News April 2, 2024

స్వల్పంగా పెరిగిన పత్తి విత్తన ధరలు

image

TG: కేంద్రం మరోసారి పత్తి విత్తనాల ధరలు పెంచింది. దీంతో గతేడాది 475గ్రాముల ప్యాకెట్ ధర రూ.853 ఉండగా.. ఇప్పుడు రూ.864కి చేరింది. కంపెనీల డిమాండ్లకు అనుగుణంగా కేంద్రం ఏటా ధరలు పెంచుతోంది. 2020-21లో ప్యాకెట్ ధర రూ.730 ఉండేది. ఇప్పుడు రూ.864కు చేరింది. ఇక తెలంగాణలో వరి తర్వాత అత్యధికంగా సాగవుతున్న పంట పత్తి. ఇప్పటికే వర్షాభావంతో అల్లాడుతున్న అన్నదాతలకు ఈ ధరల పెరుగుదల మరికొంత భారం కానుంది.

News April 2, 2024

ట్విటర్ ట్రెండింగ్‌లో ‘వడాపావ్’

image

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం పొందింది. సొంత గడ్డపై ముంబై ప్లేయర్లు డకౌట్ అవడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఎక్కువ సార్లు జీరో డిజిట్‌కే వెనుదిరగడంతో ‘వడాపావ్’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. వరుసగా ఓడిపోతున్నప్పటికీ ప్లేయర్లు గెలవాలన్న కసితో ఆడట్లేదని విమర్శిస్తున్నారు. దీంతో ‘వడాపావ్’ హాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండవుతోంది.

News April 2, 2024

వైఎస్ జగన్ యాత్ర నేటి షెడ్యూల్

image

ఏపీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్ర 6వ రోజుకు చేరింది. ఈరోజు ఉదయం 9 గంటలకు చీకటిమానిపల్లె నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. గొల్లపల్లి మీదుగా జగన్ అంగళ్లు గ్రామం చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30గంటలకు మదనపల్లెలో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం నిమ్మనపల్లి, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లెకు చేరుకుంటారు. రాత్రికి అమ్మగారిపల్లె శివారులో బస చేయనున్నారు.

News April 2, 2024

వాళ్లు అసలు మనుషులే కాదు: వాట్సన్

image

ఐపీఎల్‌లో అదరగొడుతున్న రిషభ్ పంత్ ప్రయాణం స్ఫూర్తిదాయకమన్నారు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్. పంత్‌ నుంచి కూడా ప్రేరణ పొందనివారు అసలు మనుషులే కాదని అభిప్రాయపడ్డారు. ‘ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన రిషభ్ తిరిగి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం నమ్మశక్యంగా లేదు. దారిలో పడేందుకు కొంచెం సమయం తీసుకున్నారు కానీ సెట్ అయ్యాక తనదైన స్టైల్‌లో అద్భుతమైన షాట్లు ఆడారు’ అని వాట్సన్ పేర్కొన్నారు.

News April 2, 2024

వామ్మో.. ఇక బంగారం కొనలేమా?

image

బంగారం ధర అనూహ్యంగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం సోమవారం రూ.71,300కు చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ రూ.64 వేలకు పైగా పలికింది. మరోవైపు వెండి ధర ఎంత పెరుగుతుందనే విషయంలో నిపుణులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ఈ నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో ధర పెరుగుదలతో ఇక బంగారం కొనలేమా? అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

News April 2, 2024

కొవ్వూరు కింగ్ ఎవరో?

image

AP: తూ.గో(D)లోని SC రిజర్వ్డ్ నియోజకవర్గం కొవ్వూరు. 1999, 2019 ఎన్నికలు మినహా 1983 నుంచి ఇక్కడ TDP గెలుస్తూ వస్తోంది. ఈసారి అభ్యర్థుల్ని మార్చిన TDP, YCP.. గోపాలపురం సిట్టింగ్, మాజీ MLAలని ఇక్కడ బరిలోకి దింపాయి. YCP నుంచి తలారి వెంకట్రావు, TDP తరఫున వెంకటేశ్వరావు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి కొవ్వూరుని మళ్లీ కంచుకోటగా మార్చుకోవాలని TDP.. పట్టు నిలుపుకోవాలని YCP వ్యూహాలు రచిస్తున్నాయి. <<-se>>#ELECTIONS2024<<>>

News April 2, 2024

FakeNews: వార్తల వెరిఫికేషన్ చాలా సులువు

image

Way2News లోగోతో కొందరు తప్పుడు వార్తలు వైరల్ చేస్తున్నారు. వీటిని నమ్మినా, షేర్ చేసినా మనం ఇబ్బందులు పడవచ్చు. మేము పబ్లిష్ చేసే ఆర్టికల్‌కు యునిక్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్‌ను fc.way2news.comలో ఎంటర్ చేస్తే ఆ ఫార్వర్డ్ ఆర్టికల్ కన్పించాలి. లేదంటే మీకు వచ్చిన స్క్రీన్‌షాట్ మాది కాదు అని గ్రహించండి. మీరు Way2News లోగోతో ఫేక్ వార్తలు పొందితే ఈ-మెయిల్‌లో రిపోర్ట్ చేయడి.
grievance@way2news.com
-ధన్యవాదాలు

News April 2, 2024

KKRvsRR మ్యాచ్ తేదీ మార్పు! ఎందుకంటే?

image

ఈనెల 17న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉంది. ఆరోజు శ్రీరామ నవమి ఉండటంతో మ్యాచ్‌కు కావాల్సిన భద్రత కల్పించలేమని బెంగాల్ క్రికెట్ సంఘానికి అక్కడి పోలీసులు తెలిపారు. మ్యాచ్ తేదీని మార్చాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

News April 2, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనానికి 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 62,439 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.61 కోట్లు సమకూరింది. ఇవాళ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.

News April 2, 2024

హార్దిక్ పాండ్యకు ఏమైంది?

image

ఐపీఎల్‌లో ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన హార్దిక్ పాండ్య ఇంకా విజయాల ఖాతా తెరవలేదు. గుజరాత్ కెప్టెన్‌గా తొలి మూడు మ్యాచుల్లో విజయాన్ని అందుకున్న ఈ ఆల్‌రౌండర్.. MI కెప్టెన్‌గా మాత్రం విఫలమవుతున్నారు. మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో హార్దిక్ ఫెయిల్ అవడం, ఆటగాళ్ల మధ్య సమన్వయం కల్పించడంలో విఫలమవ్వడం వంటివి ముంబై పరాజయాలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు?