India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తమ టీమ్ బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోడ్ను నియమించింది. ఆయన ఇటీవల భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్గా పని చేశారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ ఇప్పటికే ప్రధాన కోచ్ బాధ్యతలు రాహుల్ ద్రవిడ్కు అప్పగించింది. తాజాగా రాథోడ్ను సైతం నియమించుకుంది. భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడంలో వీరిద్దరూ తెర వెనుక కీలకపాత్ర పోషించారు.
AP: ‘BJPలో TDP విలీనమౌతుందా? జమిలి ఎన్నికలయ్యాక TDP జెండా పీకేయ్యడమేనా?’ అంటూ YCP MP విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘APలో TDP పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోందా? లోకేశ్ వ్యవహార శైలితో సీనియర్లు విసిగిపోతున్నారా? అధికారంలోకి వచ్చిన 100 రోజులకే పార్టీలో అసంతృప్తులా? మొన్న మస్తాన్ రావు, మోపిదేవి, నిన్న బాలినేని, సామినేని. లిస్ట్ ఇంకా ఉందా? ఇంకెంతమందిని అవినీతి సొమ్ముతో కొంటారు?’ అని ప్రశ్నించారు.
AP: తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవడం చిన్న విషయం కాదని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. 100 రోజుల ముందే తెలిస్తే ఎందుకు బయటపెట్టలేదని, విచారణకు ఎందుకు ఆదేశించలేదని నిలదీశారు. జగన్ హయాంలో ఎంపిక చేసిన కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేశారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు.
YouTubeలో ‘Pause Ads’ అనే ఫీచర్ రానుంది. దీని వల్ల యూజర్లు వీడియో పాస్ చేసినా స్క్రీన్పై సైడ్కు యాడ్స్ ప్లే అవుతాయి. ఇప్పటికే వీడియోలు చూసేటప్పుడు వస్తున్న యాడ్స్తో యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. తాజా ఫీచర్తో మరింత ఇబ్బంది పడే ఛాన్సుంది. యాడ్స్ వద్దనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవడమే బెటర్ అని నెటిజన్లు అంటున్నారు. INDలో YouTube ప్రీమియం సబ్స్క్రిప్షన్ ధర నెలకు ₹149 నుంచి స్టార్ట్ అవుతుంది.
జులై, ఆగస్టులో గ్రీస్లో భారతీయ ఇన్వెస్టర్ల ఇళ్ల కొనుగోళ్లు 37% పెరిగాయి. ఆ దేశ గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ రూల్స్ మారడమే దీనికి కారణం. అక్కడ ఇల్లు కొంటే శాశ్వత నివాసం పొందొచ్చు. 2013లో మొదలైన ఈ ప్రోగ్రామ్లో మొదట రూ.2.2 కోట్లు పెట్టుబడి పెడితే చాలు. తక్కువ డబ్బే కాబట్టి ఏథెన్స్ వంటి నగరాల్లో భూముల రేట్లు కొండెక్కాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు సెప్టెంబర్1 నుంచి పెట్టుబడిని రూ.7 కోట్లకు పెంచారు.
భారత సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్కు గురైంది. ఇందులో అమెరికాకు చెందిన రిపిల్ అనే డిజిటల్ చెల్లింపుల సంస్థకు సంబంధించిన XRP, క్రిప్టో కరెన్సీ ప్రమోషన్ వీడియోలను హ్యాకర్లు పోస్టు చేశారు. కేసుల విచారణను ప్రసారం చేసేందుకు ఈ యూట్యూబ్ ఛానల్ను సుప్రీం కోర్టు వినియోగిస్తోంది.
AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వ్యవహారంపై, కూటమి 100 రోజుల పాలన తీరుపై ఆయన మీడియాతో మాట్లాడతారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.
BSE సెన్సెక్స్ ఆల్టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇంట్రాడేలో 1000 పాయింట్లు పెరిగిన సూచీ తొలిసారి 84,000 స్థాయిని బ్రేక్ చేసింది. ఒకానొక దశలో 84,240నూ టచ్ చేసింది. దీంతో BSEలోని కంపెనీల మార్కెట్ విలువ రూ.4 లక్షల కోట్లు పెరిగి రూ.469.5 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక నిఫ్టీ50 ఫస్ట్టైమ్ 25,725 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని అందుకుంది. నేడు ఫార్మా మినహా అన్ని రంగాల సూచీలు అదరగొడుతున్నాయి.
చెన్నై టెస్టులో బంగ్లా బ్యాటర్లు తడబడుతున్నారు. బుమ్రా 1, ఆకాశ్ దీప్ 2 వికెట్లు తీయడంతో 26 పరుగులకే ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో టీమ్ ఇండియా 376 రన్స్ చేసి ఆలౌటైన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ ఎంత స్కోర్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.
ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని BRS MLA జగదీశ్ వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు అంగీకరించలేదు. కేసు విచారణను రేవంత్ ప్రభావితం చేస్తారనేది అపోహ మాత్రమేనని చెప్పింది. ఈ పిటిషన్ను ఎంటర్టైన్ చేయలేమంటూ పిటిషన్పై విచారణను ముగించింది. రేవంత్ రెడ్డికి కేసు విషయాలు రిపోర్ట్ చేయవద్దని ఏసీబీని ఆదేశించింది.
Sorry, no posts matched your criteria.