India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హెల్త్ ఇన్సూరెన్స్పై బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(IRDAI) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలుకు 65 ఏళ్లుగా ఉన్న గరిష్ఠ వయోపరిమితి తొలగించింది. ఇకపై వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా బీమా తీసుకోవచ్చని, ఇది ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు IRDAI తెలిపింది. ముందస్తు వ్యాధుల వెయిటింగ్ పీరియడ్ను నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు, మారటోరియాన్ని 8 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు తగ్గించింది.

AP: మహిళా సాధికారత కోసమే సూపర్-6 పథకాలు తీసుకువస్తున్నట్లు నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘మహిళల అభివృద్ధి కోసం చంద్రబాబు, లోకేశ్ నిరంతరం తపిస్తుంటారు. వయసు పెరుగుతున్నా చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. లోకేశ్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు’ అని ఆమె పేర్కొన్నారు.

TG: వికసిత్ భారత్ తరహాలోనే వికసిత్ తెలంగాణ పత్రాన్ని త్వరలో విడుదల చేస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్కు అహంకారం తగ్గలేదని విమర్శించారు. కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, BRSకు భవిష్యత్తు లేదన్నారు. సీఎం రేవంత్ పాలన ఓటమికి దారులు వెతుక్కుంటున్నట్లు ఉందన్నారు.

AP: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన ఆస్తుల విలువ రూ.182.82 కోట్లుగా ప్రకటించారు. అందులో చరాస్తులు రూ.123.26 కోట్లు, స్థిరాస్తులు రూ.9.29 కోట్లుగా ఉన్నాయి. షర్మిల వద్ద రూ.3.69 కోట్ల విలువైన బంగారు, రూ.4.61 కోట్ల విలువైన జెమ్ స్టోన్స్ ఆభరణాలు ఉన్నాయి. ఇక అన్న జగన్ వద్ద రూ.82.58 కోట్లు, వదిన వైఎస్ భారతిరెడ్డి వద్ద రూ.19.56 లక్షలు అప్పు తీసుకున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. షర్మిలపై 8 కేసులు ఉన్నాయి.

ఈ ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు రెచ్చిపోయి ఆడుతోంది. ఆ టీమ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. 11ఏళ్ల పాటు నిలిచిన ఐపీఎల్ అత్యధిక స్కోరు (263) రికార్డును ముంబైతో మ్యాచ్లో 277 రన్స్తో SRH చెరిపివేసింది. ఆర్సీబీతో మ్యాచ్లో తన రికార్డును తానే బద్దలు కొడుతూ 287 రన్స్ చేసింది. ఇక ఆ టీమ్ తర్వాతి టార్గెట్ 300 రన్స్ కాగా ఇవాళ్టి మ్యాచ్లో ఆ ఘనత సాధిస్తారేమో చూడాలి.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20మంది తనతో టచ్లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ‘కేసీఆర్ చెప్పింది అబద్ధం. వాళ్ల ముగ్గురు ఎంపీ అభ్యర్థులు మధ్యలో డ్రాప్ అవుతారు. అందుకే ఆయన అబద్ధాలు మాట్లాడుతున్నారు. 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్తో టచ్లో ఉన్నారు. ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఖాళీ అవుతుంది. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం’ అని ఆయన హెచ్చరించారు.

CSK ఆటగాడు ధోనీ ఆఖరి ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్కు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వివరణ ఇచ్చారు. ‘గత ఏడాది ధోనీ మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. దానికి సంబంధించిన నొప్పి నుంచి ఇంకా కోలుకోలేదు. తనను చూసేందుకే స్టేడియానికి వచ్చే ఫ్యాన్స్ను నిరాశపరచకూడదనే చివర్లోనైనా బ్యాటింగ్కి వస్తున్నారు. ప్రేక్షకుల నుంచి ఆయనకు లభించే ప్రేమ అద్భుతం’ అని వ్యాఖ్యానించారు.

AP: విద్యాదీవెన, వసతిదీవెన అందడంలేదని CM జగన్కు చెప్పిన విద్యార్థులను ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ సస్పెండ్ చేయడంపై TDP నేత లోకేశ్ స్పందించారు. ‘నిజం చెప్పడం కూడా నేరమా? వైసీపీ నేతలు కాలేజీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి ఆ విద్యార్థులను సస్పెండ్ చేయించడం దారుణం. జగన్కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు విడుదల చేయాలి. స్టూడెంట్స్పై సస్పెన్షన్ ఎత్తివేయాలి’ అని డిమాండ్ చేశారు.

వాట్సాప్లో పీపుల్ నియర్ బై, క్విక్ స్టేటస్ రియాక్షన్ అనే రెండు ఫీచర్లు రాబోతున్నాయి. పీపుల్ నియర్ బై ఫీచర్ ద్వారా మీకు దగ్గర్లో ఉన్న వారితో ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. దీనికోసం సెట్టింగ్స్లో ‘పీపుల్ నియర్ బై’ పై క్లిక్ చేసి కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక క్విక్ స్టేటస్ రియాక్షన్ ఫీచర్ ద్వారా స్టేటస్ చూసిన దగ్గరే ఎమోజీలతో రియాక్ట్ అవ్వొచ్చు. ఆ రియాక్షన్స్ చాట్లో కాకుండా స్టేటస్ దగ్గరే కనిపిస్తాయి.

AP: జగన్ను చిన్న రాయితో కొడితేనే హత్యాయత్నం అంటున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. విజయమ్మను అవమానించే స్థాయికి కొందరు దిగజారిపోయారని దుయ్యబట్టారు. తాను న్యాయం, ధర్మం కోసం పోటీ చేస్తున్నానని.. హత్యారాజకీయాలు అంతం కావాలన్నారు. ప్రజలు న్యాయం వైపు ఉన్నారా లేదా అనేది ఆలోచించుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.