news

News December 24, 2024

ఏపీ వాళ్లు తెలంగాణలో ఉండాలంటే వీసా కావాలా?: విష్ణు

image

AP:అల్లు అర్జున్ ఆంధ్రోడని, బతకడానికి వచ్చాడని కాంగ్రెస్ MLA భూపతిరెడ్డి చేసిన <<14969335>>వ్యాఖ్యలపై <<>>BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ‘రేవంత్ రెడ్డి గారు AP వాళ్లు TGలో ఉండాలంటే ప్రత్యేక వీసా తీసుకోవాలా? TG ఏర్పడిన 11 ఏళ్ల తర్వాత కూడా ఈ రెచ్చగొట్టే మాటలు ఏంటి? ఇదేనా కాంగ్రెస్ సంస్కృతి? మీ MLAపై వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే మీ పార్టీని తెలంగాణ సమాజం క్షమించదు’ అని Xలో ఫైరయ్యారు.

News December 24, 2024

IND vs PAK: కింగ్ కోహ్లీకి స్పెషల్ మ్యాచ్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ విరాట్ కోహ్లీకి ప్రత్యేకంగా మారనుంది. ఈ మ్యాచ్ ఆయనకు 300వ వన్డే కావడం విశేషం. విరాట్ ఇప్పటివరకు 295 వన్డేలకు ప్రాతినిధ్యం వహించారు. కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. బాక్సింగ్ డే టెస్టు కోసం ఆయన సన్నద్ధమవుతున్నారు.

News December 24, 2024

కాంగ్రెస్ ఆరోపణల్ని కొట్టిపారేసిన EC

image

MH అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల జాబితా అవ‌క‌త‌వ‌క‌ల‌పై కాంగ్రెస్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఎన్నిక‌ల సంఘం కొట్టిపారేసింది. జాబితాలో ఏక‌ప‌క్షంగా ఓట‌ర్ల తొల‌గింపు, కొత్త ఓట‌ర్ల చేర్పులు జ‌ర‌గ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. పోలింగ్ ముగిసే 5 PM నాటి డేటాను పూర్తి ఓటింగ్ స‌ర‌ళితో పోల్చ‌డం సరికాదంది. అభ్యర్థులు నియ‌మించిన ఏజెంట్లకు పోలింగ్ ముగిశాక‌ ఇచ్చిన Form-17Cలోని ఓటింగ్ వివ‌రాల్ని మార్చ‌డం అసాధ్యమ‌ని తెలిపింది.

News December 24, 2024

కేంద్రంపై మ‌నూ భాక‌ర్ తండ్రి తీవ్ర విమ‌ర్శ‌లు

image

స్టార్ షూటర్ మ‌నూ భాక‌ర్‌ను ఖేల్ ర‌త్న‌కు కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయ‌కపోవడంపై ఆమె తండ్రి రామ్ కిష‌న్ <<14968745>>మరోసారి<<>> తీవ్రంగా మండిప‌డ్డారు. మ‌నూ భాక‌ర్‌ను క్రీడ‌ల్లో ప్రోత్స‌హించి త‌ప్పు చేశాన‌ని అన్నారు. దేశంలోని త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల్ని క్రీడలకు దూరంగా ఉంచాల‌ని సూచించారు. పిల్లల్ని IAS, IPSలుగా తీర్చిదిద్దాలని, అప్పుడే వారు వేల మంది క్రీడాకారుల‌పై అధికారాన్ని చెలాయించ‌గ‌ల‌ర‌ని వ్యాఖ్యానించారు.

News December 24, 2024

శ్రీతేజ్ హెల్త్ బులిటెన్

image

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌ను KIMS ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్ సాయం లేకుండానే ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడని, అప్పుడప్పుడు కళ్లు తెరుస్తున్నాడని తెలిపారు. సైగలను గమనిస్తున్నా, మాటలను అర్థం చేసుకోలేకపోతున్నట్లు వెల్లడించారు. ట్యూబ్ ద్వారా ఫుడ్ తీసుకుంటున్నాడని పేర్కొన్నారు. అతడు త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

News December 24, 2024

లోయ‌లో ప‌డిన ఆర్మీ వాహ‌నం.. ఐదుగురు జవాన్లు మృతి

image

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహ‌నం అదుపుత‌ప్పి 350 అడుగుల లోయ‌లో ప‌డిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. 18 మంది జవాన్లతో వెళ్తున్న ఆర్మీ వాహ‌నం మెంధార్‌లోని బాల్నోయ్ ప్రాంతంలో లోయ‌లోకి దూసుకెళ్లింది. పలువురు జవాన్లు గాయపడినట్టు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

News December 24, 2024

చంద్రబాబులో భయం పెరిగిపోతోంది: జగన్

image

AP: 2027లోనే జమిలి ఎన్నికలు జరుగుతాయని మాజీ CM జగన్ జోస్యం చెప్పారు. ఎన్నికలు దగ్గరికి వచ్చే కొద్దీ చంద్రబాబులో భయం, TDP కార్యకర్తల్లో గుబులు రేగుతోందని ఆయన ఎద్దేవా చేశారు. ‘కష్టాలు శాశ్వతం కావు. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు. అబద్ధాలు చెప్పకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారు. మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో వేశారు’ అని వ్యాఖ్యానించారు.

News December 24, 2024

మగబిడ్డకు తండ్రైన అక్షర్ పటేల్‌

image

భారత క్రికెటర్ అక్షర్ పటేల్ తండ్రయ్యారు. ఆయన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారని వారి కుటుంబం ప్రకటించింది. కుమారుడికి హక్ష్ పటేల్‌గా పేరు పెట్టినట్లు తెలిపింది. చిన్నారికి టీమ్ ఇండియా జెర్సీ వేసి తీసిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది.

News December 24, 2024

ఢిల్లీ బయలుదేరిన సీఎం చంద్రబాబు

image

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ఢిల్లీ బయలుదేరారు. ఎన్డీయే సీఎంల సమావేశంతో పాటు వాజ్‌పేయి శతజయంతి కార్యక్రమంలోనూ ఆయన పాల్గొననున్నారు. ఢిల్లీలోని నడ్డా నివాసంలో రేపు ఎన్డీయే కూటమి నేతలు సమావేశం కానున్న సంగతి తెలిసిందే. ఇటీవల వివాదాస్పదమైన పలు అంశాలు, బిల్లులపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది.

News December 24, 2024

చంద్రబాబు ప్రజలపై కసి తీర్చుకుంటున్నారు: అంబటి రాంబాబు

image

కూటమి ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ‘కూటమి పార్టీలు అనేక హామీలు ఇచ్చాయి. ఛార్జీలు తగ్గిస్తామంటూ ప్రచారం చేసి ఇప్పుడు రూ.15,485 కోట్ల భారాన్ని ప్రజలపై మోపాయి. ప్రభుత్వం అమరావతి కోసం రూ.30 వేల కోట్ల అప్పు చేసింది. ఆదాయం గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం అప్పులతోనే నడుస్తోంది. చంద్రబాబు ప్రజలమీద కసి తీర్చుకుంటున్నారు’ అని మండిపడ్డారు.