India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి గ్రామంలో జరిగిన ఘటనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. గ్రామంలో ఉగాది పండుగ నేపథ్యంలో కొందరు తమ పెద్దల సమాధుల వద్ద, దేవాలయం వద్ద పూజలు చేసి వస్తుండగా.. ఈ గొడవ మొదలైందన్నారు. క్షణికావేశంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని అన్నారు.
నేడు ఉగాది, రేపు రంజాన్ పండుగ సందర్భంగా అనంతపురం జిల్లాలో చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తిలో కేజీ రూ.180-190గా ఉంది. గుంతకల్లులో కిలో రూ.150-160 చొప్పున అమ్ముతున్నారు. ఇక అనంతపురంలో కేజీ రూ.140-150తో విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు తెలిపారు. గత ఆదివారంతో పోల్చితే నేడు చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తి, గుంతకల్లులో కేజీ మటన్ ధర రూ.700 నుంచి రూ.750గా ఉంది.
అనంతపురం పుట్లూరు మండలం మడుగుపల్లిలో ఉగాది ఉత్సవాలు వైభవంగా నిర్వహించేవారు. అయితే ఏడేళ్ల క్రితం గ్రామంలోని శ్రీ భైరవేశ్వరస్వామికి ఎడ్లబండ్లను కట్టి గుడి వద్దకు వెళ్తున్న సమయంలో ‘మా బండి ముందు వెళ్లాలంటే.. మా బండి ముందు వెళ్లాలి’ అంటూ పెద్దఎత్తున రాళ్లదాడులు చేసుకోవడంతో పోలీసులు ఉత్సవాలను నిలిపివేశారు. ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత తిరిగి ఉత్సవాలు జరగనుండటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గుత్తిలోని శ్రీ సాయి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న సాయి శ్రీనివాస్ నారాయణ అండర్-20 స్టేట్ ఫుట్బాల్ టీంకు ఎంపికైనట్లు కోచ్ ప్రసాద్ శనివారం చెప్పారు. రెండు రోజుల క్రితం అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో అండర్-20 స్టేట్ ఫుట్బాల్ టీం సెలక్షన్స్ జరిగాయి. సాయి శ్రీనివాస్ నారాయణ అత్యంత ప్రతిభ కనబరిచాడు. దీంతో సాయి శ్రీనివాస్ నారాయణను స్టేట్ టీంకు ఎంపిక చేశారు.
నిన్నటి రోజున విడుదలైన ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ఫలితాలలో పామిడికి చెందిన ముగ్గురు స్నేహితులు షాహిద్, మంజునాథ్, మొహమ్మద్ గౌస్ ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు. వారు మాట్లాడుతూ.. తాము ఈ ఉద్యోగం సాధించడానికి శిక్షకుడు వినయ్ కుమార్ రెడ్డి సహకారం ఎంతగానో తోడ్పడిందని తెలిపారు. ఉద్యోగాలు సాధించడం పట్ల వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.
అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఆలమూరు గ్రామంలో కలెక్టర్ వినోద్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా గ్రామంలోని వాటర్ క్వాలిటీ టెస్ట్ను ఆకస్మిక తనిఖీ చేశారు. నీటి పరీక్షలు చేస్తున్న విధానాన్ని దగ్గరుండి పరిశీలించారు. మానవ ఆరోగ్యానికి నీటి పరీక్షలు ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ సూచించారు.
GSWS అంశాల పెండింగ్ను త్వరితగతిన పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో GSWS, హెల్త్, తదితర అంశాలపై DPO, RDO, DLDO, MPDO, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. GSWS పరిధిలో సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ అటెండెన్స్ తక్కువ కాకూడదన్నారు.
అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఆదివారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు-2025 కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం తెలిపారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఉగాది వేడుకలకు ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి ప్రభుత్వ అధికారులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.
అనంతపురం జిల్లాకు చెందిన తేనే తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్.అంజనప్ప శుక్రవారం ఓరియంట్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు అందుకున్నారు. కనుమరుగవుతున్న కళా రూపాలకు పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలలో 221 కళాభిషేకం కార్యక్రమాలు పూర్తి చేసినందుకుగాను ఓరియంట్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు అవార్డు దక్కిందని తెలిపారు.
గుంతకల్లు మండలం పాత కొత్త చెరువు సమీపంలో ఇంటర్ సిటీ రైల్లో ప్రయాణిస్తున్న మహబూబ్ బాషా(59) శుక్రవారం మృతి చెందాడు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటికి చెందిన ఈయన.. ఈనెల రెండో తేదీన గోవా వెళ్లాడు. తిరిగి సొంతూరుకు వెళ్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని తాడిపత్రిలో రైల్వే ఎస్ఐ నాగప్ప, పోలీసు సిబ్బంది స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.