India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వెస్టిండీస్, ఐర్లాండ్తో భారత మహిళల జట్టు స్వదేశంలో టీ20, వన్డే సిరీస్లు ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ రిలీజ్ చేసింది. డిసెంబర్ 15 నుంచి 27 వరకు వెస్టిండీస్తో 3టీ20లు నవీ ముంబైలో, 3 వన్డేలు బరోడాలో జరగనున్నాయి. 2025 జనవరి 10 నుంచి ఐర్లాండ్తో రాజ్కోట్ వేదికగా మూడు వన్డేల సిరీస్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్లో సాంకేతిక లోపం తలెత్తింది. తాము లాగిన్ కాలేకపోతున్నామని, ఫొటోలు & వీడియోలు పోస్ట్ చేయలేకపోతున్నామని యూజర్లు ట్విటర్లో ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే, దీనిపై ఇన్స్టా యాజమాన్యం స్పందించలేదు. కొందరికి మాత్రమే ఇలాంటి సమస్య ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. మీకూ ఇలా జరిగిందా?
టీమ్ఇండియా యంగ్ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ సౌతాఫ్రికాతో మూడో టీ20లో అదరగొట్టారు. కేవలం 51 బంతుల్లో సెంచరీ చేసి ఔరా అనిపించారు. దీంతో క్రికెట్ అభిమానులు తిలక్ను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘వర్తు వర్మా.. వర్తు’ అంటూ ఆయన ప్రదర్శనను కొనియాడుతున్నారు. వర్మ సెంచరీతో టీమ్ఇండియా 219 రన్స్ చేయగలిగింది. ఈ కుర్రాడి బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
మార్వెల్ సినిమాల్లో గ్రూట్ పాత్ర ఎంతో మెప్పించిన విషయం తెలిసిందే. వీటిల్లో గ్రూట్ పలుమార్లు ‘అయామ్ గ్రూట్’ అనే పదాన్ని చెప్తుంటుంది. అయితే, దీనికి హాలీవుడ్ స్టార్ నటుడు విన్ డీజిల్ వాయిస్ అందించారు. కేవలం ‘అయామ్ గ్రూట్’ అనే పదాన్ని చెప్పినందుకు ఆయనకు $54 మిలియన్లు (రూ.450 కోట్లు) ఇచ్చినట్లు గతంలో వార్తలొచ్చాయి. కాగా, ఈ వార్తలను ఫిల్మ్ మేకర్ జేమ్స్ గన్ ఖండించారు.
AP: బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ తనతో భేటీ కావడంపై
సీఎం చంద్రబాబు స్పందించారు. రాష్ట్ర ప్రాముఖ్యతపై ఆమెతో చర్చించినట్లు వెల్లడించారు. భారత్-యూకే భాగస్వామ్యం బలోపేతం దిశగా సమాలోచనలు చేశామని, కీలక రంగాల్లో మెరుగైన సహకారం దిశగా మాట్లాడినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ కూడా సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.
మహేశ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న SSMB29 సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఎప్పటికప్పుడు కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీపికా పదుకొణె, ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్ను తీసుకున్నారంటూ గతంలో వార్తలు రాగా తాజాగా హాలీవుడ్ హీరోయిన్ నవోమీ స్కాట్ పేరు వినిపిస్తోంది. ది మార్షియన్, అల్లాదీన్, ఛార్లీస్ ఏంజెల్స్ వంటి పలు సినిమాల్లో ఆమె నటించారు.
సౌతాఫ్రికాతో మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 219/6 స్కోర్ చేసింది. తిలక్ వర్మ 107, అభిషేక్ శర్మ 50 పరుగులతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2, సిమెలనే 2 వికెట్లు తీయగా, జాన్సెన్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచులో గెలవాలంటే SA 20 ఓవర్లలో 220 రన్స్ చేయాలి.
TG: గ్రూప్-4 ఫలితాలను వెల్లడించేందుకు TGPSC కసరత్తు చేస్తోంది. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయంలోగా ఫలితాలను కమిషన్ ప్రకటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. కాగా నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు జరిగే ప్రజా విజయోత్సవాల్లో గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
TG: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేయబోయే ప్రత్యేక బస్సులకు టికెట్ ధరలను పెంచినట్లు TGSRTC ప్రకటించింది. HYDతో పాటు జిల్లా కేంద్రాల నుంచి నడిచే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది. మిగతా బస్సుల్లో సాధారణ ఛార్జీలే అమల్లో ఉంటాయని పేర్కొంది. స్పెషల్ బస్సుల వివరాల కోసం ప్రయాణికులు 040-69440000, 040-23450033 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.
సౌతాఫ్రికాతో మూడో టీ20లో భారత ఓపెనర్ సంజూ శాంసన్ డకౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో టీ20ల్లో ఒక్క ఇయర్లో 5సార్లు డకౌట్ అయిన తొలి ఇండియన్ ప్లేయర్గా శాంసన్ నిలిచారు. అయితే, T20Iలో వరుసగా రెండు సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్ కూడా ఈయనే. సంజూ ఆడిన చివరి నాలుగు మ్యాచుల్లో తొలి రెండింటిలో సెంచరీలు బాదగా.. చివరి రెండింట్లో డకౌటై పెవిలియన్ చేరారు. తిరిగి ఫామ్లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.