News January 29, 2025

అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి ‘పుష్ప-2’

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప-2’ మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానుంది. గురువారం నుంచి అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. దీంతో ఈరోజు అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘పుష్ప-2’ సినిమాను చూసేయొచ్చు. అయితే, రీలోడెడ్ వెర్షన్‌ మాత్రం కొద్దిరోజుల తర్వాతే రిలీజ్ కానుందని తెలిపింది. మరి ఈ సినిమా కోసం మీరూ వెయిట్ చేస్తున్నారా?

News January 29, 2025

ట్యాక్స్ వసూళ్లపై విమర్శలు.. మీరేమంటారు?

image

ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాక మిగిలిన డబ్బుతో EMIలో కారు కొంటే 48శాతం ట్యాక్స్ వసూలు చేయడంపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయ పన్ను 31.2% చెల్లించిన తర్వాత మళ్లీ ఎందుకు 48% ట్యాక్స్ కట్టాలంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘మీ దోపిడీకి హద్దు అదుపూ లేదా? మీ అసమర్థతతో దేశాన్ని మరింత వెనక్కి లాగుతున్నారు. ఇది పూర్తిగా సిగ్గుచేటు’ అని ఓ నెటిజన్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించారు.

News January 29, 2025

క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు

image

AP: మహా కుంభమేళాలో తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది తరలిరావడంతో అర్ధరాత్రి సెక్టార్-2 వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది మరణించారు.

News January 29, 2025

స్వతంత్ర భారత్: తొలి కుంభమేళాలో 800 మంది మృతి

image

ప్రయోగ్‌రాజ్ మహా కుంభమేళాలో అర్ధరాత్రి జరిగిన తొక్కిసలాటలో 20 మంది చనిపోవడం విషాదం నింపింది. అయితే దేశంలోని కుంభమేళాల్లో తొక్కిసలాట జరగడం ఇదేమీ తొలిసారి కాదు. స్వతంత్ర భారత్‌లో 1954లో నిర్వహించిన తొలి మేళాలో తొక్కిసలాట జరిగి 800 మంది మరణించారు. 1986లో హరిద్వార్‌లో 200 మంది, 2003లో నాసిక్‌లో 39 మంది, 2013లో అలహాబాద్‌లో 42 మంది ప్రాణాలు కోల్పోయారు.

News January 29, 2025

దేశవ్యాప్తంగా UCC అమలు సాధ్యం కాదు: డీకే శివకుమార్

image

దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి(UCC) అమలు అసాధ్యమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అభిప్రాయపడ్డారు. భారత్‌లోని భిన్నత్వం కారణంగా అది కుదరదని కొట్టిపారేశారు. ‘ప్రతి పౌరుడికి తన వ్యక్తిగత జీవితం ఉంటుంది. మొత్తం దేశమంతటా అమలుచేసేందుకు కుదరని చట్టాన్ని రాష్ట్రంలో మాత్రం ఎలా అమలు చేస్తారు?’ అని ప్రశ్నించారు. UCC అమలైతే పౌరులందరికీ ఒకే పౌరస్మృతి అమల్లోకి వస్తుందన్న సంగతి తెలిసిందే.

News January 29, 2025

టెస్టుల్లో 10,000+ రన్స్ చేసిన బ్యాటర్లు

image

సచిన్ టెండూల్కర్ (15,921), రికీ పాంటింగ్ (13,378), కలిస్ (13,289), రాహుల్ ద్రవిడ్ (13,288), జో రూట్ (12,972), అలిస్టర్ కుక్ (12,472), సంగక్కర (12,400), బ్రియాన్ లారా (11,953), చందర్‌పాల్ (11,867), జయవర్ధనే (11,814), బోర్డర్ (11,174), స్టీవ్ వా (10,927), సునీల్ గవాస్కర్ (10,122), యూనిస్ ఖాన్ (10,099), <<15298706>>స్టీవ్ స్మిత్<<>> (10,009*).

News January 29, 2025

తొక్కిసలాట ఘటన.. స్పందించిన సీఎం రేవంత్

image

TG: ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని కోరారు. రాష్ట్రం నుంచి అవసరమైన సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

News January 29, 2025

రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలివే

image

<<15299236>>తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.<<>> ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానాలకు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ ఉపాధ్యాయ స్థానానికి ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇక తెలంగాణలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ స్థానాలకు, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతాయి.

News January 29, 2025

తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

image

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. TGలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనుండగా ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతాయి. ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే నెల 11న నామినేషన్ల పరిశీలన, 13 తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు పూర్తి కానున్నాయి.

News January 29, 2025

మహాకుంభమేళాలో తొక్కిసలాట.. కీలక విషయాలు

image

మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి పలువురు మృతిచెందిన నేపథ్యంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మౌని అమావాస్య కావడంతో భక్తులు భారీగా వస్తారని, త్వరగా స్నానాలు చేసి వెళ్లిపోవాలని కుంభమేళా DIG వైభవ్ కృష్ణ అర్ధరాత్రి 12గంటల ప్రాంతంలోనే అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఘాట్‌ల వద్ద రాత్రంతా నిద్రపోవద్దని హెచ్చరించారు. ఈ మాటలు వినకపోవడం, రద్దీ ఊహించని విధంగా పెరగడంతో ఘటన జరిగినట్లు సమాచారం.