India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ ED వెంకట దత్తసాయితో రింగ్స్ మార్చుకున్నారు. ‘ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు తిరిగి మనమూ ప్రేమించాలి’ అని ఓ కోట్ను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. దీంతో పాటు కాబోయే భర్తతో కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఆమె షేర్ చేశారు. వీరి వివాహం ఈ నెల 22న రాజస్థాన్లో జరగనుంది.
AP: వైసీపీపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్విటర్లో సెటైర్లు వేశారు. ‘డిసెంబర్ 13న శుక్రవారం, డిసెంబర్ 27న శుక్రవారం, జనవరి 3న శుక్రవారం. తమ నిరసనలు, పోరుబాటల్లాంటి రాజకీయ కార్యకలాపాలకు ప్రతీ వారం కేవలం “శుక్రవారం” రోజునే వైసీపీ ఎన్నుకోవడం పూర్తిగా యాదృచ్ఛికమే. ఎటువంటి మతలబు లేదు. సాకులు చూపే ఉద్దేశం అసలే లేదు’ అని పేర్కొన్నారు. దానికి జైలు పక్షి అని హాష్ట్యాగ్ జతచేయడం గమనార్హం.
భక్తుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల నుంచి కొల్లం వరకు దక్షిణ మధ్య రైల్వే 36 ప్రత్యేక రైళ్లు నడపనుంది. సికింద్రాబాద్, కాకినాడ పోర్ట్, విజయవాడ, గుంటూరు, నర్సాపూర్ నుంచి ఈ రైళ్లు కొల్లంకు ఇరువైపులా రాకపోకలు సాగిస్తాయి. డిసెంబర్ 19 నుంచి జనవరి 24వ తేదీ వరకు వివిధ తేదీల్లో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి. రైళ్ల వివరాలను పైన ఫొటోలో చూడవచ్చు.
ప్రపంచ విజేతగా నిలిచిన భారత యువ చెస్ ప్లేయర్ గుకేశ్ దొమ్మరాజుకు వివిధ రంగాల ప్రముఖులు సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ శుభాకాంక్షలు తెలుపగా తాజాగా అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ‘కంగ్రాట్స్’ అంటూ ట్వీట్ చేశారు. 18 ఏళ్లకే 18వ వరల్డ్ ఛాంపియన్ అని గుకేశ్ చేసిన ట్వీట్కు మస్క్ రిప్లై ఇచ్చారు.
రైతు రుణాలపై ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి తనఖా లేకుండా ఇచ్చే <<14805545>>లోన్ లిమిట్ రూ.2 లక్షలకు<<>> పెంచగా జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి ఇది సహాయపడనుందని కేంద్రం పేర్కొంది.
హీరో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి ఫైరయ్యారు. ‘తెలంగాణకు చెందిన బిగ్గెస్ట్ స్టార్ అల్లు అర్జున్ భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్ అందించి రాష్ట్రానికి గొప్ప బహుమతి అందించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయన్ను జైలుకు పంపి బన్నీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది’ అని RGV ట్వీట్ చేశారు.
సైకిల్పై పక్కూరికి వెళ్లేందుకే కష్టమనుకునే వారున్న రోజుల్లో వరంగల్(TG)కి చెందిన రంజిత్ నాలుగేళ్లలో 41,400 KMS ప్రయాణించారు. తన తండ్రి 2020లో మరణించగా, ప్రపంచాన్ని చుట్టిరావాలనే ఆయన కలను తాను పూర్తిచేసేందుకు సిద్ధమయ్యారు. స్తోమత లేకపోవడంతో సైకిల్పైనే ఇప్పటివరకు 13 దేశాల్లో పర్యటించారు. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన AUSలో ఉండగా BGT మ్యాచుకు వెళ్లారు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న గబ్బా టెస్టులో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సందడి చేశారు. స్టాండ్స్లో నుంచి భారత ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ఆమె కనిపించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కాగా అమెరికాలో జరిగిన టీ20 వరల్డ్ కప్లో కూడా సారా సందడి చేసిన విషయం తెలిసిందే. భారత్ మ్యాచులు ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంటారు.
జైలు నుంచి ఇంటికి చేరుకున్న హీరో అల్లు అర్జున్ను పరామర్శించేందుకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు తరలివస్తున్నారు. ఈక్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. సాయంత్రం 4 గంటలకు డార్లింగ్ వస్తారని తెలిపాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, సుధీర్ బాబు తదితర నటీనటులు బన్నీ నివాసానికి వచ్చారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్లోనే జరుగుతుందని తెలుస్తోంది. దీనిపై ఇవాళ పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్వయంగా ప్రకటన చేస్తారని సమాచారం. అలాగే భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా జరుగుతాయని తెలుస్తోంది. ఇకపై చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచులన్నీ తటస్థ వేదికల్లో జరుగుతాయి. వచ్చే ఏడాది ఇండియాలో జరిగే వుమెన్స్ వరల్డ్ కప్లో కూడా దాయాదులు హైబ్రిడ్ పద్ధతిలోనే ఆడే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.