News February 9, 2025

మెక్సికోలో ఘోర ప్రమాదం.. 41మంది మృతి

image

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 48మందితో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో 38మంది ప్రయాణికులు, ముగ్గురు డ్రైవర్లు అక్కడికక్కడే కన్నుమూశారు. ప్రమాదం అనంతరం బస్సులో మంటలు వ్యాపించి పూర్తిగా తగులబడింది. ప్రస్తుతానికి 18 పుర్రెలు సేకరించామని, మిగతా మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.

News February 9, 2025

వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌కు పోలీసుల నోటీసులు

image

AP: తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటీవల ఆఫీస్(జగన్ నివాసం కూడా అదే) వద్ద అగ్నిప్రమాదం జరగగా అక్కడి CC ఫుటేజీ ఇవ్వాలని పేర్కొన్నారు. ఘటనలో కుట్ర కోణం ఉందని అనుమానిస్తున్న పోలీసులు దర్యాప్తుకు ఫుటేజీ కీలకమని భావిస్తున్నారు. అటు అగ్ని ప్రమాదం నేపథ్యంలో జగన్ భద్రతపై YCP ఆందోళన వ్యక్తం చేయగా, వాళ్లే తగలబెట్టుకొని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని TDP మండిపడింది.

News February 9, 2025

‘తండేల్’ మూవీ కలెక్షన్ల సునామీ

image

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన ‘తండేల్’ సినిమా పాజిటివ్ టాక్‌తో భారీ కలెక్షన్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రెండ్రోజుల్లో ఈ సినిమాకు రూ.41.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘బ్లాక్‌బస్టర్ లవ్ సునామీ’ అంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. చైతూ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ సినిమాగా నిలిచే అవకాశం ఉండగా, ఇవాళ సెలవు కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

News February 9, 2025

మోదీ తిరిగి వచ్చాకే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం!

image

27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం దక్కించుకున్న BJP సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించాలని భావిస్తోంది. అయితే ఈ వేడుక PM మోదీ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాకే ఉండనుంది. రేపు పారిస్‌ వెళ్లనున్న మోదీ అక్కడ జరిగే AI సదస్సులో పాల్గొంటారు. అనంతరం 12, 13న USలో పర్యటిస్తారు. అమెరికా నుంచి ఆయన తిరిగి రాగానే 13 తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించేందుకు BJP ప్లాన్ చేస్తోంది.

News February 9, 2025

అలా జరిగితే కేజ్రీవాల్ గెలిచేవారు!

image

న్యూఢిల్లీ నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్ ఓటమికి DL మాజీ CM షీలా దీక్షిత్ కొడుకు సందీప్ పరోక్షంగా కారణమయ్యారు. INC తరఫున పోటీ చేసిన ఆయనకు 4,568 ఓట్లు వచ్చాయి. గెలిచిన BJP అభ్యర్థి పర్వేశ్ వర్మ, కేజ్రీకి మధ్య ఓట్ల తేడా 4,089 కావడం గమనార్హం. దీంతో ఈ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే కేజ్రీవాల్ గట్టెక్కేవారని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా 2013లో న్యూఢిల్లీలోనే షీలాను కేజ్రీవాల్ ఓడించారు.

News February 9, 2025

సీఎం పదవికి ఆతిశీ రాజీనామా

image

ఢిల్లీ సీఎం పదవికి ఆతిశీ మార్లేనా రిజైన్ చేశారు. రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అందజేశారు. కాగా నిన్న వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో ఆప్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. మొత్తం 70 సీట్లలో బీజేపీ 48 స్థానాలు గెలుచుకొని అధికారం చేపట్టింది.

News February 9, 2025

సా.5 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు సాయంత్రం 5 గంటలకు కీలక సమావేశం కానున్నారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీకి ఆ పార్టీ ముఖ్య నేతలు బీఎల్ సంతోష్, బైజయంత్ పాండా హాజరుకానున్నారు. కొత్త ఎమ్మెల్యేలకు వారు దిశానిర్దేశం చేయనున్నారు. అటు సీఎం అభ్యర్థిపైనా చర్చించే అవకాశం ఉంది.

News February 9, 2025

భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మృతి

image

ఛత్తీస్‌గఢ్ అడవులు తుపాకుల మోతలతో మళ్లీ దద్దరిల్లాయి. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కులో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన భీకర కాల్పుల్లోనూ పదుల సంఖ్యలో మావోలు మరణించిన విషయం తెలిసిందే.

News February 9, 2025

మీరు టీచర్ అయ్యారా?

image

ప్రతి స్టూడెంట్‌కు ఉండే పాఠశాల మధుర జ్ఞాపకాల్లో స్వయం పరిపాలన దినోత్సవం ఒకటి. మనకు పాఠాలు చెప్పే టీచర్ల స్థానంలో ‘సెల్ఫ్ గవర్నమెంట్ డే’ సందర్భంగా మనం చదువు చెప్పడం థ్రిల్లింగ్ ఫీలింగ్. ముందురోజు ప్రిపేరైన పాఠాన్ని తోటి విద్యార్థులకు బోధిస్తుంటే ఎగ్జైటింగ్‌గా, ఒకింత భయంగానూ అన్పిస్తుంది. ఆరోజూ స్టూడెంట్లుగా ఉండే వాళ్లు కామెంట్స్‌తో కిక్కు పొందుతారు. ఇంతకీ మీరు టీచర్ అయ్యారా? మీ మెమొరీ చెప్పండి.

News February 9, 2025

ఇక్కడ కేజీ చికెన్ రూ.150 మాత్రమే

image

TG: కామారెడ్డిలో చికెన్ చాలా చీప్‌గా లభిస్తోంది. మార్కెట్ ధర కన్నా KGపై రూ.30-40 తక్కువకే అమ్ముతారు. 5 ఏళ్లుగా ఇక్కడ వ్యాపారుల మధ్య మొదలైన పోటీతో KG ధర రూ.150-180 మధ్యే ఉంటోంది. దీంతో చుట్టుపక్కల వారు, పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం క్వింటాళ్ల కొద్దీ చికెన్‌ను ఇక్కడే కొనుగోళ్లు చేస్తుంటారు. కొందరు చికెన్ సెంటర్ల నిర్వాహకులకు సొంతంగా పౌల్ట్రీఫామ్‌లు ఉండటంతో తక్కువ రేటుకు అమ్మేందుకు వెనకాడటం లేదు.