News August 15, 2024

విక్రమ్ ‘తంగలాన్’ పబ్లిక్ టాక్

image

పా.రంజిత్ డైరెక్షన్‌లో విక్రమ్ హీరోగా తెరకెక్కిన తంగలాన్ మూవీకి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. చియాన్ యాక్టింగ్, మేకప్, గ్రాండ్ విజువల్స్, BGM అదిరిపోయాయని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. మధ్యలో కొంచెం స్లోగా అనిపించినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని పేర్కొంటున్నారు. డైరెక్టర్, హీరోకు కమ్ బ్యాక్ లాంటి చిత్రమని చెబుతున్నారు.
కాసేపట్లో WAY2NEWS రివ్యూ..

News August 15, 2024

ఆ ప్రాంతంలో నిన్న రాత్రే జెండా ఎగురవేశారు!

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నేడు ఉదయం మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. కానీ బిహార్‌లోని పూర్నియాలో మాత్రం నిన్న రాత్రే ఈ కార్యక్రమం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిందని తెలియగానే 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి సమయంలో పూర్నియాలో రామేశ్వరప్రసాద్ సింగ్ అనే వ్యక్తి అక్కడి జెండా చౌక్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేశారు. అప్పటి నుంచీ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు.

News August 15, 2024

ఆస్పత్రులను తనిఖీ చేయండి.. కలెక్టర్లకు సీఎస్ ఆదేశం

image

TG: సీజనల్ వ్యాధులు, డెంగీ జ్వరాల వ్యాప్తిని అరికట్టడంపై కలెక్టర్లు, ఉన్నతాధికారులు దృష్టిసారించాలని CS శాంతి కుమారి ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో తనిఖీలు చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం, మందులు నిర్ణీత ధరలకే అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న విషయం తెలిసిందే.

News August 15, 2024

నేడు ‘అన్న క్యాంటీన్లు’ ప్రారంభం

image

ఏపీలో అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. గుడివాడలో నేడు CM చంద్రబాబు తొలి క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. మిగతా 99 క్యాంటీన్లను రేపు మంత్రులు, MLAలు, MPలు ఓపెన్ చేస్తారు. వీటి ద్వారా రోజుకు సుమారు 1.05 లక్షల మందికి ఆహారం అందిస్తారు. ఈ క్యాంటీన్లలో రూ.5కే భోజనం అందిస్తారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తారు. ఉ.7.30 గంటల నుంచి రాత్రి 9 వరకు తెరిచే ఉంటాయి.

News August 15, 2024

గుడ్‌న్యూస్.. ఇవాళ అకౌంట్లలో డబ్బులు జమ

image

TG: రాష్ట్రంలోని రైతులకు నేడు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల రుణమాఫీ కానుంది. ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి రైతులకు రుణమాఫీ చెక్కులను అందజేస్తారు. అనంతరం అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. తొలి విడతగా రూ.లక్ష, రెండో విడతగా రూ.లక్షన్నర వరకు ఇప్పటికే రైతు రుణమాఫీ జరిగింది. ఇవాళ మూడో విడతగా రూ.2 లక్షల వరకు అప్పుగా తీసుకున్న రైతులను రుణ విముక్తులను చేయనున్నారు.

News August 15, 2024

హజ్ యాత్రకు దరఖాస్తుల ఆహ్వానం

image

AP: రాష్ట్రంలోని ముస్లింలు హజ్ యాత్ర 2025కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ కోరారు. యాత్రకు ఎలాంటి వయోపరిమితి లేదని తెలిపారు. ఎంపికైన వారు మెడికల్ స్క్రీనింగ్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ సమర్పించాలని పేర్కొన్నారు. వచ్చే నెల 9లోపు www.hajcommittee.gov.in లేదా www.apstatehajcommittee.comలో అప్లై చేసుకోవాలని సూచించారు. సహాయం కోసం 1800-4257873కు కాల్ చేయొచ్చని పేర్కొన్నారు.

News August 15, 2024

ఆలయంలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా?

image

గుడికి వెళ్లినప్పుడో, ఇంట్లో పూజ చేసినప్పుడో గంట మోగిస్తారు. రాక్షస శక్తులు పోయి దైవ శక్తులు రావాలనే ఉద్దేశంతోనే గంట వాయిస్తారు. ఆలయంలో నందిని ముట్టుకోవడంలోనూ ఓ రహస్యం ఉంది. నంది వేద ధర్మ స్వరూపం కాబట్టి ముట్టుకుంటారు. నంది కొమ్ముల మధ్య నుంచి చూడటమంటే మనలోని పశుత్వాన్ని పోగొట్టుకుని దేవుడిని దర్శిస్తున్నామని అర్థం. గుడికి రానివారికి పరమేశ్వరుడు ఉన్నాడని గుర్తుచేసేందుకే విగ్రహాలను ఊరేగిస్తారు.

News August 15, 2024

‘డబుల్ ఇస్మార్ట్’ పబ్లిక్ టాక్

image

పూరీ జగన్నాథ్-రామ్ కాంబోలో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. మూవీలో హీరో ఎనర్జీ, డాన్స్, సంజయ్ దత్ విలనిజం అదిరిపోయిందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ పాత్రలో రామ్ ఒదిగిపోయారంటున్నారు. అయితే అలీ కామెడీ ట్రాక్ కాస్త పట్టాలు తప్పిందని కామెంట్స్ చేస్తున్నారు. పూరీ టేకింగ్ బాగుందంటున్నారు.
కాసేపట్లో WAY2NEWS రివ్యూ..

News August 15, 2024

రాయల్టీపై రాష్ట్రాలకే అధికారం: సుప్రీంకోర్టు కీలక తీర్పు

image

2005 ఏప్రిల్ 1 నుంచి గనులు, ఖనిజ భూములపై కేంద్రం వసూలు చేసిన రాయల్టీ, పన్నులను తిరిగి రాష్ట్రాలకు చెల్లించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. 12ఏళ్ల వ్యవధిలో దశలవారీగా చెల్లించాలని పేర్కొంది. గనుల భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలకే ఉండాలని CJI జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో 35 ఏళ్లుగా కేంద్ర-రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న సమస్యకు ముగింపు పలికినట్లయింది.

News August 15, 2024

6G సేవలు ఎప్పటి నుంచంటే?

image

2030 నాటికి 6G సేవలు ప్రారంభించడానికి భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఇతర దేశాల కన్నా ముందుగా 6జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ఐఐటీ మద్రాస్ సహాయం తీసుకోనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తుండటంతో 6జీని కూడా అంతే వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. కాగా 5జీ కంటే 6జీ దాదాపు 100 రెట్లు వేగంగా నెట్‌వర్క్ కనెక్టివిటీ అందిస్తుంది.