India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూర్పు గోదావరి జిల్లాతో పాటు ఆంధ్ర ప్రదేశ్లోని పలు జిల్లాల్లో శని, ఆదివారం పిడుగులతో కూడిన తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు. రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు చెట్లు, కరెంట్ పోల్స్, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని ఆయన విజ్ఞప్తి చేశారు.
గండేపల్లి హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్ధి బాడవుల కేదార్ మణికంఠ (21) చికిత్స పొందుతూ మృతి చెందాడు. గండేపల్లి ఎస్సై శివ నాగబాబు వివరాల ప్రకారం..ఏలూరు ముదినేపల్లికి చెందిన మణికంఠ, రాజమండ్రికి చెందిన విష్ణువర్ధన్తో కలిసి ధర్మవరంలో బిర్యానీ తినేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా గండేపల్లి శివారులో ఎదురుగా బైకు ఢీకొట్టిన ఘటనలో చనిపోయాడన్నారు.
అంబాజీపేట మండలం గంగలకుర్రులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గత నెల 24న సూర్యనారాయణమూర్తి మృతి చెందగా అతని సోదరులు నాగరాజు, రామచంద్రరావు కర్మకాండం నిర్వహించారు. గోదావరిలో నదికి స్నానానికి బైకుపై వెళ్తుండగా వారిని టిప్పర్ ఢీకొట్టింది. అన్న దినకార్యం రోజునే ఇద్దరు సోదరులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
గొడ్రాలు అనే నింద పడుతుందనే భయంతో ఓ వివాహిత గర్భణిగా నాటకం ఆడింది. పోలీసులు వివరాల ప్రకారం..దేవిపట్నం(M) ఇందుకూరిపేటకి చెందిన కొప్పిశెట్టి సంధ్యారాణిని గురువారం డెలివరీ కోసం ఆసుపత్రికి తీసుకువచ్చారు. తాను గర్భిణి కాదని తెలుస్తుందనే భయంతో ఆసుపత్రి నుంచి వెళ్లిపోయింది. కాకినాడలో ఆమె ఆచూకీ గుర్తించి విచారించగా.. 9నెలలు గుడ్డ ముక్కలు పెట్టుకుని గర్భం పెరుగుతున్నట్లు నమ్మించినట్లు ఆమె తెలిపింది.
ఈ నెల 6న భద్రాచలంలో సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం నిడదవోలు ఆర్టీసీ డిపో నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు నిడదవోలు ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. భక్తులు యావన్మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన వివరించారు. భద్రాచలం రాముల వారి కళ్యాణాన్ని చూసి తరలించాలని పేర్కొన్నారు.
ఈ నెల 6న భద్రాచలం సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం నిడదవోలు ఆర్టీసీ డిపో నుంచి భద్రాచలం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు నిడదవోలు ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. భక్తులు యావన్మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన వివరించారు. భద్రాచలం రాముల వారి కళ్యాణాన్ని చూసి తరలించాలని పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా భీమడోలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపాలపురం పెద్దగూడెంకు చెందిన యువకుడు సుబ్రహ్మణ్యం(22) మృతిచెందాడు. మార్చి 21న ఇద్దరు స్నేహితులు బైక్ పై వెళ్తుండగా ఎదురుగా కారు వచ్చి ఢీ కొట్టింది. ఘటనలో బైక్ నడుపుతున్న యువకుడు అదే రోజు మరణించాడు. గోపాలపురంకు చెందిన సుబ్రహ్మణ్యం విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు శుక్రవారం అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఏలూరు జిల్లా భీమడోలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపాలపురం పెద్దగూడెంకు చెందిన యువకుడు సుబ్రహ్మణ్యం(22) మృతిచెందాడు. మార్చి 21న ఇద్దరు స్నేహితులు బైక్ పై వెళ్తుండగా ఎదురుగా కారు వచ్చి ఢీ కొట్టింది. ఘటనలో బైక్ నడుపుతున్న యువకుడు అదే రోజు మరణించాడు. గోపాలపురంకు చెందిన సుబ్రహ్మణ్యం విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు శుక్రవారం అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
మృత్యువుతో 12 రోజుల పాటు పోరాడిన ఫార్మాసిస్టు నాగాంజలి (23) శుక్రవారం మృతి చెందింది. కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి AGM దీపక్ లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నాగాంజలి గత నెల 23వ తేదీ నుంచి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. నాగాంజలి మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తూ.గో జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎక్స్లో పోస్టు చేసింది. పిడుగుల పడే ఛాన్స్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడిన విషయం తెలిసిందే. తూ.గో జిల్లా నల్లజర్లలో నిన్న మధ్యాహ్నం పలు గ్రామాల్లో వర్షం కురిసింది. ఈ అకాల వర్షాలకు పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.