news

News March 30, 2024

ఎన్నికల తర్వాతే డీఎస్సీ, టెట్ ఫలితాలు: ఈసీ

image

AP: ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించొద్దన్న కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోడ్ ముగిసే వరకు డీఎస్సీ పరీక్ష, టెట్ ఫలితాలు వాయిదా వేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. దీంతో లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్ష ఎలక్షన్ తర్వాతే జరిగే అవకాశం ఉంది.

News March 30, 2024

KCR పర్యటన షెడ్యూల్ ఇదే..

image

ఎండిన పంటలను పరిశీలించేందుకు BRS అధినేత KCR రేపట్నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఉ.8:30గంటలకు ఎర్రవల్లి నుంచి బయలుదేరుతారు. 10:30కు ధ‌రావ‌త్ తండాకు(జ‌న‌గామ), 11:30కి తుంగ‌తుర్తి, అర్వ‌ప‌ల్లి, సూర్యాపేట రూర‌ల్ మండ‌లాలు(సూర్యాపేట), మ.2గంటలకు సూర్యాపేట MLA ఆఫీసులో భోజనం, 3గంట‌ల‌కు ప్రెస్ కాన్ఫ‌రెన్స్, సా.4:30లకు నిడ‌మ‌నూరు మండ‌లం, సా.6గంటలకు ఎర్ర‌వల్లికి బ‌య‌ల్దేర‌తారు.

News March 30, 2024

పార్టీలో చేర్చుకోలేదని ఏదేదో మాట్లాడుతున్నారు: కోమటిరెడ్డి

image

TG: కాంగ్రెస్‌లో తాను ఏక్‌నాథ్ షిండే అవుతానంటూ BJP MLA మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌంటరిచ్చారు. ‘నాపై ఆయన చేసిన వ్యాఖ్యలు సత్యదూరమైనవి. మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌లో చేరతానని ఆయనే అడిగారు. మాకు మెజార్టీ ఉంది కాబట్టి అవసరం లేదని చెప్పా. పార్టీలో చేర్చుకోలేదని ఏదేదో మాట్లాడుతున్నారు. అమిత్ షా, గడ్కరీ వద్దకు వెళ్లి ఏదో చెప్పానని అంటున్నారు’ అని మండిపడ్డారు.

News March 30, 2024

సివిల్స్‌లో ఫెయిల్.. కానీ IAS అయ్యారు!

image

క్లిష్టమైన పరీక్షల్లో సివిల్స్ ఒకటి. ఈ పరీక్షలో ఫెయిల్ అయినా.. IAS అయిన కేరళకు చెందిన అబ్దుల్ నాసర్ గురించి మీకు తెలుసా? ఆయన 5 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయి అనాథాశ్రమంలో పెరిగారు. ఎన్నో సవాళ్ల నడుమ పీజీ పూర్తి చేశారు. 1994లో ఆరోగ్యశాఖలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఆయన.. వృత్తిపరంగా కనబర్చిన నిబద్ధత, కృషికి గాను 2006 నాటికి డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. 2017లో IAS హోదా పొంది తన కలను నెరవేర్చుకున్నారు.

News March 30, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అధికారుల సస్పెండ్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు పోలీస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో వీరిద్దరూ 48 గంటలపాటు జైలులో ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News March 30, 2024

రూ.10వేలు లంచం తీసుకుంటూ దొరికిన SI

image

ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత లంచగొండుల గురించి ఫిర్యాదు చేసేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తోన్న ఎస్సై సైదులు లంచం తీసుకుంటుండగా ACB అధికారులు పట్టుకున్నారు. ఓ రియల్టర్‌పై నమోదైన కంప్లైంట్‌ను ఉపసంహరించుకునేందుకు సైదులు రూ.10వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు.

News March 30, 2024

BIG BREAKING: వాలంటీర్లపై సీఈసీ ఆంక్షలు

image

AP: కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయించొద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలను స్వాధీనం చేసుకోవాలని సూచించింది. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది.

News March 30, 2024

10 ఫీట్ ఎత్తు అస్థిపంజరాలపై పరిశోధనలు

image

USలో పూర్వం సంచరించిన భారీ మనుషుల అస్థిపంజరాలపై సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. 1912-1924 మధ్య కాలంలో నెవాడాలో మైనింగ్ చేస్తుండగా 8 నుంచి 10 అడుగుల ఎత్తు మమ్మీలు బయటపడ్డాయి. ఈజిప్టులో మాదిరిగానే మమ్మిఫికేషన్ చేశారు. Si-Te-Cah అని పిలిచే ఈ నరమాంస భక్షకులు 15 అంగుళాల చెప్పులు, ఒక ముద్ర కలిగిన పెద్ద బండరాయిని ధరించేవారట. వీరు నివసించిన ప్రాంతంలోనే Paiute తెగ జీవించిందని గుర్తించారు.

News March 30, 2024

కేజ్రీవాల్ భార్యను కలిసిన సోరెన్ సతీమణి

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతను ఝార్ఖండ్ మాజీ CM హేమంత్ సోరెన్ భార్య కల్పన కలిశారు. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో సునీతకు తన సానుభూతిని తెలిపారు. ఇటీవల మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత స్పందించిన కల్పన.. సునీత బాధను తాను అర్థం చేసుకోగలనంటూ మద్దతుగా నిలిచారు.

News March 30, 2024

పవన్ ‘వారాహి సభ’కు అనుమతి నిరాకరణ

image

AP: జనసేనాని పవన్ కళ్యాణ్‌‌కు పిఠాపురం పోలీసులు షాక్ ఇచ్చారు. ‘వారాహి’ సభకు అనుమతి నిరాకరించారు. వారాహి వాహనంపై నిల్చొని మాట్లాడొద్దని సూచించారు. నిర్ణీత సమయంలో వాహనం కోసం దరఖాస్తు చేసుకోనందుకే అనుమతి ఇవ్వడంలేదని తెలిపారు. చిన్నపాటి వాహనానికి అనుమతించారు. కాగా పోలీసుల తీరుపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.