India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దులీప్ ట్రోఫీ టోర్నీలో భాగంగా నేడు జరిగిన మ్యాచ్లో D టీమ్పై C టీమ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ సాగింది ఇలా..
☞ D టీమ్ తొలి ఇన్నింగ్స్ 164/10
☞ C టీమ్ తొలి ఇన్నింగ్స్ 168/10
☞ D టీమ్ 2వ ఇన్నింగ్స్ 236/10
☞ C టీమ్ రెండో ఇన్నింగ్స్ 61 ఓవర్లలో 233/6
☞ ఫలితం: C టీమ్ 4 వికెట్ల తేడాతో విజయం
☞ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మానవ్ సుతార్ (7 వికెట్లు)
YSRCP ఆర్టీఐ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డిని నియమించారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పదవి అప్పగించారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్నారు. కల్పలతా రెడ్డి తలుపుల మండలం నంగివాండ్లపల్లికి చెందిన వారు.
పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో వికసిత్ ఆంధ్ర 2047కు సంబంధించి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అన్ని ప్రాథమిక రంగాల్లో అభివృద్ధికి 100 రోజులు, సంవత్సర ప్రణాళికలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ విజయకుమార్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
బొమ్మనహాల్ మండలం దర్గా హోన్నూరుకు చెందిన రాజప్ప(32) ఈనెల 4న అదృశ్యమయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ శివారులోని పొలాల్లో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ నబీ రసూల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాజప్ప ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఇతర ఏదైనా కారణం వల్ల మృతి చెందాడా? అనే కోణంలో విచారణ చేపట్టారు.
గార్లదిన్నె మండలం యర్రగుంట్ల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నాగార్జున విద్యుదాఘాతంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అయన మృతదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
అనంతపురం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్లో ఆసక్తికర ఘటన జరిగింది. సీ, డీ జట్ల మధ్య రెండో రోజు ఆట సందర్భంగా ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి స్టేడియంలోకి దూసుకొచ్చాడు. మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చిన అభిమాని.. మిడాన్లో ఫీల్డింగ్ చేస్తున్న భారత యువ ఓపెనర్, ఇండియా-సీ టీమ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు పాదాభివందనం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పెద్దపప్పూరు మండలంలో అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం పర్యటించారు. మండల పరిధిలోని చాగల్లులో పెన్నానదిపై నిర్మించిన చాగల్లు రిజర్వాయర్ను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. రిజర్వాయర్ సామర్థ్యం, ఇన్ ఫ్లో ఎంత ఉందన్న వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని వైశాలి హోటల్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈడీ స్వాధీనం నుంచి భూములను వెనక్కు తీసుకోవడానికి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. లేపాక్షిలో 8,844 ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఓర్వకల్, కొప్పర్తి తరహాలో లేపాక్షిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి టీజీ భరత్ చెప్పారు.
అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో ఇవాళ రెండో రోజు ఆట కొనసాగనుంది. తొలిరోజు డీ జట్టు 164 పరుగులకు ఆలౌట్ అయింది. అక్షర్ 86 టాప్ స్కోరర్. సీ జట్టు 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోగా ఇంద్రజిత్ 15*, పోరెల్ 32* అయిదో వికెట్కు అజేయంగా 48 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. తొలి రోజు సీ జట్టు 91 రన్స్ చేసింది. నేడు పాసులు ఉన్న వారినే స్టేడియంలోకి అనుమతించనున్నారు. సుమారు 4 వేల ఫ్రీ పాసులు మంజూరు చేశారు.
Sorry, no posts matched your criteria.