India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శబరిమలకు 26 స్పెషల్ రైళ్లను నడపనుంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మధ్య ఇవి ప్రయాణించనున్నాయి. నవంబర్ 18, 20, 22, 24, 25, 27, 29 తేదీల్లో.. డిసెంబర్ 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16, 18, 20, 22, 23, 25, 27, 29, 30.. జనవరి 01 తేదీల్లో అందుబాటులో ఉండనున్నాయి. భక్తులు స్పెషల్ రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
TG: వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ప్రధాన నిందితుడు సురేశ్కు కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇతనితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ముగ్గురు నిందితులను కొడంగల్ నుంచి సంగారెడ్డి జైలుకు తరలించనున్నారు. లగచర్ల దాడి కేసులో A2గా ఉన్న సురేశ్ ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. A1 పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.
AP: హైవేల తరహాలో రాష్ట్ర రహదారులపైనా టోల్ ఫీజు విధింపునకు యోచిస్తున్నట్లు CM చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. ప్రయోగాత్మకంగా గోదావరి జిల్లాల్లో అమలు చేద్దామని ప్రతిపాదించారు. దీనిపై MLAల అభిప్రాయం కోరగా ఆలోచన బాగుందని అందరూ మద్దతు పలికారు. టోల్ వద్దంటే గుంతల రోడ్లపైనే తిరగాల్సి వస్తుందని CM అన్నారు. గ్రామాల నుంచి మండలాల వరకు బైక్లు, ఆటోలు, ట్రాక్టర్లకు టోల్ నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
AP: నవంబర్ 21న దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర నిర్వహణ శాఖ తెలిపింది. నవంబర్ 23 నాటికి ఇది అల్పపీడనంగా మారుతుందని, ఆ తర్వాత వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
లగచర్ల ఘటనలో వాస్తవాలను తొక్కిపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR ట్విటర్లో ఆరోపించారు. ‘లగచర్లకు పట్టపగలు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యమా? కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా? ఇప్పటికే లగచర్లలో కాంగ్రెస్ కిరాతకం ఢిల్లీకి చేరింది. మీ అరాచకపర్వంపై తీవ్ర చర్చ జరుగుతోంది. లగచర్లలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి’ అని డిమాండ్ చేశారు.
US అధ్యక్ష ఎన్నికల్లో ద్రవ్యోల్బణం ట్రెండింగ్ టాపిక్గా నిలిచినట్లు గూగుల్ వేవ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెల్లడించింది. 2020తో పోలిస్తే 114% అధికంగా దీని గురించే సెర్చ్ చేశారని తెలిపింది. ఆ తర్వాత పెన్షన్ ఫండ్స్(76%), బడ్జెట్ లోటు(39%) అంశాలు ఉన్నాయంది. రేసిజం, స్టూడెంట్ లోన్స్, గన్ కంట్రోల్పై చర్చ బాగా తగ్గిందని పేర్కొంది. 2020లో ఎలక్ట్రోరల్ ఫ్రాడ్, 2016లో ఒపీనియన్ పోల్ ట్రెండింగ్లో నిలిచాయి.
TG:కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన GO 16ను <<14652442>>హైకోర్టు <<>>కొట్టేసింది. ఈ GO ప్రకారం మొత్తం 5,544 మంది రెగ్యులరైజ్ కాగా ఇందులో 2909 మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది ఒకేషనల్ లెక్చరర్లు, 390 మంది పాలిటెక్నిక్, 270మంది డిగ్రీ కాలేజీ లెక్చరర్లు కాగా, టెక్నికల్ విద్యాశాఖలో 131 మంది, మెడికల్లో 837 మంది, 179 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, మిగతావారు ఫార్మాసిస్టులు, సహాయకులు ఉన్నారు.
పాకిస్థాన్లో ఈ నెల 23 నుంచి వచ్చే నెల 3 వరకు జరిగే అంధుల టీ20 క్రికెట్ వరల్డ్ కప్ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ ఇండియా తప్పుకొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత అంధుల క్రికెట్ అసోసియేషన్(IBCA) ప్రధాన కార్యదర్శి శైలేంద్ర యాదవ్ తెలిపారు. తమతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా పాక్కు వెళ్లడం లేదని వెల్లడించారు.
మలయాళ నటుడు <<14650875>>సిద్ధిఖ్<<>> రేప్ కేసు విచారణలో SC వ్యాఖ్యలు చర్చనీయంగా అయ్యాయి. 2016లో సిద్ధిఖ్ తనపై లైంగిక దాడి చేశారని ఓ మహిళ మీటూ ఉద్యమం టైమ్లో FBలో రాసుకొచ్చారు. తర్వాత FIR ఫైల్ అయింది. ‘FBలో రాయడానికి ధైర్యమున్నప్పుడు ఎనిమిదేళ్లుగా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు’ అని కోర్టు ప్రశ్నించింది. కొన్ని కేసుల్లో భయపడి ఫిర్యాదు చేయకపోవడం, కొన్నింట్లో కావాలనే ఇరికిస్తుండటంతో వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.
ఈరోజు నుంచి మొదలయ్యే డేవిస్ కప్ అనంతరం టెన్నిస్ దిగ్గజం నాదల్ రిటైరవనున్నారు. ఈ నేపథ్యంలో మరో దిగ్గజ ఆటగాడు ఫెదరర్ ఆయనకు లేఖ రాశారు. ‘20 ఏళ్ల క్రితం తొలిసారి నీతో ఆడాను. ఎన్నో జ్ఞాపకాలున్నాయి. నీ సక్సెస్లో తిరుగులేని పాత్ర పోషించిన మీ కుటుంబం, సపోర్ట్ టీమ్ను అభినందిస్తున్నాను. ఈ పాత మిత్రుడు ఎప్పుడూ నీ గెలుపు కోసమే చూస్తుంటాడని మర్చిపోకు. ఎప్పటికీ నీ ఫ్యాన్.. రోజర్’ అని రాశారు.
Sorry, no posts matched your criteria.