India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

‘కొత్త బంగారు లోకం’ హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్న సమయంలో తన ఎత్తును గుర్తు చేస్తూ సెట్లోని వారు ఎగతాళి చేసినట్లు తెలిపారు. హీరో దాదాపు 6 ఫీట్ల హైట్ ఉండటంతో ఇలా జరిగిందన్నారు. చాలా సీన్లు రీటేక్ చేశారని చెప్పారు. ఈ బ్యూటీ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకొని తెలుగు సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్లో నటిస్తున్నారు.

తెలంగాణ నుంచి బెంగళూరు వెళ్లే TGSRTC బస్సుల్లో డిస్కౌంట్ ఇస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఈ రూట్లో నడిచే అన్ని సర్వీసుల్లో రానుపోనూ టికెట్ ధరలో 10శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. దీని వల్ల ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.160 వరకు ఆదా అవుతుందన్నారు. దీంతో సూపర్ లగ్జరీ, NAC సీటర్, రాజధాని, AC సీటర్, AC స్లీపర్ ధరలు తగ్గుతాయని ఆయన ట్వీట్ చేశారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు వైసీపీ అధినేత YS జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆరోగ్యం, సుఖసంతోషాలు ప్రసాదించాలని Xలో పోస్ట్ చేశారు. AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాలోకేశ్ KCRకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కేసీఆర్ కుమార్తె MLCకవిత హ్యపిబర్త్డే డాడీ అని ట్వీట్ చేశారు, అనంతరం నందినగర్ వీరాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన పూజలో కవిత పాల్గొన్నారు.

భారత వ్యతిరేక అతిపెద్ద కుట్రలో కాంగ్రెస్ MP గౌరవ్ గొగోయ్ బహుశా బ్లాక్మెయిల్ లేదా ట్రాప్ అయ్యారేమోనని అస్సాం CM హిమంత అన్నారు. దర్యాప్తునకు ఆదేశించే ముందు మాట్లాడారు. ‘ఇది కేవలం గౌరవ్ గొగోయ్ అంశం కాదు. దీనివెనక భారత వ్యతిరేక శక్తులున్నట్టు మా వద్ద ఆధారాలు ఉన్నాయి. మొత్తం ఎకోసిస్టమ్లో గౌరవ్ ఒక పావు మాత్రమే. సూత్రదారి కాదు. ప్రస్తుతానికి మేం అతడిని నిందితుడిగా కాకుండా జాలితో చూస్తున్నాం’ అన్నారు.

ఏ లక్ష్యమైన సాధించాలంటే దానికి మానసికంగా, శారీరకంగా శక్తిమంతంగా ఉండాలని బాక్సర్ మేరికోమ్ అన్నారు. ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో విద్యార్థుల సందేహాలకు సమాధానమిచ్చారు. ఒకరు సాధించిన విజయాన్ని మనమెందుకు చేరుకోలేమని అన్నారు. తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ధైర్యంతోవాటిని ఎదుర్కొన్నానని తెలిపారు. మేరీకోమ్తో పాటు పారా ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ సుహాస్ యతిరాజ్ పాల్గొన్నారు

AP: ఇవాళ తుని మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్-2 ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. TDP-YCP శ్రేణులు రోడ్లపైకి రావడంతో గందరగోళం నెలకొంది. 2021 ఎన్నికల్లో 30 వార్డులను YCP క్లీన్స్వీప్ చేసింది. ఇటీవల 10మంది సభ్యులను చేర్చుకున్న TDP.. MLA దివ్య ఓటు సాయంతో పదవిని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అలాగే పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్, పాలకొండ మున్సిపల్ ఛైర్మన్ పదవులకూ నేడు ఎన్నిక జరగాల్సి ఉంది.

AP: కిడ్నాప్, దాడి వ్యవహారంలో అరెస్టై విజయవాడ జైలులో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ రేపు విజయవాడకు రానున్నారు. అనంతరం నేరుగా సబ్ జైలుకు వెళ్లి వంశీని పరామర్శించనున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు జగన్ భరోసా ఇవ్వనున్నారు.

ఆ బంగారు తల్లి పదో తరగతి చదువుతోంది. ఎవడో కామాంధుడి అకృత్యానికి గర్భం దాల్చింది. కూలిపనులు చేసుకునే ఆమె తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారు. తీరా 9 నెలలూ గడిచేసరికి ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. ఈ వయసులో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆమె శరీరం సహకరించలేదు. దీంతో ఆ బంగారుతల్లి ప్రాణాలు విడిచింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

చైనాకు చెందిన వు టియాంజెన్(31) అనే డాక్టర్ ఫిట్నెస్ జర్నీ వైరలవుతోంది. 2023లో 97.5 కేజీల బరువున్న అతను సాధనతో 42 రోజుల్లో 25 కేజీలు తగ్గారు. అథ్లెట్ల తరహాలో బాడీని తీర్చిదిద్దుకున్నారు. IFBB వరల్డ్ ఫిట్ మోడల్ ఛాంపియన్షిప్ సహా పలు ఫిట్నెస్ పోటీల్లో పాల్గొని అవార్డులు సొంతం చేసుకున్నారు. రోజూ 2గంటల వ్యాయామం, 6 గంటల నిద్ర, మంచి ఆహారం, క్రమశిక్షణ తన వెయిట్ లాస్కు దోహదం చేశాయని అతను చెబుతున్నారు.

TG: BRS ప్రభుత్వం నిర్మించి ఎవరికీ కేటాయించని డబుల్ బెడ్రూం ఇళ్లను L2 జాబితాలోని వారికి ఇవ్వాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాను L1(సొంత స్థలం ఉన్నవారు), L2(స్థలం లేనివారు), L3(ఇళ్లు ఉన్నా దరఖాస్తు చేసుకున్నవారు)గా విభజించిన విషయం తెలిసిందే. L2లో 19.6 లక్షల మంది ఉన్నారు. వీరిలో దాదాపు 80వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.