News July 11, 2024

అంబానీ ఇంట పెళ్లి వేడుకలు.. ముంబైలో వారికి వర్క్ ఫ్రం హోం

image

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు హాట్ టాపిక్‌గా మారాయి. మూడు రోజులపాటు జరగనున్న అనంత్-రాధిక వివాహ వేడుకలకు వీవీఐపీలు హాజరవుతున్నారు. దీంతో ముంబైలోని బాంద్రా కుర్లా ప్రాంతంలో మూడు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలోని వాణిజ్య కార్యాలయాలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశించాయి. ఈ నెల 15 వరకూ ఇంటి నుంచే పని చేయాలని పేర్కొన్నాయి.

News July 11, 2024

FILMFARE AWARDS: ‘బెస్ట్ ఫిల్మ్‌గా సీతారామం’

image

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్-2023 బెస్ట్ ఫిల్మ్‌గా సీతారామం చిత్రం నిలిచింది. ఇందులో నటించిన హీరో హీరోయిన్లు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌లు బెస్ట్ యాక్టర్లుగా ఎంపికయ్యారు. సపోర్టింగ్ రోల్‌ బెస్ట్ యాక్టర్‌గా రానా(బీమ్లా నాయక్), ఉత్తమ నటి క్రిటిక్స్ సాయిపల్లవి(విరాటపర్వం), బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా ప్రేమ్ రక్షిత్(నాటు నాటు), ఉత్తమ రచయితగా సిరివెన్నెల(కానున్న కళ్యాణం, సీతారామం)కి అవార్డులు వరించాయి.

News July 11, 2024

కోహ్లీ పాక్‌కు వస్తే ఇండియా ఆతిథ్యాన్ని మర్చిపోతారు: అఫ్రీది

image

కోహ్లీ పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడితే చూడటానికి ఎదురుచూస్తున్నట్లు ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది తెలిపారు. ‘విరాట్‌కు పాక్‌లో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అతను మా దేశానికి వస్తే ఇండియాలోని ఆతిథ్యాన్ని మర్చిపోతారు. అంతగొప్పగా కోహ్లీని చూసుకుంటాం’ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది పాక్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత్ రావాలని ఆ దేశం కోరుకుంటోంది. అది అసాధ్యమని BCCI వర్గాలు స్పష్టం చేశాయి.

News July 11, 2024

ఏపీలో 9 మంది ఐపీఎస్‌ల బదిలీ

image

AP: రాష్ట్రంలో 9 మంది IPSలు బదిలీ అయ్యారు. SPF డీజీగా అంజనా సిన్హా, లా అండ్ ఆర్డర్ DGగా సీహెచ్ శ్రీకాంత్, విజయవాడ CPగా రాజశేఖర్ బాబు, అగ్నిమాపక శాఖ డీజీగా మాదిరెడ్డి ప్రతాప్, లాజిస్టిక్స్ ఐజీగా PHD రామకృష్ణ(పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు), కర్నూలు రేంజ్ DIGగా కోయ ప్రవీణ్, గ్రే హౌండ్స్ IGగా గోపీనాథ్ జెట్టి, DGP ఆఫీసులో రిపోర్ట్ చేయాలని విశాల్ గున్నీ, విజయరావులను GOVT ఆదేశించింది.

News July 11, 2024

ALERT: ఏపీలో రేపు పిడుగులతో వర్షాలు

image

AP: ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో రేపు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని తెలిపింది. విజయనగరం, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News July 11, 2024

TCS లాభం రూ.12వేల కోట్లు.. కొత్త ఉద్యోగులు 5,452 మంది

image

FY2024-25 Q1లో 8.7% వృద్ధితో రూ.12,040 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు TCS వెల్లడించింది. మొత్తం ఆదాయం 5.4 శాతం వృద్ధితో రూ.62,613 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది. గత 3 నెలల్లో 5,452 మందిని కొత్తగా నియమించుకున్నట్లు వివరించింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,998కి చేరినట్లు తెలిపింది. వీరిని 151 దేశాల నుంచి రిక్రూట్ చేసుకున్నామంది. ఉద్యోగుల్లో 35.5 శాతం మహిళలు ఉన్నారని వెల్లడించింది.

News July 11, 2024

6,000+ రన్స్, 200 వికెట్లు.. స్టోక్స్ రికార్డు

image

ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డు సాధించారు. 6,000+ రన్స్, 200 వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా నిలిచారు. విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. గ్యారీ సోబర్స్(8,032 పరుగులు& 235 వికెట్లు), జాక్వెస్ కల్లిస్(13,289& 292), స్టోక్స్(6,320& 200*) తొలి 3 స్థానాల్లో ఉన్నారు.

News July 11, 2024

బ్యూరోక్రసీలోనూ జవాబుదారీతనం ఉండాలి: శివసేన ఎంపీ మిలింద్

image

ఫేక్ సర్టిఫికెట్లతో IASగా ఎంపికైన పూజా <<13605832>>ఖేడ్కర్‌పై<<>> శివసేన MP మిలింద్ మండిపడ్డారు. దేశ పాలనలో వెన్నెముక అయిన బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థలోనూ జవాబుదారీతనం ఉండాలని అభిప్రాయపడ్డారు. ‘రాజకీయ నాయకులకు అకౌంటబిలిటీ ఉండాలని ఎంతో మంది విమర్శిస్తున్నారు. అయితే కీలకమైన బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థలో జవాబుదారీతనం లేదు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

News July 11, 2024

పీరియడ్స్ ఎప్పుడొస్తుందో చెప్పే స్మార్ట్ రింగ్‌!

image

టెక్ దిగ్గజం శామ్‌సంగ్ స్మార్ట్ రింగ్‌ను విడుదల చేసింది. Samsung Galaxy Ring పేరుతో రిలీజైన ఇది మానవ జీవన శైలిని క్యాప్చర్ చేస్తుంది. Samsung Health యాప్‌లోని AI.. వ్యక్తికి సంబంధించిన పీరియడ్స్ టైమింగ్, స్లీప్ ట్రాకింగ్, హృదయ స్పందన రేటు, స్కిన్ టెంపరేచర్ వంటివి తెలియజేస్తుంది. దీని ధర $399 (రూ.33వేలు)గా శామ్‌సంగ్ నిర్ణయించింది. తాజాగా ప్రీఆర్డర్ మొదలవగా ఈనెల చివరి వారంలో డెలివరీ చేయనుంది.

News July 11, 2024

ట్రైనీ IAS పూజ వ్యవహారంపై విచారణ కమిటీ

image

అధికారాలను దుర్వినియోగం చేసిన ట్రైనీ IAS <<13605832>>పూజా<<>> ఖేద్కర్ వ్యవహారంపై కేంద్రం చర్యలు చేపట్టింది. ఇంటర్వ్యూ సమయంలో ఆమె సమర్పించిన ధ్రువపత్రాలను పరిశీలించేందుకు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2 వారాల్లో తన నివేదికను సమర్పించనుంది. మరోవైపు వివాదం నేపథ్యంలో పుణేలోని పూజ ఇంటికెళ్లిన మీడియాపై ఆమె తల్లి చిందులు తొక్కారు. కెమెరామెన్లపై అరుస్తూ తోసేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.