India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడును వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. ఇటీవల 175 MLA, 24 MP స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్.. అనకాపల్లి సీటును పెండింగ్లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బూడి మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ స్థానంలో ఆయన కూతురు ఈర్లి అనురాధను అభ్యర్థిగా వైసీపీ నియమించింది.
TG: కాంగ్రెస్ చేవెళ్ల పార్లమెంట్ సన్నాహక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడినవారికి బాధ్యతలు అప్పగిస్తానని అన్నారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తేనే ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ఎంపీల బలముంటే ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేసుకోవచ్చన్నారు. చేవెళ్లకు మెట్రో రైలు కూడా తీసుకురావొచ్చని అభిప్రాయపడ్డారు.
‘ఓం భీం బుష్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.21.75 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. చిత్రంలో హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కామెడీ టైమింగ్ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తోంది. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది.
TG: బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, కేసీఆర్ సన్నిహితుడు మదన్ రెడ్డి ఇవాళ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో భేటీ అయ్యారు. రేపోమాపో సీఎం రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల టైమ్లో మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు వెంకట్రామిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారట.
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు. ‘యాక్షన్ టైమ్ ఫర్ మిస్టర్ బచ్చన్’ అని పేర్కొన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్గా నటిస్తున్నారు.
పెద్ద హీరోల సినిమాలకు లాజిక్లతో పనిలేదని నిర్మాత నాగవంశీ అన్నారు. వారి సినిమాల్లో ఎలివేషన్స్ చూసి ఎంజాయ్ చేయాలన్నారు. సలార్లో ప్రభాస్ను చూసి అభిమానులు ఎంజాయ్ చేస్తే.. కొందరు మాత్రం సన్నివేశాల్లో లాజిక్ లేదని కామెంట్లు చేశారు. గుంటూరు కారంలో హీరో హైదరాబాద్ వెళ్లి రావడంపై రకరకాల కామెంట్స్ చేశారని అన్నారు. తీరా ఓటీటీలోకి వచ్చాక సినిమా బాగుందని మెసేజ్లు పెట్టారన్నారు.
TG: ఓ వైపు కవితకు రౌస్ అవెన్యూ కోర్టు జుడీషియల్ కస్టడీ విధించగా.. మరోవైపు ఈడీ విచారణ కొనసాగిస్తోంది. కవిత మేనల్లుడు మేకా శరణ్ను ఈడీ విచారిస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో నగదు బదిలీలో శరణ్ కీలక పాత్ర పోషించారని ఈడీ భావిస్తోంది. ఆయనను అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఇదే కేసులో అదుపులోకి తీసుకొని ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే.
లోక్సభ ఎన్నికల్లో BJP తరఫున బరిలోకి దిగుతున్న సీనియర్ నటి రాధిక నామినేషన్ పత్రాలను సమర్పించారు. తన ఆస్తుల విలువ రూ.53.45 కోట్లుగా ప్రకటించారు. 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, వస్తువులతో కలిపి రూ.27.05 కోట్ల చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు రూ.26.40 కోట్ల స్థిరాస్తులతో పాటు రూ.14.79 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు. ఆమె తమిళనాడులోని విరుదునగర్ నుంచి బరిలో ఉన్నారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇక నుంచి ఐదు టెస్టులు జరగనున్నాయి. ఈ మేరకు భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ కోసం షెడ్యూల్ ఖరారైంది. ఈ ఏడాది నవంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు సుమారు రెండు నెలలపాటు అక్కడే గడపనుంది. నవంబర్ 22వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. భారత్-ఆసీస్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుండటం 32 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం.
TG: రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తుల్లో ఎడిట్ చేసుకోవడానికి రేపు సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. వ్యక్తిగత వివరాల్లో ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు. గ్రూప్-1కు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి జరగనున్నాయి.
వెబ్సైట్: <
Sorry, no posts matched your criteria.