India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో యూరియాను ఆక్వా రైతులకు మళ్లించి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. జిల్లాలో యూరియా మళ్లింపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై శనివారం సాయంత్రం ఆయన పలు శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గత సంవత్సరం కంటే ఈ సీజన్లో దాదాపు 17 వేల మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా అందుబాటులో ఉంచామన్నారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీ కేవలం రైతులకే అన్నారు.
ఉయ్యూరు నగర పంచాయతీని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ శుక్రవారం GO విడుదలైంది. ఉయ్యూరు జనాభా 46 వేలు కాగా వివిధ పన్నుల రూపంలో రూ. 4.66 కోట్ల ఆదాయం వస్తోంది. ఆదాయం రూ. కోటి లోపు ఉండే పట్టణాలను నగర పంచాయతీలుగా గుర్తించగా.. అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తున్నందున గ్రేడ్-2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక కేంద్ర రాష్ట్ర నిధులతో పాటు ప్రత్యేక గ్రాండ్లు కూడా వస్తాయన్నారు.
జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఎస్పీ ఆర్.గంగాధరరావు నేతృత్వంలో సర్టిఫికెట్స్ పరిశీలన జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ.. అభ్యర్థుల విద్యార్హతలు, క్రీడా సర్టిఫికేట్లు, కేటగిరీకి సంబంధించిన ధ్రువపత్రాలు సహా అన్ని అవసరమైన పత్రాలను సక్రమంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 25న స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇందులో కృష్ణా జిల్లాలో గతంలో 5.11 లక్షలు, కొత్తగా 11 వేల అప్లికేషన్లు కలిపి 5.22 లక్షలు రాగా.. పున:పరిశీలన తర్వాత చివరికి 5.17 లక్షల డిజిటల్ కార్డులను మాత్రమే ప్రకటించారు. కొత్తగా వచ్చిన అప్లికేషన్లలో దాదాపు 5 వేల వరకు తిరస్కరణకు గురైనట్లు సమాచారం. అర్హత ఉండి కార్డు పొందలేని వారు సచివాలయాన్ని సంప్రదించాలని అధికారులు చెప్తున్నారు.
కృష్ణా నదీ తీరంలోని నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం వద్ద గురువారం సూర్యాస్తమయం వేళ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. సాయంత్రపు గాలులు, నది అలల తాకిడి, గగనంలో రంగుల వర్ణచిత్రం ఆ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా మార్చాయి. భక్తులు, సందర్శకులు ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ, పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మికతను అనుభవించారు.
కృష్ణా జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ నూతన DSP కె.ధర్మేంద్ర గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ, శక్తి టీమ్స్ పనితీరును పర్యవేక్షించాలని ఎస్పీ సూచించారు. ర్యాగింగ్, ఈవ్టీజింగ్ నివారణతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని DSPకి వివరించారు.
కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని వంగవీటి మోహనరంగా సోషల్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ అడపా ప్రతాప్ చంద్ డిమాండ్ చేశారు. గురువారం మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రేమ్ ఆధ్వర్యంలో లెక్టర్ డి.కె. బాలాజీకి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రామారావు, చెన్నకేశవుల సత్యం, శ్రీనివాస్, లక్ష్మణరావు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ముస్సోరీలో ఐఏఎస్ మిడ్-కెరీర్ శిక్షణ పూర్తి చేసుకున్న కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తమ ఐఏఎస్ అవార్డును అందుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ బర్ధన్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ప్రజలకు అత్యున్నత సేవలు అందించడానికి తాను కృషి చేస్తానని కలెక్టర్ బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
బందరులో కలెక్టర్ బాలాజీ గృహ నిర్మాణం, కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. గృహ నిర్మాణాల గడువు వచ్చే మార్చి 31వరకు పొడిగించినట్లు తెలిపారు. జిల్లాలో 2.36లక్షల పింఛన్లలో 4,332 అనర్హులైన దివ్యాంగుల పింఛన్లు ఆపివేసినట్లు పేర్కొన్నారు. వాళ్లల్లో అర్హులకు మళ్లీ అందిస్తామని తెలిపారు. స్వామిత్వ భూముల రికార్డుల ఆన్లైన్ ప్రక్రియ 20% పూర్తై, డిసెంబర్లో 100% చేస్తామన్నారు.
జిల్లాల పునర్విభజనపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు సమావేశం కానుంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాను విజయవాడగా మార్చి, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూజివీడు, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో, కైకలూరును కృష్ణాలో, నందిగామ, జగ్గయ్యపేటలను అమరావతి జిల్లాలో విలీనం చేయనున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.