News November 17, 2024

వచ్చే వారం ‘RC16’ షురూ?

image

బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంటగా నటించనున్న ‘RC16’ మూవీ షూటింగ్ వచ్చే వారం ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందుకోసం మైసూర్‌లో భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని మూవీ వర్గాలు వెల్లడించాయి. క్రీడా నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో నిండిన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు టాక్. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

News November 17, 2024

కులగణన.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

image

TG: సమగ్ర కులగణనలో సేకరించిన వివరాలను అత్యంత భద్రంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ సర్వేలో సేకరించిన డేటాను ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో ఎంట్రీ చేస్తారు. ఆ డేటా ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై బీసీ డెడికేటెడ్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

News November 17, 2024

కొడాలి నానిపై కేసు నమోదు

image

AP: మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖ థర్డ్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన చంద్రబాబు, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు, సోషల్ మీడియా శ్రేణులపై కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.

News November 17, 2024

తండ్రి మృతి.. నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్

image

తన తండ్రి రామ్మూర్తినాయుడు మృతిచెందడంపై సినీ హీరో నారా రోహిత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘నాన్న మీరొక ఫైటర్. మాకోసం ఎన్నో త్యాగాలు చేశారు. ప్రజలను ప్రేమించడం, మంచి కోసం పోరాడటం నేర్పారు. మీతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని జీవితమంతా గుర్తుంచుకుంటాను. ఇంతకంటే ఇంకేం చెప్పాలో తెలియట్లేదు. బై నాన్న’ అని ట్వీట్ చేశారు.

News November 17, 2024

లగచర్ల ఘటనలో రిమాండ్‌కు మరో నలుగురు.. కలెక్టర్‌కు భద్రత పెంపు

image

TG: వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో ఇప్పటివరకు రిమాండ్ అయిన వారి సంఖ్య 25కు చేరింది. నిన్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేయగా, కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు హోంశాఖ భద్రతను పెంచింది. 1+1 భద్రతను 2+2కి మార్చింది. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న శాంతిభద్రతల అదనపు డీజీ జిల్లా కలెక్టర్‌ను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.

News November 17, 2024

నేడు రామ్మూర్తి అంత్యక్రియలు.. హాజరుకానున్న చంద్రబాబు

image

AP: మాజీ ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు ఇవాళ తిరుపతి జిల్లా నారావారిపల్లెలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, లోకేశ్, నందమూరి కుటుంబసభ్యులు హాజరుకానున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గుండెసంబంధ సమస్యలతో చికిత్స పొందుతూ రామ్మూర్తి నిన్న మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే.

News November 17, 2024

రాష్ట్ర పండుగగా కనకదాసు జయంతి

image

AP: తన కీర్తనల ద్వారా సమాజంలోని అసమానతల్ని రూపుమాపేందుకు కృషి చేసిన కనకదాసు జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రేపు ఆయన 537వ జయంతి నిర్వహణకు ఉత్తర్వులిచ్చింది. రాష్ట స్థాయిలో అనంతపురంలో, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లోనూ ఘనంగా వేడుక నిర్వహించాలని ఆదేశించింది. ఈయన కన్నడలో నలచరిత్ర, హరిభక్తిసార, నృసింహస్తవ, రామధ్యాన చరిత్రే, మోహన తరంగిణి అనే రచనలు చేశారు.

News November 17, 2024

ఈనెల 20న వేములవాడకు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 20న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న అనంతరం రాజన్న ఆలయ గుడి చెరువు మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వేములవాడ ఆలయం, జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా సీఎం పర్యటన ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కాగా ఎల్లుండి వరంగల్‌లో సీఎం పర్యటించనున్నారు.

News November 17, 2024

ఆ రెండింటికి తేడా తెలియకుండానే ఐదేళ్లు పాలించారు: హోంమంత్రి

image

AP: YCP హయాంలో మహిళల అక్రమ రవాణా జరగలేదని <<14629630>>రోజా చేసిన ట్వీట్‌పై<<>> హోంమంత్రి అనిత స్పందించారు. ‘వ్యక్తిగత, మానసిక కారణాలతో కనపడకుండా పోతే అది మిస్సింగ్. ఉచ్చువేసి క్రయవిక్రయాలు జరిపి కనిపించకుండా మాయం చేస్తే అది హ్యుమన్ ట్రాఫికింగ్. ఈ రెండింటికి తేడా తెలియకుండానే గత ఐదేళ్లు పాలించారు. అవినీతి తప్ప ప్రజాక్షేమం ఏమాత్రం పట్టని ఇలాంటి వారు పరిపాలించడం ప్రజల పాలిట దౌర్భాగ్యం’ అని ట్వీట్ చేశారు.

News November 17, 2024

నేడు, రేపు గ్రూప్-3 పరీక్షలు.. సూచనలివే!

image

TG: ఇవాళ, రేపు గ్రూప్-3 పరీక్షలు జరగనుండగా, అభ్యర్థులకు TGPSC పలు సూచనలు చేసింది.
➤ఒరిజినల్ ఐడీతో పరీక్షకు రావాలి.
➤ఎగ్జామ్‌కు గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
➤ఉ.9.30 తర్వాత, మ.2.30 తర్వాత పరీక్షకు అనుమతించరు.
➤అభ్యర్థులు పేపర్-1కు తీసుకొచ్చిన హాల్ టికెట్‌నే మిగతా పేపర్లకు తీసుకురావాలి.
➤నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ హాల్‌టికెట్, ప్రశ్న పత్రాల్ని భద్రంగా పెట్టుకోవాలి.