో ఉండరు: కాంగ్రెస్
☞ శబరిమల అయ్యప్ప దర్శనం ప్రారంభం
☞ IPL వేలంలో లిస్ట్ అయిన ఆటగాళ్ల జాబితా విడుదల

విదేశీ ఆటగాళ్లకు ఐపీఎల్ యాజమాన్యం బిగ్ షాక్ ఇచ్చింది. జోఫ్రా ఆర్చర్, కామెరూన్ గ్రీన్, జాసన్ రాయ్ వంటి ఆటగాళ్లకు మెగా వేలం షార్ట్ లిస్టులో స్థానం కల్పించలేదు. టోర్నీ మధ్యలోనే వీరు అకారణంగా వెళ్లిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగుచూసింది. వెస్ట్ ఢిల్లీలోని జనక్పురీ, నంగ్లోయ్లో రూ.900 కోట్ల విలువైన 80 KGల కొకైన్ను నార్కోటిక్స్ అధికారులు పట్టుకున్నారు. ఆస్ట్రేలియాకు తరలించడానికి సిద్ధంగా ఉన్న ఈ కన్సైన్మెంట్ను సీజ్ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధ్రువీకరిస్తూ డ్రగ్స్ రాకెట్పై నిర్దాక్షిణ్యంగా వేట సాగిస్తామని పేర్కొన్నారు. అధికారులను అభినందించారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజులపాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు రాజురా, డిగ్రాస్, వార్ధాలో, ఎల్లుండి నాందేడ్, నాయగావ్, భోకర్, సోలాపూర్లో రోడ్ షోల్లో పాల్గొంటారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఓట్లు అభ్యర్థించనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా రేవంత్ను కాంగ్రెస్ అధిష్ఠానం స్టార్ క్యాంపెయినర్గా నియమించిన విషయం తెలిసిందే.

తెలుగు సినీ నటుడు మహేశ్ బాబు సౌరశక్తి ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించనున్నట్లు సమాచారం. ట్రూజన్ సోలార్(సన్టెక్ లిమిటెడ్)తో కలిసి సౌరశక్తి వ్యాపార రంగంలోకి ఆయన ఎంటర్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన భారీగా పెట్టుబడులు పెట్టనున్నారని టాక్ నడుస్తోంది. కాగా మహేశ్ ఇప్పటికే రెయిన్బో హాస్పిటల్స్, ఏఎంబీ సినిమాస్లో ఇన్వెస్ట్ చేశారు. ఇవి కాక పలు బ్రాండ్స్కి ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు.

శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో దేశాధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే నేతృత్వంలోని వామపక్ష కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 225 స్థానాల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ 61.56% ఓట్లతో 159 సీట్లు గెలుచుకుంది. గతంలో ఈ కూటమికి పార్లమెంటులో మూడు సీట్లు ఉండేవి. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దిస్సనాయకే వెంటనే పార్లమెంటు ఎన్నికలకు వెళ్లి తన హవాను కొనసాగించారు.

AP: ఇళ్లు లేని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లలో ఇళ్లు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏడాదిలో లక్ష ఇళ్లలో గృహ ప్రవేశాలు చేసేలా ప్లాన్ చేశామని చెప్పారు. ‘రాత్రికి రాత్రే అన్ని పనులు చేస్తామని మేం చెప్పడం లేదు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో విధ్వంసం జరిగింది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుదలతో కృషి చేస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

TG: కులగణనను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏ ఒక్క ఇల్లును వదలకుండా ప్రతి ఇంట్లో సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు. ‘44.1శాతం సర్వే పూర్తైంది. 5.24 లక్షల ఇళ్లలో సర్వే పూర్తైంది. సర్వేకు ఆటంకం కలిగించే వారిని ఉపేక్షించవద్దు. సర్వే జరుగుతున్న తీరును రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి’ అని సీఎం సూచించారు.

అక్టోబర్ చివర్లో ఇజ్రాయెల్ జరిపిన ప్రతీకార దాడుల్లో ఇరాన్కు గట్టి దెబ్బే తగిలినట్లు తెలుస్తోంది. ఇరాన్లోని పార్చిన్ మిలిటరీ కాంప్లెక్స్లో ఉన్న అణ్వాయుధ పరిశోధన కేంద్రం ఈ దాడుల్లో పూర్తిగా ధ్వంసమైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇది ఇరాన్కు పెద్ద దెబ్బ అని చెబుతున్నాయి. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చినందుకు ఇజ్రాయెల్పై ఇరాన్ గతంలో దాడి చేయడం తెలిసిందే.

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. ఎన్యూమరేటర్లు ఇవాళ హైదరాబాద్లోని ఆమె నివాసానికి వెళ్లారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్ సిబ్బందికి తమ పూర్తి వివరాలు ఇచ్చారు. కొన్ని వివరాలను కవితనే స్వయంగా నమోదు చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై బెయిల్పై బయటికొచ్చిన కవిత చాలారోజుల తర్వాత బయటి ప్రపంచానికి కనిపించారు.
Sorry, no posts matched your criteria.