News April 16, 2024

ఆంజనేయుడు లేని ఒకే ఒక రామాల‌యం

image

AP: రాష్ట్రంలోని ఒంటిమిట్ట రామాలయానికి ప్రత్యేకత ఉంది. భారతదేశంలో ఆంజనేయుడు లేని రామాలయం ఇదొక్కటే. ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న ఈ విశిష్టమైన రామాలయంలో సీత, రాముడు, లక్ష్మణ విగ్రహాలు ఏకశిలలో ఉంటాయి. అందుకే ఒంటిమిట్టను ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట రామాలయం ఆంధ్రా భద్రాచలంగా పేరుపొందింది. చంద్రుడి వెన్నెలలో సీతారాముల కళ్యాణం నిర్వహించడం ఈ దేవాలయ ప్రత్యేకత.

News April 16, 2024

ప్రశాంత్-రణ్‌వీర్ కాంబోలో క్రేజీ మూవీ?

image

‘హనుమాన్’ మూవీతో ప్రశాంత్ వర్మ స్టార్ డైరెక్టర్ క్రేజ్ సంపాదించారు. దీంతో ఆయన తర్వాత సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌తో తన తదుపరి మూవీ చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఓ మైథలాజికల్ సబ్జెక్టుతో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. కొత్త సినిమాకు సంబంధించి ప్రశాంత్-రణ్‌వీర్ మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయట.

News April 16, 2024

దస్తగిరితో సునీత లాలూచీ: అవినాశ్

image

AP: వివేకా హత్య కేసులో సునీతతో ఒప్పందంతోనే దస్తగిరి అప్రూవర్‌గా మారారు అని ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపించారు. ‘దస్తగిరితో సునీత లాలూచీ పడ్డారు. సునీత నాపై కావాలనే బురద జల్లుతున్నారు. ఇందుకు చంద్రబాబు కూడా కుట్రలు చేస్తున్నారు. వివేకాను చివరి రోజుల్లో సునీత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.

News April 16, 2024

గజమాలకు ఉన్న పుల్ల జగన్‌కు గుచ్చుకుంది: వర్ల రామయ్య

image

AP: సీఎం జగన్‌ గులకరాయి డ్రామా రక్తికట్టలేదని టీడీపీ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ‘గజమాలకు ఉన్న పుల్ల గుచ్చుకోగానే నాటకం ప్రారంభమైంది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అందించిన వైద్యమూ డ్రామాలో భాగమే. దీన్ని రచించిన రచయితకు నంది అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నా. అద్భుతంగా నటించిన జగన్‌కు ఆస్కార్ ఇవ్వాలి’ అని సెటైర్లు వేశారు.

News April 16, 2024

స్టాలిన్‌కు ఎదురు తిరిగిన విశాల్

image

మంత్రి ఉదయనిధి స్టాలిన్‌‌కు చెందిన రెడ్ జెయింట్స్ పిక్చర్స్‌పై హీరో విశాల్ మండిపడ్డారు. ‘రక్తం చిందించి సినిమాలు తీస్తున్నాం. ఎవరో ఒకరు థియేటర్ల యజమానులకు ఫోన్ చేసి ఆ సినిమా వేయకండి? ఈ సినిమా వేయండి అని ఆదేశాలిస్తున్నారు. మీరు ఎవరు చెప్పడానికి? ఆ అధికారం, హక్కులు ఎవరిచ్చారు’ అంటూ స్టాలిన్ లక్ష్యంగా ఆయన ఫైర్ అయ్యారు. కాగా ఎనిమీ, మార్క్ ఆంటోనీ సినిమాలకు రెడ్ జెయింట్స్ థియేటర్ల కొరత సృష్టించింది.

News April 16, 2024

ట్రావిస్ హెడ్ సెలబ్రేషన్ వెనుక కారణమిదే!

image

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కిన సంగతి తెలిసిందే. శతకం పూర్తైన తర్వాత బ్యాట్ హ్యాండిల్‌పై హెల్మెట్ పెట్టి సెలబ్రేట్ చేసుకున్నారు. దాని వెనుక కారణాన్ని మ్యాచ్ అనంతరం వివరించారు. ‘రెండు రోజుల క్రితం నేను, కోచ్ వెటోరీ వివిధ సెంచరీ సెలబ్రేషన్లపై జోకులు వేసుకున్నాం. ఆ చర్చను అనుసరిస్తూనే నేను సరదాగా ఈ తరహాలో వెటోరీకి అభివాదం చేశాను’ అని తెలిపారు.

News April 16, 2024

రేపు మ.12 గంటలకు అయోధ్యలో అద్భుతం

image

శ్రీరామ నవమి సందర్భంగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యలో అరుదైన ఘట్టం జరగనుంది. బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం ఆవిష్కృతం కానుంది. 75MM వ్యాసార్ధంతో దాదాపు 6 నిమిషాలపాటు సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News April 16, 2024

AI ఫేక్ వీడియోపై పోలీసులకు ఆమిర్ ఖాన్ ఫిర్యాదు

image

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయాలని బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రజలను కోరుతున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ఇది ఫేక్ అని, ఎన్నికల కమిషన్ కోసం చేసిన ఓ వీడియోను AI ద్వారా ఎడిట్ చేశారంటూ ఆయన ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 35 ఏళ్ల సినీ కెరీర్‌లో తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, ఎవరినీ సపోర్ట్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

News April 16, 2024

గల్ఫ్ కార్మికుల కోసం ప్రణాళిక: సీఎం

image

TG: సెప్టెంబర్ లోపు గల్ఫ్ కార్మికుల కోసం ప్రణాళిక రూపొందిస్తామని CM రేవంత్ రెడ్డి చెప్పారు. గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సమావేశమైన సీఎం.. రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ ఉపాధిపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. ఆ కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ గల్ఫ్, ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని నిర్ణయించామన్నారు. కార్మికుల సహాయార్థం ప్రజాభవన్‌లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

News April 16, 2024

సివిల్స్ విజేతలకు మోదీ విషెస్..

image

సివిల్స్-2023 పరీక్షల్లో <<13063782>>ర్యాంకులు<<>> సాధించిన వారికి ప్రధాని మోదీ Xలో శుభాకాంక్షలు చెప్పారు. వారి పట్టుదల, అంకితభావం ప్రజా సేవకు నాంది పలికిందన్నారు. రాబోయే రోజుల్లో వారి కృషి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుందన్నారు. అలాగే సివిల్స్ క్లియర్ చేయలేని వారికి ఆయన భరోసా ఇచ్చారు. ఎదురుదెబ్బలు కఠినంగా ఉన్నప్పటికీ.. ముందడుగు వేయడానికి ఇవేమీ అడ్డు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.