News April 20, 2024

ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు

image

పాకిస్థాన్‌లో అరుదైన సంఘటన జరిగింది. రావల్పిండికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. నవజాత శిశువుల్లో నలుగురు మగ, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

News April 20, 2024

22 బ్యాంకులను ఫూల్ చేశారు

image

బెంగళూరులో ఆరుగురు వ్యక్తులు 22 బ్యాంకులను బురిడీ కొట్టించారు. ఫేక్ డాక్యుమెంట్స్‌తో రూ.10 కోట్లకు పైగా రుణాలు తీసుకుని బ్యాంకులను ఫూల్ చేశారు. బేగూర్ గ్రామంలోని ఓ బిల్డింగ్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌తో తొలుత కొంత మొత్తం లోన్ తీసుకున్నారు. తర్వాత సర్వే నంబర్, సైట్ నంబర్‌లు మార్చి ఆ డాక్యుమెంట్స్‌తో బ్యాంకులను ఏమార్చారు. చివరికి వారి మోసం వెలుగుచూడటంతో జయనగర్ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.

News April 20, 2024

ఓటింగ్ శాతం పెరిగేనా?

image

లోక్‌సభ తొలి దశ ఎన్నికల్లో 62.37 శాతం పోలింగ్ నమోదైంది. చివరి 12 దఫాల ఎన్నికల‌ను పరిశీలిస్తే పోలింగ్ శాతం 60 నుంచి 70శాతం మధ్యనే ఉంటోంది. వీటిలో 1991లో అత్యల్పంగా 55.9శాతం నమోదు కాగా, 2019లో అత్యధికంగా 67.4శాతం నమోదయ్యింది. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమైన రాష్ట్రాల్లో పోలింగ్ ఇంకా జరగాల్సి ఉండగా.. కొత్త రికార్డులు నమోదవుతాయేమో వేచి చూడాలి.
<<-se>>#Elections2024<<>>

News April 20, 2024

సొంత కారు లేని అమిత్ షా

image

తనకు రూ.36 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇందులో రూ.20 కోట్లు చరాస్తులు కాగా రూ.16 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య సోనాల్ షా పేరిట రూ.31 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా ఆమె వద్ద రూ.1.10 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నాయి. అమిత్ షా వార్షిక ఆదాయం రూ.75.09 లక్షలు కాగా రూ.15.77 లక్షల అప్పు ఉంది. ఆయనకు సొంత కారు లేదు. షాపై 3 క్రిమినల్ కేసులున్నాయి.

News April 20, 2024

సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం: వీహెచ్

image

TG: సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తన నివాసంలో మౌన దీక్షకు దిగారు. తమ్ముడిగా భావించిన భట్టి తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. గతంలో రేవంత్ సీఎం అవుతారని మాట్లాడినందుకే తనపై కక్ష కట్టారన్నారు. తనకు టికెట్ రాకుండా ఉండేందుకు బయటి వారిని తీసుకొస్తున్నారని.. దీనిపై సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు.

News April 20, 2024

మస్క్ భారత పర్యటన వాయిదా

image

టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా X వేదికగా తెలియజేశారు. టెస్లాకు సంబంధించిన ముఖ్యమైన పనులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాదిలోనే భారత్‌లో పర్యటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మస్క్ ఆసక్తి కనబరుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పర్యటనపై సందిగ్ధత నెలకొంది.

News April 20, 2024

ప్రసాదాలు తింటే పిల్లలు పుడతారా?

image

చిలుకూరు బాలాజీ ఆలయంలో పంచే గరుడ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందని నమ్మి నిన్న 2లక్షల భక్తులు తరలి వచ్చారు. ప్రసాదం దొరక్క చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ప్రసాదం తింటే పిల్లలు పుడతారని నమ్ముతున్నారంటే ఆ తప్పు ప్రజలది కాదని, వాళ్లను అలా ఉంచిన పరిస్థితులదని జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోయ వెంకటేశ్వరరావు అన్నారు. దీనిని దేశంలో విజ్ఞాన శాస్త్ర దారిద్య్రంగా అభివర్ణించారు.

News April 20, 2024

USలో టిక్‌టాక్ బ్యాన్ చేయవద్దు: మస్క్

image

USలో టిక్‌టాక్‌పై నిషేధానికి ఆ దేశ పార్లమెంటులో శనివారం ఓటింగ్ జరగనుంది. ఈ నిర్ణయాన్ని ట్విటర్ అధినేత మస్క్ తప్పుబట్టారు. టిక్‌టాక్‌ను నిషేధించడం వల్ల ట్విటర్‌కి ప్రయోజనం ఉన్నప్పటికీ అది సరికాదని పేర్కొన్నారు. ఇలా చేయడం వాక్‌స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం తమ పౌరుల సమాచారాన్ని టిక్‌టాక్ ద్వారా చోరీ చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.

News April 20, 2024

నా భార్యకు టాయిలెట్‌ క్లీనర్‌ కలిపిన ఆహారం ఇస్తున్నారు: ఇమ్రాన్

image

తన భార్య బుష్రా బీబీకి టాయిలెట్ క్లీనర్‌ కలిపిన ఆహారాన్ని ఇస్తున్నారని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ప్రస్తుతం ఆయన రావల్పిండిలోని జైల్లో ఉండగా, బీబీ గృహనిర్బంధంలో ఉన్నారు. ‘విషపూరిత ఆహారం కారణంగా బీబీ పొట్టలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. తనకు ఏమైనా అయితే నేను బతికున్నంతకాలం జనరల్ అసీం మునీర్‌ను వదిలిపెట్టేది లేదు’ అని ఇమ్రాన్ పేర్కొన్నట్లు ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్ తెలిపింది.

News April 20, 2024

రోజా ఆస్తులు ఎంతో తెలుసా?

image

AP: నగరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే.రోజా ఆస్తులు ఐదేళ్లలో 47% పెరిగాయి. ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. 2019లో రూ.9.3 కోట్ల ఆస్తులు ఉండగా, ఇప్పుడు రూ.13.7 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఇందులో చరాస్తులు రూ.5.9 కోట్లు, స్థిరాస్తులు రూ.7.8 కోట్లని తెలిపారు. రూ.కోటి విలువైన బెంజ్‌తో పాటు 9 కార్లు ఉన్నాయని వెల్లడించారు. తాను ఇంటర్ వరకు చదివానని చెప్పారు.