News March 31, 2025

CSK ‘ధోనీ’ని వదులుకోలేక!

image

ధోనీ ఉంటేనే CSK. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతోంది. ప్రస్తుతం ధోనీ బ్యాటింగ్ చూస్తే సగటు చెన్నై ఫ్యాన్‌కి అసహనం కలుగుతోంది. బ్యాటింగ్‌లో మేనేజ్మెంట్ ధోనీకి స్వేచ్ఛనివ్వగా యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ రావట్లేదని పలువురు ఫ్యాన్స్ అంటున్నారు. అటు శరీరం సహకరించక MS ఆలస్యంగా బ్యాటింగ్‌కు వస్తున్నారని కోచ్ ఫ్లెమింగ్ చెప్పారు. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయలేక పరిస్థితిని బట్టి క్రీజులోకి వస్తున్నారని తెలిపారు.

News March 31, 2025

శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం

image

AP: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కన్పిస్తోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 62,263 మంది దర్శించుకోగా.. 25,733 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

News March 31, 2025

విశ్వావసులో ముఖ్యమైన పండుగలు

image

*ఏప్రిల్ 6- శ్రీరామనవమి *జులై 6- తొలి ఏకాదశి *జులై 10- గురుపూర్ణిమ *జులై 25- శ్రావణమాసం ప్రారంభం *ఆగస్టు 8- వరలక్ష్మీ వ్రతం *AUG 9- రాఖీ పూర్ణిమ *AUG 16- శ్రీకృష్ణాష్టమి *AUG 27- వినాయక చవితి *అక్టోబర్ 2- విజయదశమి *OCT-20 దీపావళి *OCT 22- కార్తికమాసం ప్రారంభం *జనవరి 14- భోగి, 15- సంక్రాంతి, 16- కనుమ *JAN 23- వసంత పంచమి*జనవరి 30- మేడారం జాతర *ఫిబ్రవరి 15- మహాశివరాత్రి *మార్చి 2- హోలీ

News March 31, 2025

బెట్టింగ్ యాప్స్.. సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు

image

TG: బెట్టింగ్ యాప్స్ వ్యవహరంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT)ను ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ ప్రధాన అధికారిగా ఐజీ రమేశ్‌ను నియమించారు. ఇందులో సభ్యులుగా ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మీ, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్‌ను పేర్కొన్నారు. ఇప్పటికే 25 సెలబ్రిటీలపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవ్వగా ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది.

News March 31, 2025

రంజాన్ స్పెషల్.. పసందైన విందు

image

రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది ముస్లిం సోదరులు ఇచ్చే విందు. మతాలకు అతీతంగా స్నేహితులు, సన్నిహితులను తమ ఇళ్లకు పిలిచి పసందైన చికెన్ బిర్యానీ వడ్డిస్తారు. ఆ తర్వాత తియ్యటి షేమియా తినిపిస్తారు. అనంతరం ఆత్మీయంగా హత్తుకుని పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మరి మీకూ ముస్లిం స్నేహితులు ఉన్నారా? ఈద్ సందర్భంగా మిమ్మల్ని విందుకు ఆహ్వానించారా? కామెంట్ చేయండి.

News March 31, 2025

ముస్లింలకు PM మోదీ ఈద్-ఉల్-ఫితర్ విషెస్

image

దేశంలోని ముస్లింలకు PM నరేంద్ర మోదీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరిలో శాంతి, దయాగుణం పెంపొందాలన్నారు. చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు దేశంలోని అన్ని పాంతాల్లో ముస్లింలు ఈద్గాలకు చేరుకొని పవిత్ర రంజాన్ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఆలింగనం చేసుకొని ఒకరికొకరు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.

News March 31, 2025

వివాహితపై సామూహిక అత్యాచారం

image

TG: నాగర్ కర్నూల్ (D) ఊర్కొండ(M)లో వివాహితపై గ్యాంగ్ రేప్ జరిగింది. MBNR జిల్లాకు చెందిన ఆమె బంధువుతో కలిసి ఊర్కొండపేట ఆంజనేయస్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. కాలకృత్యాల కోసం గుట్ట ప్రాంతానికి వెళ్లగా, 8 మంది ఆ బంధువుపై దాడి చేసి అతని చేతులు, కాళ్లు కట్టేశారు. ఆ తర్వాత వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఘటనకు పాల్పడ్డ వారిని గుర్తించిన పోలీసులు, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

News March 31, 2025

ముస్లిం సోదరులకు గవర్నర్, సీఎం రంజాన్ శుభాకాంక్షలు

image

AP: రాష్ట్రంలోని ముస్లింలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, CM చంద్రబాబు, మాజీ CM జగన్ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అల్లా దయతో విజయవంతం కావాలని CM కోరారు. జకాత్ పేరుతో సాటివారిని ఆదుకునే దయా గుణం ముస్లిం వర్గంలోని మానవత్వానికి ప్రతిరూపం అన్నారు. అల్లా చూపిన మార్గంలో న‌డవాల‌ని, అంద‌రిపై ఆయన దీవెనలు ఉండాల‌ని కోరుకుంటున్నట్లు జగన్ పేర్కొన్నారు.

News March 31, 2025

గాయం నుంచి ఇంకా కోలుకోలేదు: హీరోయిన్

image

జిమ్ చేస్తూ గాయపడిన తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. గత ఏడాది చివర్లో ఆమె వెయిట్ లిఫ్ట్ చేసే క్రమంలో గాయపడ్డారు. తాను చాలా విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ కమిట్ అయిన సినిమాలను తాను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు సినిమాలకు దూరమయ్యారు.

News March 31, 2025

‘నాన్న, తమ్ముడిని బాగా చూసుకో..’ అంటూ ఆత్మహత్య

image

నిజామాబాద్(TG) విద్యార్థి రాహుల్ మాదాల చైతన్య అలహాబాద్ ఐఐఐటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి జల్వాలోని హాస్టల్ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సూసైడ్‌కు ముందు ‘నాన్న, తమ్ముడిని బాగా చూసుకో అమ్మా..’ అని తల్లికి మెసేజ్ పెట్టాడు. దివ్యాంగుడైన రాహుల్ JEE మెయిన్స్‌లో ఆలిండియా 52వ ర్యాంక్ సాధించారు.