News April 4, 2025

ఎల్లుండి ‘పెద్ది’ ఫస్ట్ షాట్, రిలీజ్ డేట్ గ్లింప్స్

image

బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. శ్రీరామ నవమి సందర్భంగా ఎల్లుండి ఉదయం 11.45 గంటలకు పెద్ది ఫస్ట్ షాట్‌తోపాటు రిలీజ్ డేట్ గ్లింప్స్‌ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. మ్యూజిక్ మిక్సింగ్ పూర్తయ్యిందంటూ ఏఆర్ రెహమాన్‌తో దిగిన ఫొటోను బుచ్చిబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

News April 4, 2025

నేపాల్‌లో భూకంపం

image

నేపాల్‌లో భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమికి 20 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఢిల్లీ-NCRతో సహా ఉత్తర భారతంలో పలు చోట్ల భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది. ఇటీవల మయన్మార్‌లో భూకంపం ధాటికి 3వేల మందికి పైగా ప్రజలు మరణించిన విషయం తెలిసిందే.

News April 4, 2025

ఆ రెండు ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: ఉత్తమ్

image

TG: సాగు నీటి ప్రాజెక్టులపై AP ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేంద్ర సంస్థలు, బోర్డుల అనుమతి లేకుండా నిబంధనలను ఉల్లంఘించి రాయలసీమ ఎత్తిపోతల, బనకచర్ల ప్రాజెక్టులపై ముందుకెళ్తోందని చెప్పారు. వాటిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. ఈ విషయంపై స్టాండింగ్ కౌన్సిల్, AGతో ఆయన సంప్రదింపులు జరిపారు. ఆ ప్రాజెక్టులతో తెలంగాణకు నష్టం వాటిల్లుతుందన్నారు.

News April 4, 2025

చైనా ప్రతీకార సుంకాలు.. స్పందించిన ట్రంప్

image

ట్రంప్ తమపై విధించిన సుంకాలకు ప్రతీకారంగా చైనా కూడా 34శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. దానిపై ట్రంప్ స్పందించారు. ‘వారు మాపై సుంకాలు విధించలేరు. అది వారికి మంచిదికాదు. కానీ టెన్షన్ పడ్డారు. తప్పటడుగు వేశారు’ అని తన ట్రూత్ సోషల్‌లో వ్యాఖ్యానించారు. సుంకాలతో పాటు అరుదైన వనరుల ఎగుమతులపై, రక్షణ రంగ సంబంధితమైన 30 అమెరికా కంపెనీలపై చైనా ఆంక్షలు విధించింది.

News April 4, 2025

BIG NEWS: రేపటి మ్యాచ్‌కు CSK కెప్టెన్‌గా ధోనీ?

image

గత నెల 30న రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో గాయపడిన CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇంకా కోలుకోలేదని సమాచారం. రేపు ఢిల్లీతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ధోనీ మరోసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై యాజమాన్యం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

News April 4, 2025

బర్డ్‌ ఫ్లూపై ఆందోళన వద్దు: CM చంద్రబాబు

image

AP: బర్డ్‌ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యాధి నిరోధకశక్తి లేకపోవడం, లెప్టోస్పీరోసిస్ తదితర కారణాల వల్ల ఈ వ్యాధి సోకి ఇటీవల ఓ బాలిక మృతి చెందిందని చెప్పారు. దీనిపై ICMR బృందం అధ్యయనం చేసిందన్నారు. కాగా ఆ బృందంతో సీఎం ఇవాళ సమీక్షించారు.

News April 4, 2025

309 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

ఎయిర్ ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 25 నుంచి మే 24 వరకు అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ, బీటెక్ పూర్తి చేసినవారు అర్హులు. జీతం రూ.40వేల నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు. వయసు 27 ఏళ్లు కాగా రిజర్వేషన్ల మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 4, 2025

KGBVల్లో ప్రవేశాలు.. ఈ నెల 11 వరకు ఛాన్స్

image

AP: రాష్ట్రంలోని 352 KGBVల్లో ఆరో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 7, 8, 9, 10, ఇంటర్ సెకండియర్‌లో మిగిలిన సీట్లకు అప్లై చేసుకోవాలని సమగ్రశిక్ష సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. అనాథలు, డ్రాపౌట్స్, SC, ST, BC, మైనార్టీ బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వెబ్‌సైట్: https://apkgbv.apcfss.in/

News April 4, 2025

గతేడాది అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే..

image

గత ఆర్థిక సంవత్సరం ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన వెహికిల్‌గా మారుతీ సుజుకీ వేగన్-R నిలిచింది. 1,98,451 యూనిట్లు విక్రయించినట్లు సంస్థ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు మెుత్తం 33.7 లక్షల యూనిట్లు సేల్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆటో మెుబైల్ మార్కెట్‌లో Wagon-R 4th జెనరేషన్ వెహికిల్ 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

News April 4, 2025

పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని తాగి..

image

అలోవేరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగి 14 ఏళ్ల బాలిక మరణించింది. బెంగళూరుకు చెందిన దీపాంజలికి అలోవెరా జ్యూస్ తాగే అలవాటు ఉంది. ఎప్పటిలాగే ఇంట్లో ఉన్న బాటిల్‌ తీసుకొని తాగేసింది. అయితే అంతకుముందే అందులో జ్యూస్ అయిపోవడంతో పేరెంట్స్ ఆ డబ్బాలో పురుగుల మందు లిక్విడ్ పోసి పెట్టారు. అది గమనించకపోవడంతో దీపాంజలి తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.