India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్పై తెలంగాణ హైకోర్టు రేపు నిర్ణయం వెల్లడించనుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు సహా పలువురిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
గుజరాత్ కచ్ జిల్లాలోని లఖ్పత్ తాలూకాలో ఇటీవల 12 మంది మృతి చెందడం కలకలం రేపింది. భారీ వర్షాల తరువాత బాధితులకు వచ్చిన తీవ్రమైన జ్వరాన్ని వైద్యులు కచ్చితంగా అంచనా వేయలేకపోయారని, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు పడ్డారని స్థానికులు చెబుతున్నారు. పాక్ సరిహద్దులో ఉండే ఈ తాలూకాలో సమస్య పరిష్కారానికి 22 వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి. న్యుమోనైటిస్గా భావిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.
టీనేజ్లో ఓ వ్యక్తిని ప్రేమించానని, అయితే అతని కోసం నచ్చిన జీవితాన్ని వదులుకోవడం ఇష్టం లేక విడిపోయినట్లు హీరోయిన్ తమన్నా తెలిపారు. ఆ తర్వాత రిలేషన్లో ఉన్న వ్యక్తి ప్రతిచిన్న విషయానికీ అబద్ధం చెప్పడం సహించలేకపోయానని చెప్పారు. అలాంటి వ్యక్తితో బంధాన్ని కొనసాగించడం ప్రమాదమని అర్థమై, అలా ఆ లవ్ స్టోరీ కూడా ముగిసిపోయిందన్నారు. ప్రస్తుతం నటుడు విజయ్ వర్మతో ఈ అమ్మడు రిలేషన్షిప్లో ఉన్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్లో చేరిన రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియాను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని WFI మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ను BJP ఆదేశించినట్టు తెలుస్తోంది. రెజ్లర్లపై వేధింపుల ఆరోపణల వెనక కాంగ్రెస్ కుట్ర ఉందని, దీనికి హరియాణా EX CM భూపిందర్ సింగ్ హుడా పథక రచన చేశారని బ్రిజ్ భూషణ్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వినేశ్, బజరంగ్పై వ్యాఖ్యలు మానుకోవాలని BJP ఆదేశించడం గమనార్హం.
బాలీవుడ్ నటి కంగన నటించిన ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎట్టకేలకు సర్టిఫికెట్ జారీ చేసింది. సిక్కు వర్గాల నుంచి ఈ చిత్రానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో గతంలో బోర్డు సర్టిఫికెట్ జారీని నిలిపేసింది. దీంతో ఈ నెల 6న విడుదల కావాల్సిన చిత్రం వాయిదా పడింది. తాజాగా U/A సర్టిఫికెట్ ఇచ్చిన బోర్డు కొన్ని సీన్లు డిలీట్ చేసి, డిస్క్లెయిమర్స్ యాడ్ చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.
ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాలువలు, చెరువులు, డ్రెయిన్లకు గండ్లు పడకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆహారం, తాగునీరు, వైద్యశిబిరాలు ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలన్నారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. జిల్లా స్థాయిలో చేస్తున్న పనులకు తక్షణం నిధులు విడుదల చేస్తామని తెలిపారు.
పరాయి దేశం వెళ్లాలంటే కచ్చితంగా పాస్పోర్టు ఉండాల్సిందే. ఇప్పుడేే కాదు 4వేల ఏళ్లకు పూర్వమే ఇలాంటి విధానం ఉంది. క్రీస్తుపూర్వం 2వేల ఏళ్లనాటికి చెందిన మెసపొటేమియావాసులు దేశం దాటేందుకు మట్టి పలకల రూపంలో గుర్తింపు కార్డుల్ని తీసుకెళ్లేవారని తవ్వకాల్లో వెల్లడైంది. పురాతన ఈజిప్టు, భారత నాగరికతల్లో లేఖల్ని తీసుకెళ్లేవారు. ఇక ఆధునిక పాస్పోర్టుల ప్రస్థానం మాత్రం మొదటి ప్రపంచయుద్ధం సమయంలో మొదలైంది.
అమెరికా రక్షణ కార్యాలయంలో పనిచేసిన లూయిస్ ఎలిజోండో అనే అధికారి సంచలన ప్రకటన చేశారు. తమకు చిక్కిన గ్రహాంతరవాసులు, వారి నౌకపై అమెరికా అధ్యయనం చేసిందని వెల్లడించారు. ‘గ్రహాంతరవాసులు, వారి వాహనాలపై అమెరికా పరిశోధనలు జరిపింది. వాటి ఉనికి గురించి దశాబ్దాల క్రితమే తెలిసినా రహస్యంగా ఉంచుతోంది. విశ్వంలో మనం ఒంటరి కాదు’ అని పేర్కొన్నారు. కాగా.. లూయిస్ ఆరోపణలు నిరాధారమైనవంటూ అమెరికా ఖండించింది.
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే తారక్, మహేశ్ను ఒకే వేదికపై చూసే ఛాన్స్ కలుగుతుందని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఈ నెల 10న దేవర ట్రైలర్ను ముంబైలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
APలో భారీ వర్షాలు, విజయవాడలో బుడమేరుతో సంభవించిన వరద పరిస్థితులను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి CM చంద్రబాబు వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు రేయింబవళ్లు అధికార యంత్రాంగం పనిచేసిందని, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలను తెలియజేశారు. వరద వల్ల భారీ నష్టం జరిగిందని గవర్నర్కు చెప్పారు. అటు త్వరలోనే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.