India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AMC మాజీ ఛైర్మన్ రమేశ్ రెడ్డికి స్థానిక ఎంపీ మద్దతు ఉందని ఎమ్మెల్యే కొలికపూడి నిన్న ఆరోపించారు. రమేశ్పై పార్టీ నాయకులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఎమ్మెల్యే తెలుపగా..రూ.2 కోట్లు అడిగితే తాను ఇవ్వకపోవడంతో కొలికపూడి తనపై నిందలు వేస్తున్నారని రమేశ్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో తిరువూరులో MP Vs MLAగా వివాదం తీవ్రమవుతోంది. ఆరోపణలు చేసేవారు ఓపెన్ డిబేట్కి రావాలని MLA సవాల్ విసిరారు.
ఓ ఆటోలో ఇద్దరు వ్యక్తులు కలిసి విజయవాడ బస్టాండ్ వద్దకు వచ్చి ఓ యువకుడితో అమ్మాయి ఉందని రేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు ఉండవల్లి సమీపంలో పొలాల వద్దకు వచ్చారు. అక్కడ యువకుడి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారు. పని అయ్యాక విజయవాడలో వదిలిపెట్టాలని కోరాడు. దీంతో ఆటోకి రూ.1500ఇవ్వాలని యువకుడిపై దాడి చేసి, జేబులోని డబ్బు లాక్కెళ్లారు. యువకుడు ఫిర్యాదుకు వెళ్తే పోలీసులు మందలించి పంపారు.
జిల్లాలో అధికంగా వినియోగించే సన్న రకాల వరి పంటల సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమైన కలెక్టర్ రానున్న ఖరీఫ్, రబీ సీజన్లలో పండించాల్సిన వరి పంటలపై పలు సూచనలు చేశారు. సన్న రకం వరి వంగడాల సాగుపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు.
☞ బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లెనిద్ర చేసిన ఎస్పీ
☞ గుడ్లవల్లేరులో విద్యార్థినితో అనుచిత ప్రవర్తన.. టీచర్ సస్పెండ్
☞MTM: హత్య కేసును ఛేదించిన పోలీసులు
☞మోపిదేవిలో రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు
☞మచిలీపట్నంలో మాజీ కౌన్సిలర్ మృతి
☞మోపిదేవిలో వివాదం.. కత్తితో దాడి
☞గుడివాడ: ఫోన్లో కొడాలి నానిని పరామర్శించిన జగన్
మాజీ మంత్రి కొడాలి నానికి గుండె సమస్యలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. కొన్ని రోజులుగా వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు 3 వాల్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని వైసీపీ నేత దుక్కిపాటి శశి భూషణ్ తెలియజేశారు.
ప్రజలు శాంతియుత జీవనంలో కొనసాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పల్లెనిద్ర చేపట్టినట్లు ఎస్పీ గంగాధరరావు తెలిపారు. బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేశ్వరం గ్రామంలో MPUP స్కూల్లో ఎస్పీ, పోలీసు అధికారులతో కలిసి పల్లెనిద్ర చేశారు.
ప్రజలు శాంతియుత జీవనంలో కొనసాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పల్లెనిద్ర చేపట్టినట్లు ఎస్పీ గంగాధరరావు తెలిపారు. బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేశ్వరం గ్రామంలో MPUP స్కూల్లో ఎస్పీ, పోలీసు అధికారులతో కలిసి పల్లెనిద్ర చేశారు.
చదువు కోసం వచ్చిన ఓ విద్యార్థిని వేదనకు గురైంది. గుడ్లవల్లేరు డైట్ కాలేజీలో డిప్యూటేషన్పై బోధన చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు హరి కిరణ్ ఆమెను 20 రోజులుగా వేధిస్తున్నాడని, అసభ్య సందేశాలు, ఫోన్ కాల్స్తో ఇబ్బంది పెడుతున్నాడని ఆమె ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసింది. విషయాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి హరికిరణ్ను సస్పెండ్ చేశారు. అతనిపై పోలీసు చర్యలు కూడా తీసుకోవాలని సూచించారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణలో ప్రాసిక్యూషన్ తరపున జేడీ రాజేంద్రప్రసాద్, వంశీ తరఫున డాక్టర్ దేశీ సత్య శ్రీ వాదనలు వినిపించారు. వాదనలు ముగిసిన అనంతరం న్యాయమూర్తి హిమబిందు తీర్పును మార్చి 28కి రిజర్వ్ చేశారు.
కృష్ణా జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు APSDMA తెలిపింది. గురువారం జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ప్రాంతాలను వెల్లడించింది. నందివాడ 40.7°, బాపులపాడు 41.5°, గన్నవరం 42.4°, కంకిపాడు 41.2°, పమిడిముక్కల 40.2°, పెనమలూరు 41.6°, ఉంగుటూరు 42.2°, పెదపారుపూడి 41.1°, తోట్లవల్లూరు 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది.
Sorry, no posts matched your criteria.