news

News February 19, 2025

కొత్త రేషన్ కార్డులపై UPDATE!

image

TG ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్తవి, పాతవి కలిపి కోటి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కార్డులు బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్‌తో పోస్ట్ కార్డు సైజులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటోలతో పాటు ప్రభుత్వ లోగో ఉండనున్నాయి. తొలుత ఎన్నికల కోడ్ లేని మహబూబ్ నగర్, రంగారెడ్డి, HYDలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

News February 19, 2025

నీటి ఎద్దడి.. ట్యాంకర్ల పరుగులు

image

ఎండాకాలం వచ్చేసింది. ఎప్పటిలాగే హైదరాబాద్‌లో నీటి ఎద్దడి మొదలైంది. దీంతో వాటర్ ట్యాంకర్లు రంగంలోకి దిగాయి. నగర రోడ్లపై హడావిడి మొదలుపెట్టాయి. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లు, హాస్టల్లోని బోర్లు అడుగంటి నీటి కొరత ఏర్పడుతోంది. దీంతో నీటిని కొనుగోలు చేస్తున్నారు. నిర్వాహకులు ఒక్కో ట్యాంకర్‌కు రూ.800 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. రాబోయే 3 నెలలు నీటి ఎద్దడి మరింత తీవ్రం కానుంది.

News February 19, 2025

రేఖ or వర్మ.. కౌన్ బనేగా సీఎం?

image

దేశ రాజధాని ఢిల్లీ సీఎం ఎవరనేది ఇవాళ తేలిపోనుంది. మ.3.30 గంటలకు ఢిల్లీ బీజేపీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రిని ప్రకటించనున్నారు. రేసులో మాజీ CM కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మరోవైపు ఈసారి హస్తిన పీఠాన్ని మహిళే అధిష్ఠిస్తారని, షాలిమార్ బాగ్ MLA రేఖా గుప్తానే పదవి వరించనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి అధిష్ఠానం ఎవరివైపు మొగ్గు చూపుతుందో చూడాలి.

News February 19, 2025

6నెలల్లో క్యాన్సర్ టీకా అందుబాటులోకి: కేంద్రమంత్రి

image

మహిళల్లో క్యాన్సర్‌ను నివారించేందుకు ఉపయోగపడే టీకాను మరో 6 నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర వైద్యారోగ్య శాఖ సహాయమంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు. 9 ఏళ్ల నుంచి 16 ఏళ్లలోపు బాలికలకు ఈ టీకాలను అందిస్తామని వివరించారు. రొమ్ము, నోరు, గర్భాశయ క్యాన్సర్లను ఈ టీకా నియంత్రిస్తుందని, ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పారు.

News February 19, 2025

ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికులు ఆందోళన

image

ముంబై-దుబాయ్ ఎయిరిండియా విమానాన్ని అధికారులు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. నిన్న రాత్రి 8 గంటలకు బయలుదేరాల్సిన విమానం 50 నిమిషాల తర్వాత ముంబైలో ల్యాండ్ చేశారు. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించాక తెల్లవారుజామున 4 గంటలకు విమానం బయలుదేరింది. విమానంలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల ప్రయాణికులే ఉన్నారు.

News February 19, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ: విజేతలు వీరే

image

* 1998- దక్షిణాఫ్రికా
* 2000- న్యూజిలాండ్
* 2002- భారత్ & శ్రీలంక(సంయుక్తం)
* 2004- వెస్టిండీస్
* 2006- ఆస్ట్రేలియా
* 2009- ఆస్ట్రేలియా
* 2013- భారత్
* 2017- పాకిస్థాన్

News February 19, 2025

2 రోజులు సెలవు

image

AP: పట్టభద్రుల, టీచర్స్ MLC స్థానాలకు ఎన్నికలు జరిగే జిల్లాల్లో(ఉమ్మడి గోదావరి జిల్లాలు, గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్ర టీచర్స్) 2 రోజులు సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. పోలింగ్ ముందు రోజు FEB 26, పోలింగ్ రోజైన 27 తేదీల్లో సెలవు ఇవ్వాలని, అవసరమైతే కౌంటింగ్(MAR 3) రోజునా సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు. మొత్తం 16 జిల్లాల్లో MLC ఎన్నికల పోలింగ్ జరగనుంది.

News February 19, 2025

నేడు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు మిర్చి యార్డ్‌కు చేరుకోనున్నారు. మిర్చికి గిట్టుబాటు ధరను డిమాండ్ చేస్తూ అక్కడి రైతులకు సంఘీభావం తెలుపనున్నారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ పర్యటనకు ఈసీ నుంచి ఎలాంటి స్పందన ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్త ఫీజు పోరు నిరసనల్ని కోడ్ దృష్ట్యా వైసీపీ వాయిదా వేసుకుంది.

News February 19, 2025

నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

image

AP: నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉ.9 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు అంకురార్పణ పడనుంది. వేడుకల్లో భాగంగా ఆర్జిత సేవలను రద్దు చేశారు. సాధారణ భక్తులకు స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనం ఉంటుంది. ఇప్పటికే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 23న సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

News February 19, 2025

నేడు బీఆర్ఎస్ భవన్‌కు కేసీఆర్

image

TG: గులాబీ బాస్ కేసీఆర్ నెలల విరామం తరువాత బీఆర్ఎస్ భవన్‌కు రానున్నారు. ఇవాళ మ.2 గంటలకు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ నేతలు, ఇతర నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.