India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్వదేశంలో ఇంగ్లండ్తో 5T20ల సిరీస్లో భాగంగా నేడు భారత్ తొలి T20 కోల్కతాలో ఆడనుంది. SKY సారథ్యంలో ధనాధన్ ఆటకు జట్టు సిద్ధమైన వేళ స్టార్ పేసర్ షమీపైనే కళ్లన్నీ ఉన్నాయి. గాయం నుంచి కోలుకొని జట్టులో చేరిన షమీ ఆశించిన స్థాయిలో రాణిస్తే CTలో భారత్కు ఎక్స్ఫ్యాక్టర్గా మారనున్నారు. అటు విజయంతో సిరీస్ ప్రారంభించాలని ఇంగ్లండ్ వ్యూహాలు రచిస్తోంది. రాత్రి 7 గం.కు స్టార్ స్పోర్ట్స్లో మ్యాచ్ లైవ్ చూడవచ్చు.

ఛత్తీస్గఢ్- ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో 27మంది మావోయిస్టులు చనిపోగా, వారిలో ఆ పార్టీ కేంద్ర కమిటీ పొలిట్బ్యూరో సభ్యుడు చలపతి(60) ఉన్నారు. ఇతను ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక సూత్రధారి. ఈయనది చిత్తూరు జిల్లా మాటెంపల్లి కాగా, రూ.కోటి రివార్డ్ ఉంది. చలపతి వద్ద ఎప్పుడూ ఏకే 47, ఎస్ఎల్ఆర్ వెపన్స్ ఉంటాయని, చుట్టూ 8- 10 మంది మావోలు సెక్యూరిటీ ఉంటారని సమాచారం.

ఇప్పుడంటే ఇంటర్నెట్ సౌకర్యం పెరిగి జాబ్ల వివరాలు చేతి వేళ్ల దగ్గరికొచ్చాయి గానీ, 1970, 80 యువతకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్లే దిక్కు. మళ్లీ వాటిని తీసుకొచ్చి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఓ జాబ్ పోర్టల్ తీసుకురానున్నట్లు సమాచారం. అందులో ప్రైవేటు కంపెనీలు ఉద్యోగ ఖాళీలను రిపోర్ట్ చేయాలి. మార్గదర్శకాలు పాటించకపోతే చర్యలు తీసుకునే అవకాశముంది.

దిగుమతి సుంకాలు పెంచాలనే USA అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన ప్రపంచ ఆర్థిక అసమానతలకు కారణమవుతుందని RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. విదేశాల్లో వస్తువులు చౌకగా ఉన్నందున వాటిని దిగుమతి చేసుకునేటప్పుడు సుంకాలు పెంచి ప్రయోజనాలను పొందాలని USA చూస్తున్నట్లు తెలిపారు. దీంతో విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. సుంకాలపై అమెరికా ఊహించినంత ప్రయోజనకరంగా ఉండదన్నారు.

ముంబై తరఫున రంజీ మ్యాచ్లు ఆడేందుకు రోహిత్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి జమ్మూకశ్మీర్తో జరగనున్న రంజీ మ్యాచ్లో బరిలోకి దిగనున్న హిట్మ్యాన్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ రంజీ జెర్సీలో మెరిశారు. కొత్త జెర్సీలో ఫేవరెట్ క్రికెటర్ను చూసిన ఫ్యాన్స్ రంజీల్లోనూ అదరగొట్టాలని పోస్టులు పెడుతున్నారు. ముంబై జట్టుకు రహానే కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

జాబ్ అయినా చిన్న వ్యాపారం అయినా పొదుపు, పెట్టుబడుల కోసం పక్కనబెట్టాకే ఖర్చులకు వాడితే బెటర్. అలాగే, మంచిరోజు కోసమో అప్పుడే ఎందుకు? అనుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడే ఆ పని ప్రారంభించాలి. ఇతరులతో పోల్చుకొని హంగులు, ఆర్భాటాలకు పోకుండా తక్కువలోనే జీవిస్తే అధిక మొత్తం పోగేసేందుకు వీలుంటుంది. ఎప్పటికప్పుడు నిపుణులతో మాట్లాడుతూ పన్నుల నుంచి మినహాయింపు పొందేలా ప్లాన్ చేసుకోవాలి.

ప్రపంచంలోనే తొలిసారి మనుషులతో కలిసి హ్యూమనాయిడ్ రోబోల మారథాన్కు చైనా సిద్ధమైంది. ఏప్రిల్లో బీజింగ్లోని డాక్సింగ్ జిల్లాలో 21కి.మీ. మేర డజన్ల కొద్దీ రోబోలతో పాటు 12K అథ్లెట్లు పోటీ పడనున్నారు. తొలి 3స్థానాల్లో నిలిచిన అథ్లెట్ లేదా రోబోలకు బహుమతులిస్తారు. చైనాలో వృద్ధాప్య జనాభా పెరిగి శ్రామిక శక్తి తగ్గింది. అందుకే హ్యమనాయిడ్ రోబోలను అభివృద్ధి చేస్తుండగా, ఇందులో భాగంగానే మారథాన్ నిర్వహిస్తోంది.

వాములో చాలా ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. దాన్ని నమలడం వల్ల నోట్లోని బ్యాక్టీరియా నశించడంతో పాటు చిగుళ్ల వాపులు తగ్గుతాయి. రోజూ తీసుకుంటే శరీర మెటబాలిజం పెరిగి బరువు తగ్గుతారు. వాములోని యాంటీ స్పాస్మోడిక్ గుణాలు కడుపునొప్పి, అజీర్తికి దివ్యౌషధంగా పనిచేస్తాయి. జలుబు ఉన్నవారు వాముగింజలను పొడి చేసి వస్త్రంలో చుట్టి వాసన పీల్చితే ఉపశమనం లభిస్తుంది.

హార్దిక్ పాండ్యా, తాను మంచి స్నేహితులం అని సూర్య కుమార్ యాదవ్ అన్నారు. ‘చాలా కాలంగా కలిసి క్రికెట్ ఆడుతున్నాం. గ్రౌండ్లోనే కాకుండా బయటా మేము మంచి ఫ్రెండ్స్. IPL ప్రారంభం కాగానే కెప్టెన్సీ అతనికి అప్పగించి కాస్త రిలాక్స్ అవుతా’ అని సూర్య అన్నారు. ఇంగ్లండ్తో T20లకు హార్దిక్ను కాదని అక్షర్ను VCగా నియమించడంతో హార్దిక్, సూర్య మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో SKY స్పందించారు.

రామాయణంలోని ఓ అంశాన్ని ఆప్ అధినేత కేజ్రీవాల్ తప్పుగా చెప్పడంపై ఢిల్లీ ఎన్నికల వేళ BJP ఆయనపై ఎటాక్ చేస్తోంది. ‘చునావీ(ఎన్నికల) హిందూ’ అంటూ విమర్శిస్తోంది. ఆయన సనాతన ధర్మాన్ని కించపరిచారని ఢిల్లీ BJP అధ్యక్షుడు V. సచ్దేవా మండిపడ్డారు. ఎన్నికలప్పుడే ఆయనకు ఆలయాలపై ప్రేమ పుట్టుకొస్తుందని ఎద్దేవా చేశారు. BJP నేతలు రావణుడిని ఇష్టపడుతున్నారని, వారి స్వభావం అలాంటిదే అని కేజ్రీవాల్ ఎదురుదాడికి దిగారు.
Sorry, no posts matched your criteria.