News November 22, 2024

PAC ఎన్నికపై మండలిలో నిరసన

image

AP: పీఏసీ ఎన్నికపై శాసనమండలిలో YCP సభ్యులు నిరసన తెలిపారు. వేరే సభలో అంశం ఇక్కడ వద్దని మండలి ఛైర్మన్ వారిని వారించారు. దీంతో వారు మండలి నుంచి వాకౌట్ చేశారు. జగన్ ఎందుకు ఓటింగ్‌కు రాలేదని మంత్రి లోకేశ్ ప్రశ్నించారు. ఎందుకు వాకౌట్ చేస్తున్నారో క్లారిటీ ఇవ్వాలని కోరారు. అటు అసెంబ్లీలో వివిధ కమిటీ సభ్యుల ఎన్నికకు ఇప్పటి వరకు 163మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. సీఎం చంద్రబాబు ఓటింగ్‌లో పాల్గొన్నారు.

News November 22, 2024

విశ్వక్‌సేన్ ‘మెకానిక్ రాకీ’ రివ్యూ&రేటింగ్

image

మెకానిక్‌గా పనిచేసే హీరో జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదే సినిమా. థ్రిల్లింగ్‌ ట్విస్టులతో సెకండాఫ్‌ ఆకట్టుకుంటుంది. కథలో తర్వాత ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీని డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి అభిమానుల్లో పెంచారు. విశ్వక్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఫస్టాఫ్‌లో ఊహించే సన్నివేశాలు, స్లోగా సాగడం, కామెడీ పండకపోవడం, క్లైమాక్స్ మైనస్.
రేటింగ్: 2.5/5

News November 22, 2024

అదానీ షేర్లు: నష్టాల్లోంచి క్షణాల్లో లాభాల్లోకి..

image

అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు నేడు కళకళలాడుతున్నాయి. నిన్నటి నష్టాల నుంచి రికవరీ బాట పట్టాయి. నేటి ఉదయం మోస్తరు నష్టాల్లో మొదలైన షేర్లు మొత్తంగా 6%మేర లాభపడ్డాయి. అదానీ ఎనర్జీ (-4%) మినహా మిగిలిన 10 కంపెనీల షేర్లూ ఎగిశాయి. అంబుజా సిమెంట్స్, ఏసీసీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 5%, సంఘి ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, అదానీ టోటల్ గ్యాస్ 4%, పవర్, గ్రీన్ ఎనర్జీ, NDTV, విల్మార్ 0.5 నుంచి 2% మేర పెరిగాయి.

News November 22, 2024

STOCK MARKETS: రూ.5లక్షల కోట్ల లాభం

image

దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాల నుంచి పూర్తిగా కోలుకున్నాయి. మధ్యాహ్నం రోజువారీ గరిష్ఠ స్థాయులకు చేరాయి. సెన్సెక్స్ 78,179 (+1019), నిఫ్టీ 23,671 (+321) వద్ద ట్రేడవుతున్నాయి. సూచీలు అనూహ్యంగా పుంజుకోవడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.5లక్షల కోట్ల మేర పెరిగింది. నిఫ్టీ50లో AXIS BANK మినహా అన్ని షేర్లూ లాభాల్లోనే ఉన్నాయి. ఉదయం నష్టపోయిన ADANIENT, SBI, ADANIPORTS ఇప్పుడు టాప్ గెయినర్స్‌గా అవతరించాయి.

News November 22, 2024

రేపే RESULTS DAY: గుంభనంగా మహారాష్ట్ర

image

మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం గుంభనంగా మారింది. శనివారం ఎన్నికల ఫలితాలు వస్తుండటంతో అన్ని పార్టీల నేతలు ఆత్రుత చెందుతున్నారు. ఎక్కువ ఎగ్జిట్‌పోల్స్ BJP+ గెలుస్తుందని అంచనా వేసినా మరికొన్ని నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ జరిగిందని చెప్తున్నాయి. దీంతో అసలు ఫలితాలు వెల్లడయ్యేంత వరకు నేతలకు టెన్షన్ తప్పడం లేదు. BJP, కాంగ్రెస్, 2 శివసేనలు, 2 NCPలు లోపల ఆందోళన చెందుతున్నా పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి.

News November 22, 2024

BREAKING: భారత్ ఆలౌట్

image

BGT: తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో భారత్ 150 రన్స్‌కే ఆలౌటైంది. తెలుగు క్రికెటర్ నితీశ్‌రెడ్డి 41 పరుగులతో పోరాడారు. పంత్(37), రాహుల్(26) కుదురుకున్నట్లు కనిపించినా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. జైస్వాల్(0), పడిక్కల్(0), కోహ్లీ(5), జురెల్(11), సుందర్(4), రాణా(7) బుమ్రా(8) నిరాశపర్చారు. హేజిల్‌వుడ్ 4, స్టార్క్ 2, మార్ష్ 2, కమిన్స్ 2 వికెట్లు తీశారు.

News November 22, 2024

నడ్డా లేఖలో అన్నీ అబద్ధాలే: జైరామ్ రమేశ్

image

మణిపుర్ వివాదంపై ఖర్గేకు JP నడ్డా రాసిన <<14675488>>లేఖ<<>>లో అన్నీ అబద్ధాలే ఉన్నాయని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ విమర్శించారు. అందులో DENIAL, DISTORTION, DISTRACTION, DEFAMATIONతో కూడిన ‘4D ఎక్సర్‌సైజ్’ మాత్రమే ఉందని వివరించారు. ‘రాష్ట్రానికి PM ఎప్పుడొస్తారు? మెజార్టీ MLAలు వ్యతిరేకిస్తున్నా CM ఎందుకు కొనసాగుతున్నారు? వైఫల్యాలకు అమిత్ షా ఎప్పుడు బాధ్యత తీసుకుంటారు’ అని మణిపుర్ ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు.

News November 22, 2024

డిసెంబర్ నుంచి పెన్షన్ల పెంపు?

image

TG: వచ్చే నెల 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి కానుంది. ఆలోగా ఆసరా పెన్షన్ల పెంపు, రైతు భరోసా పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం ఆసరా పింఛన్లకు ₹2,016, దివ్యాంగ పింఛన్లకు ₹3,016 ఇవ్వగా, తాము ఆసరా పింఛను ₹4,000, దివ్యాంగ పింఛన్ ₹6,000 చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రైతు భరోసా కింద ఏటా ఎకరాకు ₹15,000 అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

News November 22, 2024

శాసనమండలిలో మాటల యుద్ధం

image

AP: శాసనమండలిలో EBC రిజర్వేషన్లపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. గత ప్రభుత్వ DBT విధానం వల్ల చాలామంది గంజాయి బారినపడ్డారని మంత్రి సవిత అన్నారని, ఆమె ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇరుపక్షాలు వాదనకు దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, రికార్డుల నుంచి వాటిని తొలగిస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.

News November 22, 2024

PAC ఎన్నికను బాయ్‌కాట్ చేసిన YCP

image

AP: PAC ఛైర్మన్‌ పదవిని ఎప్పటి నుంచో ప్రతిపక్షానికే కేటాయిస్తున్నారని, అందుకు విరుద్ధంగా ఎన్నిక నిర్వహిస్తున్నారని YCP నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అందుకే PAC ఎన్నికను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎప్పుడూ అధికార పక్షం ఈ పదవిని తీసుకోలేదని, అవినీతి జరగకుండా పీఏసీ వాచ్‌డాగ్‌ లా పని చేస్తుందన్నారు. అధికార పక్షం ఆ ఛైర్మన్ పదవి తీసుకుంటే ఏం న్యాయం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.