news

News November 15, 2024

IPL ఆక్షనీర్‌గా మల్లికా సాగర్?

image

ఐపీఎల్ 2025 మెగా వేలం నిర్వాహకురాలిగా మరోసారి మల్లికా సాగర్ వ్యవహరిస్తారని తెలుస్తోంది. 2023 వేలం కూడా ఆమెనే నిర్వహించారు. ఐపీఎల్ చరిత్రలోనే వేలం ప్రక్రియను పూర్తి చేసిన తొలి మహిళగా మల్లికకు రికార్డు ఉంది. గత వేలంలో ఆమె నిర్వహించిన ప్రత్యేక విధానానికి ప్రశంసలు రావడంతో మళ్లీ ఆమెనే ఎంపిక చేసినట్లు టాక్. కాగా WPL వేలం నిర్వాహకురాలిగా కూడా ఆమె వ్యవహరించారు. ఈ నెల 24న జెడ్డాలో ఐపీఎల్ వేలం జరగనుంది.

News November 15, 2024

రూ.50 కోట్ల క్లబ్‌లోకి ‘క’

image

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ మూవీ రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లు మేకర్స్ తెలిపారు. వరల్డ్ వైడ్‌గా తెలుగులోనే రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టినట్లు ప్రకటించారు. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన మూవీగా నిలిచింది. కాగా ఈ సినిమాను మలయాళంలో కూడా విడుదల చేస్తున్నారు. దీనిని మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్నారు.

News November 15, 2024

శ్రద్ధా వాకర్ హత్య: అఫ్తాబ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ ‘స్కెచ్’

image

రెండేళ్ల క్రితం దేశంలో సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. MH మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య కేసులో పట్టుబడ్డ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు శివకుమార్ ఈ విషయం చెప్పినట్లు ముంబై పోలీసులు తెలిపారు. పూనావాలాకు భద్రత పెంచడంతో ఆ నిర్ణయాన్ని గ్యాంగ్ విరమించుకున్నట్లు చెప్పారు. శ్రద్ధను పూనావాలా చంపి 35 ముక్కలు చేసిన విషయం తెలిసిందే.

News November 15, 2024

16,347 ఉద్యోగాలు.. నిరుద్యోగులకు శుభవార్త

image

AP: 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలో DSC నోటిఫికేషన్ విడుదల కానుంది. వెనుకబడిన వర్గాల వారికి <<14588103>>ఆన్‌లైన్‌లో <<>>ఉచిత DSC కోచింగ్ ఇస్తామని మంత్రి సవిత వెల్లడించారు. త్వరలోనే ప్రత్యేక వెబ్‌సైటు రూపొందించి, నిపుణులతో క్లాసులు నిర్వహించి, క్వశ్చన్ పేపర్లు, మోడల్ పేపర్లు అందుబాటులో ఉంచుతామన్నారు. బీఈడీ అర్హతతో పాటు టెట్‌లో అర్హత సాధించిన వారు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌కు అర్హులని మంత్రి తెలిపారు.

News November 15, 2024

నిర్మలతో ముగిసిన చంద్రబాబు భేటీ

image

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఢిల్లీలోని నిర్మల నివాసంలో వీరిద్దరూ దాదాపు గంటసేపు పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే చర్చ కొనసాగినట్లు సమాచారం. మరోవైపు ఇతర కేంద్ర మంత్రులనూ చంద్రబాబు కలుస్తారని వార్తలు వస్తున్నాయి.

News November 15, 2024

భారత ఆర్థిక వ్యవస్థ భేష్: మూడీస్

image

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని మూడీస్ సంస్థ ప్రశంసించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో దేశం 7.2 వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేసింది. 2025లో 6.6 శాతం, 2026లో 6.5శాతం వృద్ధి ఉంటుందని పేర్కొంది. ఆర్థికంగా దేశం చక్కటి దశలో ఉందని అభిప్రాయపడింది. అయితే, ప్రపంచ రాజకీయ పరిస్థితులు, వాతావరణ ఇబ్బందులు వెరసి మాంద్యం భయాల కారణంగా RBI కఠినతరమైన విధానాల్నే కొనసాగించొచ్చని అంచనా వేసింది.

News November 15, 2024

దీపావళి విందులో మద్యం, మాంసం: క్షమాపణ చెప్పిన బ్రిటన్ ప్రధాని ఆఫీస్

image

దీపావళి వేడుకల్లో <<14574659>>మద్యం, మాంసం<<>> వడ్డించడంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆఫీస్ క్షమాపణ చెప్పింది. పొరపాటు జరిగిందని మరోసారి ఇలా కాకుండా చూస్తామంది. కొన్నేళ్లుగా UK PM దీపావళి వేడుకలకు ఆతిథ్యమివ్వడం ఆనవాయితీగా వస్తోంది. భారతీయ నృత్య ప్రదర్శనలు, దీపాలు వెలిగించడం, ఇతర కార్యక్రమాల తర్వాత వెజిటేరియన్ విందు ఉంటుంది. ఈసారి మద్యం, మాంసం వడ్డించడంతో విమర్శలొచ్చాయి. దీనిపై పీఎం ఆఫీస్ స్పందించింది.

News November 15, 2024

హీరో విడాకుల కేసు.. కోర్టు ఏమందంటే?

image

హీరో జయం రవి, ఆర్తి విడాకుల కేసుపై చెన్నై కోర్టులో విచారణ జరిగింది. రవి నేరుగా కోర్టుకు రాగా ఆర్తి వర్చువల్‌గా హాజరయ్యారు. ఇరువురి లాయర్ల వాదనలు విన్న న్యాయస్థానం మరోసారి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని చెప్పింది. రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని సూచించింది. విడిపోవడమే సబబు అనుకుంటే కచ్చితమైన కారణాన్ని తెలియజేయాలని పేర్కొంది. కాగా 2009లో పెళ్లి చేసుకున్న రవి, ఆర్తికి ఇద్దరు పిల్లలున్నారు.

News November 15, 2024

ఐఏఎఫ్ విమానంలో ఢిల్లీకి మోదీ

image

ఝార్ఖండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాని మోదీ శుక్ర‌వారం ఐఏఎఫ్ విమానంలో ఢిల్లీకి తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. ముందుగా ఆయ‌న ప్ర‌యాణించాల్సిన విమానంలో <<14619050>>సాంకేతిక లోపం<<>> తలెత్తింది. దీంతో ఆయన దేవ్‌ఘర్ విమానాశ్ర‌యంలో వేచిచూడాల్సి వచ్చింది. కొంత స‌మ‌యం త‌రువాత కూడా స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోవ‌డంతో చివరికి ఐఏఎఫ్ విమానంలో ఢిల్లీకి బ‌య‌లుదేరారు. మోదీ విమానంలో సమస్య కారణంగా ఇతర విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ ఆలస్యమైంది.

News November 15, 2024

మీలాంటి బాస్‌ల వల్లే ఉద్యోగులు చస్తున్నారు: నారాయణ మూర్తిపై నెటిజన్ల ఫైర్

image

భారత్‌లో వారానికి 5 రోజుల పని విధానం నిరాశపరిచిందని, వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను తాను నమ్మనని పేర్కొన్న ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆయనలాంటి వారివల్లే వర్క్ ప్లేసెస్ టాక్సిక్ అవుతున్నాయని అంటున్నారు. ఈవై కంపెనీలో వీకాఫ్ లేకుండా కొన్నినెలలు రోజుకు 14 గంటలు పనిచేస్తూ ఉద్యోగి మరణించడాన్ని గుర్తుచేస్తున్నారు. అలాంటి చావులకు ఇలాంటి బాస్‌లే కారణం అంటున్నారు. మీ కామెంట్.