news

News September 8, 2024

9 కిలోల బంగారం సీజ్ చేసిన ఈడీ

image

బ్యాంక్ మోసానికి సంబంధించిన కేసులో ఓ ఇంట్లో సోదాలు చేస్తున్న ED అధికారులు కళ్లు చెదిరే బంగారం డంప్‌ను గుర్తించారు. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో వ్యాపారవేత్త స్వపన్ సాహా నివాసంలో ED సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో రూ.6.5 కోట్ల విలువైన 9 కిలోల బంగారాన్ని గుర్తించింది. దీనికి సంబంధించి సాహా సరైన పత్రాలను చూపకపోవడంతో సీజ్ చేసింది. తదుపరి విచారణ నిమిత్తం సాహాను ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉంది.

News September 8, 2024

చంపేస్తామంటూ బజరంగ్ పునియాకు బెదిరింపులు

image

కాంగ్రెస్ నేత, రెజ్లర్ బజరంగ్ పునియాను చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారు. ఓ ఫారిన్ నంబర్‌ నుంచి వాట్సాప్‌లో బెదిరింపు సందేశాలు వచ్చినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వినేశ్ ఫొగట్‌తో పాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం పునియాను ఆలిండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ఛైర్మన్‌గా ఆ పార్టీ నియమించింది.

News September 8, 2024

మరో 5 జిల్లాల్లో రేపు సెలవు

image

APలో మరో 5 జిల్లాల్లోని విద్యాసంస్థలకు కలెక్టర్లు రేపు సెలవు ప్రకటించారు. అతిభారీ వర్షాల దృష్ట్యా విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ప.గో, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు హాలిడే ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా విద్యాసంస్థలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఇప్పటికే విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో సెలవు ఇచ్చారు.

News September 8, 2024

ఎమ్మెల్యేల అనర్హతపై రేపు హైకోర్టు తీర్పు

image

TG: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు రేపు నిర్ణయం వెల్లడించనుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు సహా పలువురిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

News September 8, 2024

ఓకే తాలూకాలో 12 మంది మృతి.. అంతుబట్టని జ్వరమే కారణం!

image

గుజరాత్‌ కచ్ జిల్లాలోని లఖ్‌పత్ తాలూకాలో ఇటీవల 12 మంది మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపింది. భారీ వ‌ర్షాల త‌రువాత బాధితులకు వచ్చిన తీవ్ర‌మైన జ్వ‌రాన్ని వైద్యులు క‌చ్చితంగా అంచనా వేయలేకపోయారని, శ్వాస తీసుకోవ‌డంలో కూడా ఇబ్బందులు ప‌డ్డారని స్థానికులు చెబుతున్నారు. పాక్ స‌రిహ‌ద్దులో ఉండే ఈ తాలూకాలో స‌మ‌స్య‌ పరిష్కారానికి 22 వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి. న్యుమోనైటిస్‌గా భావిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.

News September 8, 2024

నా జీవితంలో రెండు బ్రేకప్స్ ఉన్నాయి: తమన్నా

image

టీనేజ్‌లో ఓ వ్యక్తిని ప్రేమించానని, అయితే అతని కోసం నచ్చిన జీవితాన్ని వదులుకోవడం ఇష్టం లేక విడిపోయినట్లు హీరోయిన్ తమన్నా తెలిపారు. ఆ తర్వాత రిలేషన్‌లో ఉన్న వ్యక్తి ప్రతిచిన్న విషయానికీ అబద్ధం చెప్పడం సహించలేకపోయానని చెప్పారు. అలాంటి వ్యక్తితో బంధాన్ని కొనసాగించడం ప్రమాదమని అర్థమై, అలా ఆ లవ్ స్టోరీ కూడా ముగిసిపోయిందన్నారు. ప్రస్తుతం నటుడు విజయ్ వర్మతో ఈ అమ్మడు రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

News September 8, 2024

వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు.. బ్రిజ్ భూష‌ణ్‌కు బీజేపీ హుకుం

image

కాంగ్రెస్‌లో చేరిన రెజ్లర్లు వినేశ్ ఫొగ‌ట్‌, బ‌జ‌రంగ్ పునియాను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్ద‌ని WFI మాజీ అధ్య‌క్షుడు బ్రిజ్ భూష‌ణ్‌ను BJP ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది. రెజ్లర్లపై వేధింపుల ఆరోపణల వెన‌క కాంగ్రెస్ కుట్ర ఉంద‌ని, దీనికి హరియాణా EX CM భూపిందర్ సింగ్ హుడా పథక రచన చేశారని బ్రిజ్ భూషణ్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వినేశ్, బజరంగ్‌పై వ్యాఖ్య‌లు మానుకోవాల‌ని BJP ఆదేశించడం గ‌మ‌నార్హం.

News September 8, 2024

‘ఎమ‌ర్జెన్సీ’కి U/A స‌ర్టిఫికెట్‌.. కొన్ని సీన్లు కట్ చేయాలని ఆదేశం

image

బాలీవుడ్ న‌టి కంగ‌న న‌టించిన ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎట్ట‌కేల‌కు స‌ర్టిఫికెట్ జారీ చేసింది. సిక్కు వ‌ర్గాల నుంచి ఈ చిత్రానికి పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త రావ‌డంతో గతంలో బోర్డు స‌ర్టిఫికెట్ జారీని నిలిపేసింది. దీంతో ఈ నెల 6న విడుద‌ల కావాల్సిన చిత్రం వాయిదా ప‌డింది. తాజాగా U/A స‌ర్టిఫికెట్ ఇచ్చిన బోర్డు కొన్ని సీన్లు డిలీట్ చేసి, డిస్‌క్లెయిమర్స్ యాడ్ చేయాలని ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది.

News September 8, 2024

భారీ వర్షాలు.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

image

ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాలువలు, చెరువులు, డ్రెయిన్లకు గండ్లు పడకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆహారం, తాగునీరు, వైద్యశిబిరాలు ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలన్నారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. జిల్లా స్థాయిలో చేస్తున్న పనులకు తక్షణం నిధులు విడుదల చేస్తామని తెలిపారు.

News September 8, 2024

మీకు తెలుసా: పాస్‌పోర్టుకు 4వేల ఏళ్ల చరిత్ర!

image

పరాయి దేశం వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌పోర్టు ఉండాల్సిందే. ఇప్పుడేే కాదు 4వేల ఏళ్లకు పూర్వమే ఇలాంటి విధానం ఉంది. క్రీస్తుపూర్వం 2వేల ఏళ్లనాటికి చెందిన మెసపొటేమియావాసులు దేశం దాటేందుకు మట్టి పలకల రూపంలో గుర్తింపు కార్డుల్ని తీసుకెళ్లేవారని తవ్వకాల్లో వెల్లడైంది. పురాతన ఈజిప్టు, భారత నాగరికతల్లో లేఖల్ని తీసుకెళ్లేవారు. ఇక ఆధునిక పాస్‌పోర్టుల ప్రస్థానం మాత్రం మొదటి ప్రపంచయుద్ధం సమయంలో మొదలైంది.