News December 13, 2024

ట్రంప్ ప్రమాణ స్వీకారానికి జిన్‌పింగ్ డుమ్మా!

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ట్రంప్ ఆహ్వానం పంపినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. కాగా, తనకు ట్రంప్ నుంచి ఆహ్వానం అందినా ప్రమాణస్వీకారానికి వెళ్లేందుకు జిన్‌పింగ్ సుముఖంగా లేరని ఆ దేశ మీడియా పేర్కొంది. అమెరికాకు చైనా అంబాసిడర్, అతని భార్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారని తెలిపింది.

News December 13, 2024

నేడు స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ లాంచ్

image

AP: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్‌ను నేడు CM చంద్రబాబు ఆవిష్కరిస్తారు. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమానికి CMతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతారు. కాగా 2047 నాటికి నవ్యాంధ్రప్రదేశ్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా నిలిపి, దేశానికి ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని సర్కార్ సంకల్పించింది.

News December 13, 2024

STOCK MARKETS: భారీ నష్టాలు తప్పవేమో!

image

స్టాక్‌మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడొచ్చు. NOVలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ తగ్గడం శుభసూచకం. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతున్నాయి. నిన్న EU, US సూచీలన్నీ ఎరుపెక్కాయి. నేడు ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. నిక్కీ 400, గిఫ్ట్ నిఫ్టీ 94 పాయింట్ల మేర పతనమయ్యాయి. USD/INR మరింత బలహీనపడుతోంది. STOCKS TO WATCH: HAL, Ashok Leyland, GR Infra, Zomato, Yes Bank, CRISIL, Adani Green

News December 13, 2024

ఆ రోజు సెలవు.. టెన్త్ ఎగ్జామ్ వాయిదా!

image

AP: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం ఇప్పటికే <<14851568>>ప్రకటించింది<<>>. అయితే అందులో స్వల్ప మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది MAR 31న సాంఘిక శాస్త్రం పరీక్ష జరగనుంది. క్యాలెండర్ ప్రకారం ఆరోజు రంజాన్ సెలవు ఉంది. నెలవంక కనిపించే విషయాన్ని బట్టి పండగ అదేరోజు వస్తే మరుసటి రోజు APR 1కి ఎగ్జామ్ పోస్ట్‌పోన్ చేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

News December 13, 2024

‘తెలంగాణ తల్లి’పై కవుల తలో మాట!

image

TG: తెలంగాణ తల్లి కొత్త విగ్రహంపై కవులు, కళాకారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విగ్రహంలో తన తల్లి కనిపించిందని రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. గత పాలనలో విగ్రహాన్ని అధికారికంగా ప్రకటించలేదని గుర్తు చేశారు. మరోవైపు తెలంగాణ గ్రామీణ మహిళ చేతులు ఖాళీగా ఉండవని కవి నందిని సిధారెడ్డి కొత్త విగ్రహ రూపాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందుకే ప్రభుత్వ రివార్డును తిరస్కరించినట్లు చెప్పారు.

News December 13, 2024

H1B, L1 వీసాదారుల భాగస్వాములకు గుడ్‌న్యూస్

image

H1B, L1 వీసాదారుల భాగస్వాములకు US గుడ్‌న్యూస్ చెప్పింది. వీరికి ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ రెన్యూవల్ కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. ఇప్పటి వరకు 180రోజులున్న కాలపరిమితి ఈ ప్రకటనతో 540రోజులకు పెరిగింది. వచ్చే ఏడాది జనవరి 13నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 2022 మే4, ఆ తర్వాత రెన్యూవల్‌కి అప్లై చేసుకున్న లేదా పెండింగ్‌లో ఉన్నవారికే ఇది వర్తిస్తుంది.

News December 13, 2024

మీ మద్దతుకు థాంక్స్ సర్: ప్రధాని ట్వీట్‌పై గుకేశ్

image

గుకేశ్ విజయం పట్ల PM మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అసమాన ప్రతిభ, కృషి, సంకల్పంతోనే విజయం సాధ్యమైందని గురువారం అభినందించారు. దీనిపై వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ స్పందించారు. ‘మీరు ఇచ్చిన మద్దతు, ప్రోత్సాహకానికి ధన్యవాదాలు సర్’ అని రీట్వీట్ చేశారు. అటు, తమిళనాడుకు చెందిన గుకేశ్ తనకు శుభాకాంక్షలు తెలిపిన ఆ రాష్ట్ర CM స్టాలిన్‌, డిప్యూటీ CM ఉదయనిధి స్టాలిన్‌కు సైతం ధన్యవాదాలు తెలిపారు.

News December 13, 2024

ఇకపై గ్రామాల్లోనూ ‘అన్న క్యాంటీన్లు’!

image

AP: ఇప్పటివరకు నగరాలు, పట్టణాలకే పరిమితమైన అన్న క్యాంటీన్లను గ్రామాల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి 63 చోట్ల వీటిని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. జనసాంద్రత ఎక్కువగా, 40 అడుగుల రోడ్డు సదుపాయం ఉండే ప్రాంతాలను అన్వేషించాలని కలెక్టర్లను ఆదేశించింది. కాగా ఇప్పటివరకు 199 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

News December 13, 2024

ఇవాళ స్కూళ్లకు సెలవు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని విద్యాసంస్థలకు కలెక్టర్లు ఇవాళ సెలవు ప్రకటించారు. ఈ ఆదేశాలను యాజమాన్యాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు.

News December 13, 2024

గుకేశ్ ఎంత ప్రైజ్ మనీ గెలిచారంటే?

image

వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్ ట్రోఫీతో పాటు 1.35మిలియన్ డాలర్లు( దాదాపు రూ.11.45కోట్లు) ప్రైజ్ మనీ గెలిచారు. అలాగే, రన్నరప్ డింగ్ లిరెన్ 1.15 మిలియన్ డాలర్లు (రూ.9.75కోట్లు) సొంతం చేసుకున్నారు. మొత్తం ఛాంపియన్‌షిప్ ప్రైజ్ మనీ రూ.21.75 కోట్లు కాగా, ఒక గేమ్ గెలిచిన ఆటగాడికి రూ.1.69 కోట్లు వస్తాయి. గుకేశ్ 3 గేమ్‌లు, లిరెన్ 2 నెగ్గగా.. మిగిలిన దాన్ని సమానంగా పంచారు.