India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: కేసుల నుంచి బయటపడేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందనేది పెద్ద జోక్ అని చెప్పారు. ‘CM రేవంత్కు సృజన్ రెడ్డి తోకచుట్టం. కవిత, సృజన్ రెడ్డిలు వ్యాపార భాగస్వాములు. పాలమూరు టన్నెల్ పనులను వారిద్దరే చేశారు. దీనికి KTR సమాధానమివ్వాలి. అధికారులపై దాడులు, అమృత్ టెండర్లలో అవినీతి అని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’ అని మంత్రి తెలిపారు.

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్(CHSL) టైర్-2 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను SSC విడుదల చేసింది. అభ్యర్థులు <

TG: మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు డబ్బు తరలి వెళ్తోందని ఆరోపించారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఈసీ సెక్యూరిటీ పెంచాలని కోరారు. రేవంత్ తన బావమరిదికి అమృతం ఇచ్చి, కొడంగల్ ఫార్మాతో ప్రజలకు విషం ఇస్తున్నారని మండిపడ్డారు. అమృత్ పథకంలో భారీ అవినీతి జరిగిందని, ప్రభుత్వ తప్పులను తరచూ ఢిల్లీకి వచ్చి ఎండగడతామన్నారు.

గోవాను సిలికాన్ వ్యాలీలా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ‘విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా కనిపించే గోవా చాలా ఆకర్షణీయమైన ప్రాంతం. ఇప్పటికే అక్కడ ఉన్న 23 పారిశ్రామిక ప్రాంతాలకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి’ అని గుర్తుచేశారు. సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్స్ పరిశ్రమలకు గోవాను కేంద్రంగా చేయాలనేది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది.

తన కుమారుడు జట్టు కోసమే తప్ప వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచించడని భారత క్రికెటర్ సంజూ శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘సంజూ వరస సెంచరీలు చేయడం సంతోషంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగాలి. ఇన్నేళ్లూ తనకు సరైన అవకాశాలు దక్కలేదు. ఇకపై వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ఆడాలి. కొంతమంది స్వార్థం కోసం, జట్టులో చోటు కోసం ఆడతారు. సంజూ ఎప్పుడూ అలా ఆడడు’ అని స్పష్టం చేశారు.

మలయాళంలో సూపర్హిట్గా నిలిచిన థ్రిల్లర్ మూవీ ‘కిష్కింధ కాండం’ ఓటీటీలోకి రానుంది. ఈ నెల 19 నుంచి డిస్నీ+హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రంలో అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించారు. కేవలం రూ.7 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసింది.

జిల్లా అధికార యంత్రాంగానికి బాస్ కలెక్టర్. ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను అమలు చేసేది ఆయనే. నిన్న వికారాబాద్ జిల్లాలో భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ బ్యూరోక్రాట్లపై దాడి చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే అధికారులు ఫీల్డులో ధైర్యంగా పని చేయలేరని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?

శత్రుదేశాలు యుద్ధానికి వస్తే ఒకరికొకరు సహాయంగా నిలబడేలా రష్యా, ఉత్తర కొరియా ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఏడాది జూన్లో ఈ ఒప్పందం జరిగినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. రెండు దేశాల మధ్య సహకారం ఇటీవల బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్యాంగ్యాంగ్కు రష్యా ఆయుధ సాంకేతికత సరఫరా చేస్తుండగా అటు కిమ్ జాంగ్ వేలాదిమంది సైనికుల్ని ఉక్రెయిన్తో యుద్ధం కోసం రష్యాకు సరఫరా చేస్తున్నారు.

మనిషి ఒంట్లోని సూక్ష్మ క్రిముల ఆధారంగా అతడి చివరి లొకేషన్ను గుర్తించే మైక్రోబయోమ్ జియోగ్రఫిక్ పాపులేషన్ స్ట్రక్చర్(mGPS) అనే AI సాంకేతికతను స్వీడన్ పరిశోధకులు రూపొందించారు. ఓ వ్యక్తి ప్రయాణించిన ప్రాంతంలో అతడి శరీరం తాలూకు సూక్ష్మక్రిములు ఉంటాయని, తమ సాంకేతికత ఆ క్రిముల ద్వారా అతడి లోకేషన్ని గుర్తిస్తుందని వారు వివరించారు. దీని ద్వారా రోగాల వ్యాప్తిని గుర్తించడం సులువవుతుందని తెలిపారు.

మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటోలే సరికొత్త వివాదానికి తెరలేపారు. OBC కమ్యూనిటీతో BJP తీరును విమర్శిస్తూ ఆ పార్టీ నేతలను కుక్కలుగా మార్చాలన్నారు. ‘అకోలా జిల్లా ఓబీసీలను నేనొకటే అడుగుతున్నా. మిమ్మల్ని కుక్కలని పిలుస్తున్న బీజేపీకి ఓటేస్తారా? ఇప్పుడు బీజేపీని కుక్కలా మార్చే టైమొచ్చింది. వాళ్లకు అహంకారం తలకెక్కింది’ అని అకోలా సభలో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై అధికార మహాయుతి కూటమి భగ్గుమంది.
Sorry, no posts matched your criteria.