India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అమెరికాతో ట్రేడ్వార్లో చైనా చాకచక్యం ప్రదర్శిస్తోంది. ‘అధిక ప్రభావం – తక్కువ ఖర్చు’ వ్యూహాన్ని అమలు చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్పై ఆహారాన్ని ఆయుధంగా ప్రయోగిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులపై US అతిగా ఆధారపడ్డ మూడో దేశం చైనా. చేపలు, రొయ్యల వంటి సముద్ర ఆహారం, వెల్లుల్లి, తేనె, పప్పులను దిగుమతి చేసుకుంటుంది. 2024లో ఈ వాణిజ్యం విలువ $3.9B పైమాటే. వీటిపై అధిక సుంకాలతో ఒత్తిడి పెంచాలన్నది జింగ్పింగ్ ఆలోచన.

ఓటీటీ వ్యూయర్ల కోసం రిలయన్స్ జియో కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.100తో జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో పాటు 5GB డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 90 రోజులు ఉంటుంది. హాట్స్టార్ ఫోన్ లేదా టీవీ ఏదైనా ఒకదానిలో ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్లో ఎలాంటి వాయిస్ కాలింగ్ ఉండదు.

AP: అర్హులైన ప్రతి రైతుకు ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.20 వేలు ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి బ్యాంకుల్లో జమ చేస్తామని వెల్లడించారు. కౌలు రైతులు, వెబ్ ల్యాండ్లో నమోదైన వారికీ పథకం వర్తిస్తుందన్నారు. మరో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. రూ.30 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తెచ్చామన్నారు. 16 రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని వివరించారు.

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ పెంపుతో భారత్కు మేలు జరగొచ్చని RBI మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య అన్నారు. కంపెనీల మధ్య ఇది పోటీతత్వం పెంచుతుందని అంచనా వేశారు. ఫలితంగా తయారీ, ఉత్పత్తిలో నాణ్యత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మానవ వనరుల నైపుణ్యంపై కంపెనీలు పెట్టుబడులు పెడతాయని పేర్కొన్నారు. ఆరంభంలో మార్జిన్లు తగ్గినా చివరికి మంచే జరుగుతుందని వెల్లడించారు.

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును బీజేపీ ప్రకటించింది. కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోము వీర్రాజు గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ తరఫున గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, జనసేన నుంచి నాగబాబు పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి.

అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి (20) మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఐదుగురు స్నేహితులతో కలిసి కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్ టూర్కు వెళ్లి ప్యూంటా కానా బీచ్ వద్ద అదృశ్యమయ్యారు. దీంతో ఆమె కోసం పోలీసులు హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో తీవ్రంగా గాలిస్తున్నారు. వర్జీనియాలో ఉంటున్న సుదీక్ష పిట్స్బర్గ్ యూనివర్సిటీలో చదువుతోందని ఆమె తండ్రి సుబ్బరాయుడు తెలిపారు.

టాలీవుడ్ హీరో గోపీచంద్ కొత్త సినిమాపై అప్డేట్ వచ్చింది. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో ‘Gopichand33’ తెరకెక్కనున్నట్లు మేకర్స్ ప్రకటన విడుదల చేశారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా, గతేడాది రిలీజైన గోపీచంద్-కావ్యా థాపర్ జంటగా నటించిన ‘విశ్వం’ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సంకల్ప్ రెడ్డి గతంలో ఘాజీ, అంతరిక్షం సినిమాలను తెరకెక్కించారు.

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏసీలకు గిరాకీ పెరుగుతుందని పలు కంపెనీలు అంచనా వేశాయి. ఎండ తీవ్రత పెరిగి, 25-30% వరకు అధికంగా అమ్మకాలు జరుగుతాయనే ఉద్దేశంతో ఏసీ కంపెనీలు వాటి తయారీ పెంచుతున్నాయి. అయితే ఇందుకు తగ్గట్లు విడిభాగాలు సరఫరా కావడం లేదు. దీంతో ఏసీల ధరలు 4-5% పెరగొచ్చని తెలుస్తోంది. రకాన్ని బట్టి ఒక్కో ఏసీపై రూ.1500 నుంచి రూ.2000 వరకు పెరిగే ఆస్కారం ఉంది.

స్టాక్మార్కెట్లు భారీ లాభాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 22,654 (102), సెన్సెక్స్ 74,653 (313) వద్ద ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందినా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. CPSE, PSE, కమోడిటీస్, మెటల్స్, మీడియా, ఎనర్జీ, రియాల్టి, FMCG, ఇన్ఫ్రా, ఫైనాన్స్, చమురు షేర్లు ఎగిశాయి. ఆటో, వినియోగ, హెల్త్కేర్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. పవర్ గ్రిడ్ టాప్ గెయినర్.

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్తో అక్కినేని నాగార్జున ఓ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూరీ చెప్పిన స్టోరీ నాగ్కు నచ్చిందని, చర్చలు కొనసాగుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో శివమణి (2003), సూపర్ (2005) తెరకెక్కాయి. విక్టరీ వెంకటేశ్, అక్కినేని అఖిల్తోనూ పూరీ జగన్నాథ్ సినిమాలు చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.