India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బెంగళూరులోని టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన ‘వన్8 కమ్యూన్’ పబ్కు అధికారులు నోటీసులు ఇచ్చారు. క్లబ్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించనందుకే BBMP (బెంగళూరు బృహత్ మహానగర పాలికే) సమన్లు జారీ చేసింది. ఈ పబ్ చిన్నస్వామి స్టేడియం సమీపంలో ఉన్న రత్నం కాంప్లెక్స్లోని ఆరో ఫ్లోర్లో ఉంది. దీనిపై గత నెల 29న సామాజిక కార్యకర్త హెచ్.ఎమ్ వెంకటేశ్ ఫిర్యాదు చేయగా నోటీసులు పంపింది.
TG: అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులతో హీరో అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించారని CM రేవంత్ మండిపడ్డారు. బన్నీ బాధ్యతరాహిత్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ‘సంధ్య థియేటర్కు హీరో, హీరోయిన్ రావొద్దని చెప్పాం. వారు అక్కడికి వచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారు. తల్లి చనిపోయి, కుమారుడు చావు బతుకుల్లో ఉంటే ఒక్క సినీ స్టార్ పరామర్శించలేదు. నటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు?’ అని ఫైర్ అయ్యారు.
TG: తాను తండ్రి పేరు చెప్పుకొని ఇక్కడికి రాలేదని, జిల్లా స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగానని రేవంత్ రెడ్డి అన్నారు. ‘రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ చేపట్టాలా? వద్దా?. కొడంగల్లో 1300 ఎకరాల భూసేకరణ చేసి, అక్కడి యువతకు ఉపాధి కల్పించాలనుకుంటే అడ్డుకుంటున్నారు. నేను పులులు తిరిగే ప్రాంతం నుంచి వచ్చాను’ అని రేవంత్ అన్నారు. అటు, GHMC సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
TG: మూసీ మురుగు నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కల్పిద్దామంటే BRS కాళ్లలో కట్టెలు పెడుతోందని CM రేవంత్ మండిపడ్డారు. ‘ఆ జిల్లా మహిళలు గర్భం దాల్చేందుకూ భయపడుతున్నారు. మూసీ పునరుజ్జీవం వద్దని ప్రజలు చెబుతున్నారని BRS అంటోంది. రండి.. KTR వస్తారో? హరీశ్ వస్తారో? నేను కూడా గన్మెన్లు లేకుండా వస్తా. నల్గొండ పోదామా? భువనగిరి పోదామా? ఆలేరు పోదామా? మూసీ పునరుజ్జీవం కావాలో, వద్దో అడుగుదాం?’ అని అన్నారు.
వన్యమృగాల్లోనూ ప్రేమ ఉంటుంది. రష్యాలో బోరిస్ అనే ఓ సైబీరియన్ పులి తన ప్రియురాలిని కలుసుకునేందుకు 200KMS (124 మైళ్లు) ప్రయాణించింది. వన్యమృగాల పరిరక్షణలో భాగంగా ఆడ-మగ పులులను అటవీ అధికారులు పెంచారు. కొన్నేళ్ల క్రితం వీటిని చెరో అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో తనతో పెరిగిన ఆడపులి స్వెత్లాయాను కలుసుకునేందుకు బోరిస్ వందల కి.మీలు నడుస్తూ దానిని చేరుకుంది. GPS కాలర్ బెల్ట్ ద్వారా ఇది గుర్తించారు.
ఫామ్ అందుకోవాలంటే విరాట్ కోహ్లీ క్రీజులో ఎక్కువ సేపు ఉండాలని భారత మాజీ కోచ్ సంజయ్ బంగర్ సూచించారు. ‘బంతిని వేటాడకుండా దాన్ని తన వద్దకు రానివ్వాలి. క్రీజులో నిలదొక్కుకుంటే ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చాలా సులువవుతుంది. విరాట్ త్వరపడుతున్నారు. తర్వాతి టెస్టులో ఆయన వీలైనన్ని ఎక్కువ బంతులు ఆడాలి. టైమ్ తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. గడచిన 5 ఇన్నింగ్స్లలో విరాట్ 126 పరుగులు మాత్రమే చేశారు.
BRS సర్కారు 11.5 శాతం వడ్డీకి అప్పులు తెచ్చి సర్కారుపై భారం మోపిందని CM రేవంత్ ఆరోపించారు. ‘వీళ్లను ఉరి తీసినా తప్పులేదు. అనేక బ్యాంకులు 2 నుంచి 4శాతానికి అప్పులిస్తుంటే వీళ్లు 11.5శాతానికి అప్పు తెచ్చారు. రూ.వేలాది కోట్లు వడ్డీలు కడుతున్నాం. ఇతర దేశాల్లో ఇంత ఆర్థిక నేరానికి పాల్పడి ఉంటే ఉరి తీసి ఉండేవారు. దుబాయ్లాంటి దేశాల్లో బజార్లో రాళ్లతో కొట్టి చంపి ఉండేవారు’ అని మండిపడ్డారు.
ఎలక్ట్రిక్ సహా పాత కార్ల అమ్మకాలపై GST రేటును పెంచుతున్నారని సమాచారం. ఈ లావాదేవీలపై పన్నును 12 నుంచి 18%కి సవరించేందుకు మండలి ఆమోదం తెలిపినట్టు ET పేర్కొంది. 50% పైగా ఫ్లైయాష్ ఉండే కాంక్రీట్ బ్లాకులపై పన్నును 18 నుంచి 12కు తగ్గించారని తెలిపింది. ఉప్పు, మసాలా దట్టించిన రెడీ టు ఈట్ పాప్కార్న్పై 5%, ప్రీప్యాక్డ్, లేబుల్ వేస్తే 12%, కారమెల్ వంటి షుగర్ కోటింగ్ వేస్తే 18% GST వర్తిస్తుందని సమాచారం.
భారత్లో వారసత్వ పన్ను అవసరమేనని జెరోదా ఫౌండర్, బిలియనీర్ నితిన్ కామత్ అంటున్నారు. సమాజానికి పంచకుండా తరతరాలుగా సంపద ఒకేదగ్గర పోగుపడటం సబబు కాదన్నారు. ‘ఒక తరం సంపదను పొందిన ప్రతిసారీ దానిపై కొంత పన్ను చెల్లించడం సరైనదే. భారత్లో దీన్ని అమలు చేయడం సవాలే. కానీ ఏదో ఒక మార్గం వెతకాలి. సంపదను తిరిగివ్వడానికి సంపన్నులు మరింత కృషి చేయాలనేదే నా సలహా’ అని అన్నారు. కామత్ Podcastల్లో మాట్లాడటం తెలిసిందే.
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. సెంటారస్ లైఫ్స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు డైరెక్టర్గా ఉన్న ఉతప్ప ఉద్యోగుల జీతాల నుంచి ₹23 లక్షలు కట్ చేసి EPFOలో జమ చేయలేదని అధికారులు గుర్తించారు. ఈక్రమంలో కర్ణాటక పీఎఫ్ రీజనల్ కమిషనర్ షడక్షర గోపాల రెడ్డి ఈ వారెంట్ జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.