India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

Day Highని కూడా క్రాస్ చేయ్యలేక దేశీయ సూచీలు Mon నష్టాలబాటపట్టాయి. Sensex 384 పాయింట్ల లాస్తో 81,748 వద్ద, Nifty 100 పాయింట్లు కోల్పోయి 24,668 వద్ద స్థిరపడ్డాయి. రియల్టీ రంగం 3% లాభపడింది. Media, Consumer Durables, ఫార్మా స్వల్పంగా రాణించాయి. ఇతర అధిక వెయిటేజీ రంగాలు రెడ్లోనే ముగిశాయి. Dr.Reddy, Indus Indbk, Hdfc Life టాప్ గెయినర్స్, Titan, Hindalco, Adani Ports టాప్ లూజర్స్.

మహానటి కీర్తి సురేశ్ పెళ్లి వేడుకలో ఆమె ధరించిన చీర ప్రత్యేకంగా నిలిచింది. దీని తయారీకి 405 గంటలు పట్టిందని సమాచారం. ఆకుపచ్చ, బంగారు వర్ణంలోని ఈ మడిసర్ చీర ధర ఖర్చు రూ.3 లక్షలకు పైనేనని తెలుస్తోంది. ఈ సారీని డిజైనర్ అనిత డొంగ్రే రూపొందించారు. దీనిపై కీర్తి సురేశ్ రాసిన పద్యాన్ని పొందుపరిచారు. మరోవైపు పెళ్లి కొడుకు దుస్తుల తయారీకి 150 గంటలు పట్టిందట.

‘నా పాత ఫ్రెండ్ జార్జ్ సొరోస్ను కలిశాను’ అని 2009లో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరలవ్వడంతో కాంగ్రెస్ MP శశిథరూర్ ఉలిక్కిపడ్డారు. భారత వ్యతిరేకితో మీకేం పనంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించడంతో వివరణ ఇచ్చారు. ‘నేను UNలో ఉన్నప్పటి నుంచి ఓ సాధారణ ఫ్రెండ్గా సొరోస్ తెలుసు. అతడు, అతడి సంస్థల నుంచి నేను ఒక్క రూపాయీ తీసుకోలేదు. అతడి ఐడియాలజీకి మద్దతివ్వలేదు. రాజకీయంగా అతడితో అస్సలు సంబంధం లేద’ని చెప్పారు.

జననాలను పెంచేందుకు సౌత్ కొరియా ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. గర్భిణులను డెలివరీ సమయంలో, ప్రసవించిన తర్వాత కంటికి రెప్పలా చూసుకునేందుకు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటుచేసింది. ఇప్పటికే కొన్ని ప్రారంభమయ్యాయి. ఇక్కడ తాజా భోజనం, ఫేషియల్, మసాజ్, నర్సింగ్ సేవలు ఉంటాయి. కేవలం పిల్లలకు పాలు ఇవ్వడం, రెస్ట్ తీసుకోవడమే తల్లుల పని. వీటికి ఆదరణ పెరగడంతో గర్భం దాల్చగానే వెంటనే బుక్ చేసుకుంటున్నారు.

TG: భూములు ఇవ్వని రైతులను అరెస్ట్ చేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రశ్నించినవారినీ జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చ పెట్టకుండా సీఎం రేవంత్ పారిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉన్నది అరాచక ప్రభుత్వమని ధ్వజమెత్తారు. రైతుల పక్షాన KCR ఉన్నారని, BRS వారి తరఫున పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

‘మతపరమైన భక్తి ఆత్మశుద్ధికి దోహదం చేయవచ్చు. అదే రాజకీయాల్లో భక్తి నియంతృత్వానికి దారి తీస్తుంది. ఆయన నియంత అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు’ అంటూ మోదీని ఖర్గే ఘాటుగా విమర్శించారు. రాజ్యాంగంపై చర్చలో ఖర్గే మాట్లాడుతూ.. 1947-52లో ఎన్నికైన ప్రభుత్వం లేనప్పుడు రాజ్యాంగ సవరణకు నెహ్రూ ప్రయత్నించారంటూ మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయనో పెద్ద అబద్ధాల కోరు అని విమర్శించారు.

‘పుష్ప-2’ సినిమాపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ‘పుష్పరాజ్గా అల్లు అర్జున్ అదరగొట్టారు. ప్రతి డైలాగ్, ఎమోషన్, యాక్టింగ్.. ఆయన ఐకాన్ స్టార్ అని నిరూపించాయి. శ్రీవల్లి క్యారెక్టర్కు రష్మిక ప్రాణం పోశారు. పావని కరణం నటన బాగుంది. డీఎస్పీ మ్యూజిక్ అద్భుతం, చిత్రయూనిట్కు అభినందనలు. ఐకాన్ పాత్రను రూపొందించినందుకు సుకుమార్ సార్కు వందనాలు’ అని ప్రశాంత్ ట్వీట్ చేశారు.

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీపై దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీని ఏ ఒక్కరూ ఎందుకు ప్రశ్నించట్లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. గత ఐదేళ్లుగా టెస్టుల్లో ఆయన ప్రదర్శన ఆశాజనకంగా లేదని అభిప్రాయపడ్డారు. బ్యాగులు ప్యాక్ చేసుకొని లండన్లో సెటిల్ అయ్యేందుకు కోహ్లీకి ఇదే సరైన సమయమని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

బంగ్లాకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కుదేలైన ఎకానమీని యూనస్ నిలబెట్టడం లేదు. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలేందుకు సిద్ధంగా ఉంది. మరోవైపు కరెంటు లేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. తాజాగా మయన్మార్ రెబల్స్ 275KM మేర బంగ్లా సరిహద్దును అధీనంలోకి తీసుకోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అక్కడ వాణిజ్య సేవల్ని నిలిపేసి ఆంక్షలు అమలు చేస్తోంది. బంగ్లాలోని టెక్నాఫ్ సహా కొన్ని ప్రాంతాలను రెబల్స్ ఆక్రమించారని సమాచారం.

AP: తండ్రి మరణం తర్వాత వచ్చే డబ్బు కోసం ఓ మహిళ సొంత అన్నదమ్ములనే చంపిన ఘటన పల్నాడు(D) నకరికల్లులో జరిగింది. ప్రభుత్వ టీచర్ పౌలిరాజు ఇటీవల మరణించాడు. ప్రభుత్వం నుంచి వచ్చే రూ.40లక్షల కోసం కుమారులు గోపీకృష్ణ(కానిస్టేబుల్), రామకృష్ణ(టీచర్), కూతురు కృష్ణవేణి మధ్య గొడవలు జరిగాయి. దీంతో గతనెల 26న తమ్ముడిని, ఈనెల 10న అన్నను చంపిన కృష్ణవేణి వారి మృతదేహాలను కెనాల్లో పడేసింది. పోలీసులు అరెస్ట్ చేశారు.
Sorry, no posts matched your criteria.