India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రేప్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ 2022 జూన్ నుంచి ఇప్పటిదాకా 232 రోజులు పెరోల్ మీద ఉండడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. 2022లో 70 రోజులు, 2023లో 91 రోజులు, ఈ ఏడాది 71 రోజులు కలుపుకొని మొత్తంగా 232 రోజులు పెరోల్పై ఉన్నాడు. ఇది హరియాణా ప్రభుత్వ నిర్ణయం అని, దీనికీ న్యాయవ్యవస్థకు సంబంధం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ మధ్య ఏజ్ గ్యాప్పై భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో దర్శకుడు హరీశ్ శంకర్ ఘాటుగా స్పందించారు. ‘మన ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు వయస్సు, మిగతావి అన్నీ చూసుకోవాలి. ఇది సినిమా. హీరోకు స్క్రీన్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది. సినిమాకు ఒప్పుకునే అమ్మాయి(హీరోయిన్)కే సమస్య లేనప్పుడు, మీకేంటి ప్రాబ్లం?’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
‘హర్ ఘర్ తిరంగా-3’లో భాగంగా పౌరులు తమ ఇళ్లపై మువ్వన్నెల జెండాను ఎగరవేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, పౌరులకు ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేసేందుకు కేంద్రం కాలర్ ట్యూన్ను ఏర్పాటు చేసింది. దీంతో ఎవరికైనా కాల్ చేసినప్పుడు ‘హర్ ఘర్ తిరంగా’ గురించి మోదీ వాయిస్ వినిపిస్తోంది. కొంతమందికి రావట్లేదు. మీకూ ఇలా కాలర్ ట్యూన్ వస్తోందా? కామెంట్ చేయండి.
8,326 మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీపై స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇతర వివరాల కోసం ఎప్పటికప్పుడు SSC వెబ్సైటును చూడాలని కోరింది. కాగా గత నెల 31తో ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ ముగిసిన సంగతి తెలిసిందే.
AP: ఈ నెల 16 నుంచి నిర్వహించాల్సిన రెవెన్యూ సదస్సులను సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వీటిని నిర్వహిస్తామని వెల్లడించారు. పాత అధికారులతోనే నిర్వహిస్తే సరైన ఫలితాలు రావన్నారు. ఇందులో భూ వివాదాలు, రీసర్వేలో జరిగిన తప్పిదాలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, 45 రోజుల్లో తగు చర్యలు తీసుకుంటామని వివరించారు.
తెలంగాణ వ్యాప్తంగా రేపు ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కోల్కతాలో జూ.డాక్టర్ <<13831962>>హత్యాచార <<>>ఘటనను నిరసిస్తూ ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు అందించారు. దీంతో ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.
భారత్ – బంగ్లా సరిహద్దుల్లో అక్రమ వలసలను నివారించడానికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్థానిక ప్రజల సహకారం తీసుకుంటోంది. బంగ్లా సంక్షోభం తరువాత అక్కడి నుంచి వలసలు ఎక్కువ కావడంతో BSF ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామ సమన్వయ సమావేశం పేరుతో స్థానికులతో సమావేశమై వలసల నివారణకు అందించాల్సిన సహకారం గురించి అధికారులు వారికి వివరించి చెబుతున్నారు.
AP: ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. 16 నుంచి ఇవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. MLC ఎన్నికల నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది. మిగతా జిల్లాల్లో 33 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రారంభించే ఈ క్యాంటీన్ల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. మీ జిల్లాలో క్యాంటీన్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు ఇక్కడ <
TG: రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అధికంగా వస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. స్కూళ్లలో వాటర్ ట్యాంకులు శుభ్రం చేయాలని, తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వేడుకల్లో జెండా ఎగురవేయడానికి హోం మంత్రి కైలాశ్ గహ్లోత్కు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అవకాశం ఇచ్చారు. మంత్రి ఆతిశీ జెండా ఎగురవేస్తారని సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన అదేశాలకు జీఏడీ అడ్డుచెప్పడంతో ఈ విషయంలో గందరగోళం నెలకొంది. తాజాగా హోం మంత్రిని నామినేట్ చేస్తూ ఎల్జీ ఆదేశాలిచ్చారు.
Sorry, no posts matched your criteria.