news

News December 23, 2024

వ్యవసాయ రుణాల పంపిణీలో వేగం పెంచాలి: భట్టి

image

TG: త్వరలో రీజినల్ రింగ్ రోడ్ పనులకు టెండర్లు పిలుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నాం. మ్యాచింగ్ గ్రాంట్లు, సబ్సిడీ పథకాలు మంజూరు చేసి రాష్ట్ర ప్రజలకు సహకరించాలి. వ్యవసాయ రుణాల పంపిణీలో వేగం పెంచాలి’ అని స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ రివ్యూ మీటింగ్‌లో వ్యాఖ్యానించారు.

News December 23, 2024

ఇక్కడ స్థిరపడ్డాక ఏపీకి ఎందుకెళ్తాం?: నాగవంశీ

image

టాలీవుడ్ APకి వెళ్తుందనే ప్రచారం అవాస్తవమని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. తాను డబ్బు పెట్టి హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నానని, తనలా స్థిరపడిన వారు తిరిగి APలో ఏం చేస్తారని ప్రశ్నించారు. షూటింగుల్లో ఇరు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. తమకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదు కానీ తెల్లవారుజామున గం.4:30కి సినిమా పడితే చాలని మీడియాకు తెలిపారు. FDC ఛైర్మన్ దిల్ రాజుకు తమ విజ్ఞప్తులు అందిస్తామన్నారు.

News December 23, 2024

ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్ల నియామకం భేష్: గుత్తా జ్వాలా

image

ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడంపై బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా హర్షం వ్యక్తం చేశారు. ‘సీఎం రేవంత్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తీసుకున్న ఈ నిర్ణయం కచ్చితంగా విప్లవాత్మక చర్యగా మారనుంది. ట్రాన్స్‌జెండర్ల నియామకంతో సమాజంలో వారికి అధికారిక గుర్తింపు లభించింది. ఈ చర్య మన తెలంగాణ రాష్ట్రంలో ప్రగతిశీల మార్పునకు శ్రీకారం కానుంది’ అని పేర్కొన్నారు.

News December 23, 2024

రేపటి నుంచి కడప జిల్లాలో జగన్ పర్యటన

image

AP: మాజీ CM జగన్ రేపటి నుంచి 4 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. 24న బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకొని YSR ఘాట్‌ వద్ద నివాళులర్పించి పులివెందుల చేరుకుంటారు. 25న CSI చర్చిలో జరిగే క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొంటారు. 26న పులివెందుల క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 27న ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరగనున్న ఓ వివాహానికి హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

News December 23, 2024

800 మందికి ఓ వైద్యుడున్నాడు!

image

ఇండియాలో వైద్యుల సంఖ్య, వారికి ఎదురయ్యే సమస్యలపై ఓ వైద్యుడు చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ప్రస్తుతం ఆధునిక వైద్యం చదివిన వైద్యులు 13 లక్షలు, ఆయుష్ వైద్యులు దాదాపు 6 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం ప్రతి 800 మందికి ఒక వైద్యుడు ఉన్నారు. అయితే పని ఒత్తిడితో వైద్యులు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సామాన్యుల కంటే పదేళ్ల ముందే చనిపోతున్నారు. జూ.డాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’ అని Xలో రాసుకొచ్చారు.

News December 23, 2024

ఏపీలో వచ్చే నెల 8న ప్రధాని మోదీ పర్యటన

image

AP: ప్రధాని మోదీ వచ్చే నెల 8న అనకాపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

News December 23, 2024

4 రోజుల పని చాలు: NR మూర్తికి కాంగ్రెస్ MP కార్తీ కౌంటర్

image

నిజానికి దేశం వారానికి 4 రోజుల పనివిధానం వైపు వెళ్లాలని కాంగ్రెస్ MP కార్తీ చిదంబరం అన్నారు. MON 12PM నుంచి FRI 2PM వరకే ఉండాలన్నారు. నారాయణ మూర్తి 70Hrs పని, మాస్ మైగ్రేషన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘సుదీర్ఘంగా పనిచేయడం అర్థరహితం. సమర్థతపై దృష్టి సారించాలి. రోజువారీ జీవితం పోరాటం, అసమర్థత, నాణ్యతలేని మౌలిక వసతులతో గడిచిపోతోంది. సమాజంలో సామరస్యానికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యం’ అని పేర్కొన్నారు.

News December 23, 2024

రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని TFCC నిర్ణయం

image

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌కు అండగా ఉంటామని తెలిపింది. వారి కుటుంబానికి సాయం చేసేందుకు మనీ డొనేట్ చేయాలని ఛాంబర్ మెంబర్లను కోరుతూ సర్క్యులర్ జారీ చేసింది.

News December 23, 2024

తప్పు చేసిన ఎవరినీ వదలం: మంత్రి కొల్లు రవీంద్ర

image

AP: మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం మాయం చేసింది వాస్తవం కాదా? అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. దారి మళ్లిన బియ్యం స్కామ్‌పై వివరణ ఇచ్చుకోలేని దుస్థితి ఆయనది అని ఎద్దేవా చేశారు. తప్పు చేయనప్పుడు దొంగలా తప్పించుకొని తిరగడమెందుకని నిలదీశారు. తప్పు చేసిన ఎవరినీ వదలబోమని చెప్పారు. రేషన్ కుంభకోణంపై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తామని, విచారణలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలుంటాయన్నారు.

News December 23, 2024

అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయించింది కాంగ్రెస్సే: బీఆర్ఎస్

image

TG: అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ముఠాను KTR పంపారని ప్రచారం చేస్తున్న వారిపై BRS మండిపడింది. ‘గూండాలతో అల్లు అర్జున్ ఇంటిపై దాడులు చేయించి కాంగ్రెస్ పార్టీ అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకు ఫేక్ ఎడిట్లతో ముందుకు వచ్చింది. రేవంత్ సర్కార్ డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతోంది. ఫేక్ ఎడిట్లు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని X వేదికగా హెచ్చరించింది.