India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జిల్లా పరిషత్ పరిధిలోని 54 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ జడ్పీ ఛైర్పర్సన్ బోయ గిరిజమ్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి, వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని దిశానిర్దేశం చేశారు. జడ్పీ సీఈఓ శివ శంకర్, డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లాలో మహిళలు, చిన్నారుల భద్రతను పటిష్టం చేయాలని ఎస్పీ పి.జగదీష్ గ్రామ, వార్డు మహిళా పోలీసులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. మహిళా పోలీసులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ భరోసా కల్పించాలని సూచించారు. వేధింపులు జరిగే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. బాధితులకు అండగా నిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు.

స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా అనంతపురం జిల్లాకు మంజూరైన 8 ఎలక్ట్రికల్ శానిటేషన్ ఆటోలను ఇన్ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సోమవారం ప్రారంభించారు. ఈ ఆటోల ద్వారా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. త్వరలో జిల్లాకు మరో 100 ఈ-ఆటోలు రానున్నాయని తెలిపారు. అనంతరం కలెక్టరేట్లోని ఎన్ఐసీ భవనం వద్ద కొత్త క్యాంటీన్ను ప్రారంభించారు.

అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న గుంతకల్లుకు చెందిన యువకుడు నవీన్ పరిస్థితిని గోవర్ధన్ అనే వ్యక్తి ఎక్స్(ట్విట్టర్) వేదికగా మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. నవీన్ పేగు సంబంధిత ఆపరేషన్ చేయించుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని ఆదుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన లోకేశ్ బాధితుని వివరాలు అందాయని, అతనికి వైద్య సాయం అందేలా తన కార్యాలయం అధికారులతో సమన్వయం చేస్తోందని X వేదికగా భరోసా ఇచ్చారు.

ఏపీ RTI కమీషనర్గా అనంతపురానికి చెందిన గాజుల ఆదెన్న నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. గాజుల ఆదెన్న మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఈయన అనంతపురం నగర పాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పని చేశారు.

జూనియర్, సీనియర్ విభాగాలలో అనంత జిల్లా స్థాయి మట్టి కుస్తీ పోటీలు (మల్ల యుద్ధం) మంగళవారం 20వ తేదీన పామిడిలోని అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్లో జరగనున్నాయి. క్రీడాకారులు మంగళవారం ఉ. 9:00 గంటలకు హాజరుకావాలని జిల్లా కార్యదర్శి ఎన్. వాణి, జిల్లా కోచ్ రాఘవేంద్ర, ఆర్మీ ఎన్ సెక్రటరీ నక్కల రామాంజనేయులు తెలిపారు. వచ్చే క్రీడాకారులందరూ ఆధార్ కార్డు, మూడు ఫొటోలు, బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు.

ఖేలో ఇండియా, జాతీయ సెపక్ తక్రా క్రీడా అంశానికి సంబంధించి గుంతకల్లుకు చెందిన మానస ప్రతిభ కనబరిచి ఇండియన్ క్యాంప్కు ఎంపికయ్యారు. ఈ నెల 20 నుంచి బ్యాంకాక్లో, అనంతరం ఢిల్లీలో జరిగే శిక్షణలో ఆమె పాల్గొననున్నారు. మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తే ఆసియా గేమ్స్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఖేలో ఇండియా, జాతీయ సెపక్ తక్రా క్రీడా అంశానికి సంబంధించి గుంతకల్లుకు చెందిన మానస ప్రతిభ కనబరిచి ఇండియన్ క్యాంప్కు ఎంపికయ్యారు. ఈ నెల 20 నుంచి బ్యాంకాక్లో, అనంతరం ఢిల్లీలో జరిగే శిక్షణలో ఆమె పాల్గొననున్నారు. మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తే ఆసియా గేమ్స్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఖేలో ఇండియా, జాతీయ సెపక్ తక్రా క్రీడా అంశానికి సంబంధించి గుంతకల్లుకు చెందిన మానస ప్రతిభ కనబరిచి ఇండియన్ క్యాంప్కు ఎంపికయ్యారు. ఈ నెల 20 నుంచి బ్యాంకాక్లో, అనంతరం ఢిల్లీలో జరిగే శిక్షణలో ఆమె పాల్గొననున్నారు. మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తే ఆసియా గేమ్స్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఖేలో ఇండియా, జాతీయ సెపక్ తక్రా క్రీడా అంశానికి సంబంధించి గుంతకల్లుకు చెందిన మానస ప్రతిభ కనబరిచి ఇండియన్ క్యాంప్కు ఎంపికయ్యారు. ఈ నెల 20 నుంచి బ్యాంకాక్లో, అనంతరం ఢిల్లీలో జరిగే శిక్షణలో ఆమె పాల్గొననున్నారు. మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తే ఆసియా గేమ్స్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.