India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వీరమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా పోలీసు అధికారులు ఉయ్యూరులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటి నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీఏ రామారావు సూచించారు. 28, 29, 01, 07, 08వ తేదీల్లో వాహనాలకు ప్రవేశం లేదన్నారు. గండిగుంట రవి టీ స్టాల్, కాటూరు అండర్ పాస్, బస్టాండ్ సెంటర్, ఫ్లోరా జంక్షన్, శ్రీనివాస కాలేజ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీస్ కట్ ఆఫ్ పాయింట్లు ఏర్పాటు చేశామని చెప్పారు.

కలెక్టర్ డి.కె. బాలాజీ బుధవారం పెడనలోని బంగ్లా స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యా బోధన తీరు, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించిన ఆయన, మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. పాఠశాలలోని మౌలిక సదుపాయాలపై ఎంఈవో సలోమి, ప్రధానోపాధ్యాయురాలు భాగ్యలక్ష్మిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యా ప్రమాణాల పెంపునకు, వసతుల మెరుగుదలకు తగు సూచనలు చేశారు.

కూటమిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న పేర్ని నానిపై తాజాగా మరో కేసు నమోదైంది. CM, Dy.CMలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మచిలీపట్నంలో ఆయనపై కేసు ఫైల్ చేశారు. పేర్నికి కేసులు కొత్తేమీ కాదు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తన పరుష పదజాలంతో మాట్లాడి కేసులు పెట్టించుకుంటున్నారనే విమర్శలొస్తున్నాయి. అరెస్ట్ చేస్తే సింపతీ గేమ్ ప్లే చేసేందుకే పేర్ని ఇలా చేస్తున్నారని టాక్.

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొగమంచు కప్పేయడంతో బుధవారం ఉదయం విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావంతో గన్నవరం నుంచి విశాఖపట్నం, హైదరాబాద్కు వెళ్లాల్సిన ఇండిగో విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చే ఇండిగో విమానం, ఢిల్లీ నుంచి రావలసిన ఎయిర్ ఇండియా విమానం కూడా ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

కృష్ణా జిల్లాలో జరుగుతున్న గృహ నిర్మాణాలపై కలెక్టర్ డీకే బాలాజీ సమీక్షించారు. నిర్మాణాల వేగవంతానికి పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 24,133 గృహాలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు 121 గృహాలు మాత్రమే పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన గృహాలలో 719 గృహాలు BBL దశలో, 2770 గృహాలు BL దశలో, 119 గృహాలు RC దశలో ఉన్నాయన్నారు.

జిల్లాలోని రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జి. జయలక్ష్మితో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ల ద్వారా వచ్చే అర్జీలను తక్షణం పరిష్కరించాలన్నారు.

జిల్లాలో మాతృ మరణాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్లో వైద్యాధికారులతో సమావేశమై ప్రసూతి మరణాలపై సమీక్షించారు. జిల్లాకు సంబంధించిన రెండు ప్రసూతి మరణాల కేసులను విచారించి, వారి మరణానికి గల కారణాలను వారికి చికిత్స చేసిన వైద్యులను, ఘటనా వివరాలను బాధితుల బంధువులను అడిగి తెలుసుకున్నారు.

కృష్ణాజిల్లాలో పొగమంచు ప్రభావంతో అపరాల సాగు రైతులు నష్టపోయే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు తెలిపారు. ఉదయం 10 గంటల వరకు పొగమంచు తగ్గకపోవడంతో సూర్యరశ్మి పంటపై పడకపోవడం వల్ల ఆకులపై తేమ పెరిగి ఫంగస్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొన్నారు. దీని కారణంగా అపరాల మొక్కల ఎదుగుదల లోపించి, పూత–గింజ దశలో ఉన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. రైతుకు నష్టమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు

కృష్ణ జిల్లా పోలీస్ విభాగంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. H.జంక్షన్ SI వి.సురేష్, పామర్రు CI. వి.సుభాకర్ స్వయాన అన్నదమ్ములు. 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్, కలెక్టర్ బాలాజీ చేతుల మీదుగా ఇద్దరూ ఒకే వేదికపై ఉత్తమ సేవా పురస్కారాలు అందుకోవడం విశేషం. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు వేర్వేరు హోదాల్లో ఒకే సందర్భంలో పురస్కారాలు అందుకోవడం పోలీస్ విభాగానికి గర్వకారణం.

కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో 11వ రోజును ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఆరోజున సిడి బండి ఉత్సవంగా ఫిబ్రవరి 7న జరగనుంది. కార్యక్రమంలో స్థానికంగా ఉన్న ఎస్సీ కులానికి చెందిన ఓ యువకుడిని సిడి బండిలో కూర్చోబెట్టి ఊరేగిస్తారు. అదే టైంలో ఆ యువకుడిని అరటిపండులతో కొట్టడం సంప్రదాయం. ఆ ఒక్క రోజే లక్షకుపైగా భక్తులు వస్తారని అంచనా. మరి మీరు వెళుతున్నారా కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.