Krishna

News June 29, 2024

విజయవాడ: మదర్సాలో 100 కిలోల కుళ్లిన మాంసం!

image

విజయవాడలోని సింగ్‌నగర్‌లో ఉన్న మదర్సా విద్యార్థిని కరిష్మా శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఫుడ్ పాయిజన్ అని నిర్వహకులు చెబుతుండగా.. మదర్సాలో ఏదో జరిగిందని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో మృతి మిస్టరీగా మారింది. మరోవైపు, మదర్సాలో 100కిలోలకు పైగా కుళ్లిన మాంసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో మాంసాన్ని ఎందుకు ఉంచారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

News June 29, 2024

విద్యా వ్యవస్థలో సమూలమైన ప్రక్షాళన: మంత్రి లోకేశ్

image

ఏడాదిలోగా ఉన్నత విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత విద్య అధికారులతో మంత్రి లోకేశ్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యలో సమూలమైన మార్పులు తీసుకురావడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు.

News June 29, 2024

చంద్రబాబును కలిసిన TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా

image

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా శుక్రవారం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని ఉండవల్లిలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. పల్లా శ్రీనివాసరావు సమర్థ నాయకత్వంలో పార్టీ మరెన్నో విజయాలను సాధిస్తుందని, మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

News June 28, 2024

కైకలూరులో లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

image

మండలంలోని ఉప్పుటేరు చెక్‌పోస్ట్ సమీపంలో లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కైకలూరు మండలం గుమ్మళ్లపాడుకు చెందిన యాళ్ల దేవరాజు (40) ద్విచక్ర వాహనంపై ఆకివీడు నుంచి స్వగ్రామానికి వెళుతున్న క్రమంలో.. ఉప్పుటేరు వద్ద వెనక నుంచి లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్ రామకృష్ణ కేస్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 28, 2024

ఉత్తమ ఫలితాలు సాధించాలి: నారా భువనేశ్వరి

image

సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శుక్రవారం చల్లపల్లి మండలం పాగోలులో పర్యటించారు. తమ ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏపీ క్యాంపస్ పరిశీలించారు. ఆమెకు సిబ్బంది, టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థులతో సమావేశమైన భువనేశ్వరి వారితో మాట్లాడి స్ఫూర్తిదాయక ప్రసంగం చేసి వారితో కలిసి భోజనం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించాలని నారా భువనేశ్వరి కోరారు.

News June 28, 2024

మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష

image

మచిలీపట్నం నుంచి బదిలీపై వెళ్లిన మున్సిపల్ కమిషనర్ చంద్రయ్యకు హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అకారణంగా విధుల నుంచి సస్పెండ్ చేసిన ఆర్ఓ వెంకటేశ్‌ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ.2వేలు జరిమానా విధించింది.

News June 28, 2024

కృష్ణా: బీటెక్ అకడమిక్ క్యాలెండర్ విడుదల

image

కృష్ణా వర్శిటీ పరిధిలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ కోర్సుల అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. నిర్ణీత పని దినాలు ఉండేలా క్యాలెండర్ తయారు చేసినట్లు వర్శిటీ పేర్కొంది. 2025 జనవరి, జూన్ నెలల్లో ఫస్టియర్ విద్యార్థులకు ఒకటి, రెండవ సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయంది. క్యాలెండర్ పూర్తి వివరాలకు కృష్ణా వర్శిటీ https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News June 28, 2024

కృష్ణా: అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి అనిత

image

రాష్ట్రంలో వర్షాలు, వరద ముంపు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో 8 జిల్లాల కలెక్టర్లు, DROలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. అనంతరం ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్‌ను అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా అలర్ట్ సెంటర్ విధులను అక్కడి అధికారులు ఆమెకు వివరించారు.

News June 28, 2024

కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజీనామా

image

కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి గొల్లా జ్ఞానమణి శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మౌఖిక ఆదేశాల మేరకు వైస్ ఛాన్స్‌లర్ పదవిలో ఉన్న జ్ఞానమణి రాజీనామా చేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. కాగా 2023 సంవత్సరం ద్వితీయార్థంలో కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా జ్ఞానమణి నియామకమయ్యారు.

News June 28, 2024

దేవుడి పేరుతో దందాలు చేశారు: ఎమ్మెల్యే బొండా

image

గత ప్రభుత్వ పాలనలో దేవుడి పేరుతో దందాలు చేశారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ ట్వీట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఒకేసారి 54 మందిని తిరుమల శ్రీవారి దర్శనానికి పంపించాలని రాసిన సిఫారసు లేఖతో ఈ దందా బైటపడిందన్నారు. భక్తుల సౌకర్యాల గురించి ఏనాడూ పట్టించుకోని వైసీపీ నాయకులు దేవుడి పేరు చెప్పి భారీగా అవినీతికి పాల్పడ్డారని ఉమ Xలో పోస్ట్ చేశారు.