News June 20, 2024

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి బుల్లెట్ ప్రూఫ్ కారు

image

AP: టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి ఆ పార్టీ బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా అన్ని జిల్లాల్లో పర్యటించాల్సి ఉన్నందున సీఎం చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ కారుని ఆయనకు కేటాయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ(95,235)తో నెగ్గారు.

News June 20, 2024

కీచక ఎస్సై.. మొదటి నుంచి లైంగిక ఆరోపణలు

image

TG: మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం కేసులో డిస్మిస్ అయిన కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్ వ్యవహారశైలి మొదటి నుంచే వివాదాస్పదంగా ఉంది. 2022లో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్సైగా ఉన్నప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న యువతిని లైంగికంగా వేధించాడు. ఎత్తు, కొలతలు చూస్తానంటూ ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లపైనా అత్యాచారం చేసినట్లు అతడిపై ఆరోపణలున్నాయి.

News June 20, 2024

DSC.. నేడే చివరి తేదీ

image

TG: టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి DSC దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి FEBలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఏప్రిల్ 3 నాటికే గడువు ముగియాల్సి ఉండగా మార్చిలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో అప్లికేషన్ల గడువును జూన్ 20 వరకు పొడిగించింది. నిన్న సా. వరకు 2.64 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జులై 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. tsdsc.aptonline.in/tsdsc/

News June 20, 2024

అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నలు

image

పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించిన డిప్యూటీ CM పవన్ పలు ప్రశ్నలను సంధించారు. ‘ఉపాధి హామీ కూలీల వేతనాల చెల్లింపుల్లో ఆలస్యానికి కారణం ఎవరు? పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాల ఏర్పాటు అవసరం ఎందుకొచ్చింది? సర్పంచులకు వాటిపై నియంత్రణ లేకపోతే ఎలా? ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు నేరుగా ఎందుకు ఇవ్వట్లేదు?’ అని ప్రశ్నించారు. వీటికి అధికారులు సరిగా సమాధానం చెప్పలేకపోయినట్లు సమాచారం.

News June 20, 2024

మహిళా క్రికెట్‌లో ఇదే తొలిసారి

image

దక్షిణాఫ్రికా, భారత్ మహిళా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో అరుదైన రికార్డు నమోదైంది. ఈ మ్యాచులో స్మృతి మంధాన(136), హర్మన్‌ప్రీత్ కౌర్(103), లారా(135), కాప్(114) సెంచరీలు నమోదు చేశారు. మహిళా వన్డే క్రికెట్ చరిత్రలో నలుగురు బ్యాటర్లు ఒకే మ్యాచులో సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. కాగా ఈ మ్యాచులో SAపై టీమ్ ఇండియా 4 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

News June 20, 2024

గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలని విజ్ఞప్తి

image

AP: పోలీసు ఉద్యోగాల భర్తీకి మెగా పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ JAC రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు CM చంద్రబాబుని కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రూప్-2 మెయిన్స్ 2నెలలు వాయిదా వేయాలని కోరారు. ఎన్నికల దృష్ట్యా అభ్యర్థులు ప్రిపరేషన్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సిలబస్ ఎక్కువగా ఉందని వివరించారు. డిప్యూటీ DEO మెయిన్స్‌కు 1:100 విధానంలో అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు.

News June 20, 2024

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేనట్లే: కిషన్ రెడ్డి

image

AP: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఫైల్ పెండింగ్‌లో ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పట్లో ప్రైవేటీకరణ జరగదన్నారు. ప్రజలు, కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్‌ను కొనుగోలు చేసేంత పెద్ద సంస్థలు ప్రస్తుతం కనిపించడం లేదన్నారు. సంస్థకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. గనుల వేలంలో పాల్గొని విశాఖ స్టీల్ కూడా క్యాప్టివ్ మైన్స్ సొంతం చేసుకోవచ్చని తెలిపారు.

News June 20, 2024

10,083 మంది టీచర్లకు ప్రమోషన్

image

TG: మల్టీ జోన్-1(వరంగల్)లోని 19 జిల్లాల్లో మొత్తం 10,083 మంది ఉపాధ్యాయులు ప్రమోషన్లు పొందారు. వీరిలో 4,910 మంది భాషా పండిట్లు, 4,207 మంది ఎస్జీటీలు, 966 మంది PETలున్నారు. భాషా పండిట్లు స్కూల్ అసిస్టెంట్(లాంగ్వేజ్)గా, PETలు స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్ ఎడ్యుకేషన్)గా మారారు. SGTలు ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లుగా, స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ అయ్యారు. నిన్ననే వారికి కేటాయించిన స్కూళ్లలో జాయిన్ అయ్యారు.

News June 20, 2024

గంభీర్‌ రాక ఆటగాళ్లకు హెచ్చరికే: ఆకాశ్ చోప్రా

image

టీమ్ఇండియా కోచ్‌గా గంభీర్ ఎంపిక దాదాపు ఖాయమైనట్లేనని, సీనియర్ ప్లేయర్లకు అతడి రాక హెచ్చరికవంటిదని మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అన్నారు. ‘కోచ్‌గా కన్ఫామ్ అయితే 2027 వన్డే ప్రపంచకప్ వరకూ గంభీర్ కొనసాగొచ్చు. రోహిత్, విరాట్, షమీ, జడ్డూ వంటి స్టార్ ఆటగాళ్ల వయసు అప్పటికి 40కి దగ్గర్లోకి చేరుతుంది. ఈ నేపథ్యంలో గౌతీ కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన పదవీకాలం చాలా ఆసక్తిగా ఉండనుంది’ అని పేర్కొన్నారు.

News June 20, 2024

‘నాడు-నేడు’ పథకం పేరు మార్పు

image

AP: ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘నాడు-నేడు’ పథకం పేరును చంద్రబాబు ప్రభుత్వం మార్చింది. ఇక నుంచి స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్‌మెంట్ (SII) పేరుతో ఆ స్కీమ్‌ను అమలు చేయనుంది. అన్ని పాఠశాలల్లో ఏడాదిలోపు మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు.