India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని చూస్తోందని హరీశ్ రావు అన్నారు. ‘రైతుబంధు కంటే సన్నాలకిచ్చే ₹500 బోనసే మేలు అని రైతులు అంటున్నట్లు మంత్రి తుమ్మల చెబుతున్నారు. 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లకు దక్కిన బోనస్ ₹26cr. అదే రైతుబంధు కింద ఏడాదికి ₹7500cr రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. మరి రైతుబంధు కంటే బోనస్ అందించడం రైతులకు మేలు ఎలా అవుతుంది?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సాధారణంగా మొక్కజొన్న కంకులు పచ్చరంగులోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే, అమెరికాలో పండే హెర్లూమ్ మొక్కజొన్న ఇంద్రధనుస్సు రంగులతో ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని ఫొటోలను నెటిజన్లు ట్వీట్స్ చేస్తూ ‘ఇంత అందంగా ఉంటే ఎలా తింటాము’ అని పోస్టులు పెడుతున్నారు. దీనిని అక్కడి ప్రజలు ‘ఇండియన్ కార్న్’ అని పిలుస్తుంటారు. కార్న్ లియోన్ బర్న్స్ అనే వ్యక్తి ఈ మొక్కజొన్నను సృష్టించారు.

అమెరికాలో తుపాకీ తూటాలకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. చికాగో వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రాపర్తినగర్కు చెందిన నూకరపు సాయితేజ (26)చనిపోయాడు. సాయితేజ MS చదవడానికి 4 నెలల క్రితమే US వెళ్లాడు. అతడు షాపింగ్ మాల్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తుండగా దొంగతనానికి వచ్చిన దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 6 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టులో రోహిత్ శర్మ, గిల్, రవీంద్ర జడేజా ఎంట్రీ ఖాయమని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్, ఫస్ట్ డౌన్లో గిల్ బ్యాటింగ్ చేస్తారన్నారు. పడిక్కల్, జురెల్, వాషింగ్టన్ సుందర్ బెంచ్కు పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పారు. తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

‘రక్తచరిత్ర’ సినిమాలో పరిటాల రవి రోల్లో నటించిన వివేక్ ఒబెరాయ్ గుర్తున్నారా? ఆయన ఫ్లాప్ హీరోగా అపకీర్తి సంపాదించుకున్నప్పటికీ మరో రంగంలో చక్రం తిప్పుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేసి ఎంతో శ్రమించి రూ.1200 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆయన వివిధ సంస్థలు, ఓ ప్రైవేటు యూనివర్సిటీలోనూ పెట్టుబడులు పెట్టారు. దీంతో ఎంతో మంది స్టార్ నటుల కంటే ధనవంతుడయ్యారు.

పెళ్లి వేడుకల్లో కాక్టైల్, లిక్కర్ పార్టీలు ఇప్పుడు సర్వసాధారణమయ్యాయి. వివాహ సమయంలో వధూవరులు, బంధువులు హ్యాంగోవర్తో ఇబ్బంది పడకుండా వెడ్డింగ్ ప్లానర్స్ డిటాక్స్ బార్లను ఏర్పాటుచేయడం పెరిగింది. ఇందులో ఫ్రెష్ జ్యూసెస్, వెల్నెస్ డ్రింక్స్తో IV డ్రిప్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కొత్త ట్రెడిషన్ ప్లాన్కు మంచి ఆదరణ లభిస్తోంది. అతిథులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొనడానికి ఉపయోగపడుతోంది.

తమ అధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాలను నాటో కిందికి తీసుకొస్తే రష్యాతో యుద్ధంలో కీలక దశను ఆపేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్ మొత్తానికి నాటో మెంబర్షిప్ ఇవ్వాలని, ముందుగా అంతర్జాతీయ సరిహద్దు భూభాగాలకు నాటో భద్రత కల్పించాలన్నారు. అలా చేస్తే ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉన్న భూభాగాలను దౌత్యమార్గంలో తిరిగి పొందడానికి చర్చలు జరుపుతామన్నారు. కానీ ఇది సాధ్యం కాకపోవచ్చని చెప్పారు.

నైజీరియాలోని నైజర్ నదిలో <<14745791>>పడవ బోల్తా<<>> పడిన ఘటనలో 27 మంది మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పడవలో సుమారు 200 మంది ఉన్నట్లు తెలుస్తుండగా ఇంకా 100 మంది ఆచూకీ లభ్యం కాలేదని తెలిపింది. కోగి రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రమైన నైజర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ బృందం గల్లంతైన వారికోసం గాలింపు చేస్తోంది.

AP: నేటి నుంచి తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం అమలవుతుందని టీటీడీ ప్రకటించింది. కొంతమంది రాజకీయ నాయకులు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ విమర్శలు, ప్రసంగాలు చేయడం పరిపాటిగా మారిందని తెలిపింది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధిస్తున్నామని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ DEC 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా 12000+ థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇండియాలో 8500+ స్క్రీన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. డిమాండ్ దృష్ట్యా మరిన్ని స్ర్కీన్లు సిద్ధం చేస్తామన్నాయి. కాగా భారతీయ చరిత్రలో అత్యధికంగా 9000+ స్క్రీన్స్లో బాహుబలి-2 రిలీజ్ చేసినట్లు తెలిపాయి.
Sorry, no posts matched your criteria.