India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. అదే కేసులో ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇటీవల కవితను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే ఈడీ కేసులో ఆమె తిహార్ జైలులో ఉన్నారు.

కుబేరుడు ఎలాన్ మస్క్ ఇండియాలో పర్యటించనున్న నేపథ్యంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానిస్తూ ట్వీట్ చేశారు. దేశంలోనే యంగెస్ట్ స్టేట్ అయిన తెలంగాణ మీకు స్వాగతం పలుకుతోందని పేర్కొన్నారు. దేశంలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్ స్థాపనపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు. మస్క్ టెస్లా ప్లాంట్ కోసం $2 బిలియన్ల పెట్టుబడి పెట్టనున్న నేపథ్యంలో.. దీనికి తెలంగాణ అనువైన ప్రదేశమని మంత్రి సూచించారు.

యూపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లుగా నిర్ధారిస్తూ అన్ని స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చింది. 2024 ఏప్రిల్ 1 వరకు ఆరేళ్లు నిండినవారిని అర్హులుగా పరిగణించాలని పేర్కొంది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆరేళ్ల కన్నా తక్కువ వయసు గల పిల్లలు కిండర్గార్టెన్(ప్రీ స్కూల్)లో చేరాలని సూచించింది.

ఛత్తీస్గఢ్ నటుడు సూరజ్ మెహర్(40) మరణించారు. నిన్న సాయంత్రం ఆయన ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషాదం ఏమిటంటే నిన్న రాత్రి సూరజ్ ఎంగేజ్మెంట్ జరగాల్సి ఉంది. ‘ఆఖ్రి ఫైస్లా’ సినిమా షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆయన సహచరుడు, డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. సూరజ్ విలన్ పాత్రలతో గుర్తింపు పొందారు.

AP: రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో YCP తమ అభ్యర్థులను మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైలవరం-జోగి రమేశ్, విజయవాడ వెస్ట్-పోతిన మహేశ్, గుంటూరు2- కిలారు రోశయ్య, గుంటూరు ఎంపీ-విడదల రజినీ, కర్నూలు ఎంపీ-KE ప్రభాకర్, పి.గన్నవరం-పాముల రాజేశ్వరి, అవనిగడ్డ-సింహాద్రి చంద్రశేఖర్, చిలకలూరిపేట-మర్రి రాజశేఖర్, రాయచోటి-రెడ్డప్పగారి రమేశ్ రెడ్డికి సీట్లు కేటాయిస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

గుజరాత్లో ప్రతి సంవత్సరం దసరాతో పాటు ఇతర పండగల సందర్భంగా మత మార్పిడులు జరుగుతుంటాయి. ఎక్కువగా దళితులు బౌద్ధత్వంలోకి మారుతుంటారు. అయితే ఈ విషయానికి సంబంధించి గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ధిజం కూడా ఒక మతమేనని, అందులో చేరాలంటే గుజరాత్ మత స్వేచ్ఛా చట్టం 2003 ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సర్క్యులర్ విడుదల చేసింది.

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆయన తమ్ముడు ఎంపీ డీకే సురేశ్తో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. బెంగళూరులో వీరిద్దరితో ఆమె ఎన్నికల ప్రచారంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రచారం చేయాలని వారిని కోరినట్లు సమాచారం. కాగా ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే 10 మంది కర్ణాటక నేతలతో కూడిన జాబితా తయారైనట్లు టాక్. ఆ జాబితాలో వీరిద్దరూ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

బొలీవియాలోని ఓ న్యూస్ ఛానల్ సిబ్బందికి ఓ కుక్కపిల్ల షాకిచ్చింది. జంతువుల దత్తతను ప్రోత్సహించడానికి ఒక వీధి కుక్కపిల్లను లైవ్ న్యూస్ ప్రోగ్రామ్లోకి తీసుకొచ్చారు. న్యూస్ యాంకర్ ఆ కుక్కపిల్లను తడుముతూ మాట్లాడుతుండగా.. అది డెస్క్పైనే మల విసర్జన చేసింది. దీంతో ప్రోగ్రామ్లో ఉన్నవారంతా అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను న్యూయార్క్ పోస్ట్ వెబ్సైట్లో పంచుకుంది.

యూజర్లకు ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ హెచ్చరికలు జారీ చేసింది. ‘మెర్సెనరీ స్పైవేర్’ ద్వారా సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. భారత్తో సహా 91 దేశాల యూజర్లకు ఈ ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. గత ఏడాది రాజకీయ ప్రతినిధులకు సైబర్ దాడులు పొంచి ఉన్నాయని యాపిల్ పంపిన వార్నింగ్ నోటిఫికేషన్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

AP: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ‘బాధ్యత కలిగిన నాయకులు బియ్యం, పప్పు, ఉప్పు, వంటనూనెల ధరలు తగ్గిస్తామని హామీలివ్వడం చూశాం. కానీ చంద్రబాబు స్టైలే వేరు కదా! మద్యం ధరలు తగ్గిస్తానని ముసిముసిగా నవ్వుతున్నాడు. ఆయన దృష్టిలో సంపద సృష్టి అంటే ఇదేనేమో!’ అని అన్నారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.